1

1

Sunday 21 September 2014

రూ.వేల కోట్లు వెన‌కేసుకుంటున్న చంద్ర‌బాబు అండ్ కో

May 24, 2014
ఎన్నిక‌లు ముగిశాయి... పీఠం ఎక్కేందుకు చంద్ర‌బాబు సిద్ధ‌మ‌వుతున్నాడు. ఆయ‌న ప‌చ్చ ప‌త్రిక‌ల్లో గుంటూరు రాజ‌ధాని కావ‌చ్చ‌ని లీకులు ఇస్తున్నారు. మ‌రి... ఈ విష‌యాన్ని చంద్ర‌బాబు ఎందుకు ప్ర‌క‌టించ‌డం లేదు. దీని వెన‌క ఓ మాఫియా త‌యారైంది. చంద్ర‌బాబు బినామీలు సీఎం ర‌మేష్‌, నామా నాగేశ్వ‌ర‌రావు, ముర‌ళీమోహ‌న్‌, రాధాకృష్ణ‌, రామోజీలు ఇలా చాలా మంది ముందుగా వంద‌ల ఎక‌రాలు కొనుగోలు చేసిన త‌ర్వాత రాజ‌ధాని ప్ర‌క‌టించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. దీని వెన‌క వేల కోట్ల రూపాయ‌లు చేతులు మారుతున్నాయి. ఈ ఆరోప‌ణలు నిజం కాక‌పోతే చంద్ర‌బాబు వెంట‌నే ప‌చ్చ ప‌త్రిక‌ల్లో వ‌చ్చిన లీకుల‌ను ఖండించాలి... లేదంటే అధికారికంగా రాజ‌ధాని ప‌లానా ప్రాంతం కావాల‌ని ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాలి. ఇవేవీ చేయ‌కుండా త‌న అనుయాయులు అంతా భూములు కొనుగోలు చేసిన త‌ర్వాత ప్ర‌క‌టిస్తే ఈ ఆరోప‌ణలు అక్ష‌ర‌స‌త్యం అని అంగీరించిన‌ట్లే.

No comments:

Post a Comment