1

1

Sunday 21 September 2014

ఎన్డీయేను కూడా జేపీ వాడుకుంటారా చూడాలి...!!!!

May 17, 2014

జేపీకి ఈనాడు ప‌త్రిక ఇచ్చిన క‌వ‌రేజీలో 20 శాతం మైనంప‌ల్లికి ఇచ్చి ఉంటే క‌చ్చితంగా మ‌ల్కాజిగిరిలో ఆయ‌న భారీ మెజారిటీతో గెలిచే వారు...
ఈనాడు రంగారెడ్డి జిల్లా సంచిక‌లో దాదాపు ఒక పేజీ రోజూ జేపీకి కేటాయించారు.. మిగ‌తా అభ్య‌ర్థులంద‌రికీ ఒక పేజీ కేటాయించారు... ఇక జోన్ పేజీల్లోనూ ఇదే వైఖ‌రి.... ఎంత ప్ర‌చారం చేసినా జేపీ ఓడిపోయాడు...!!! 
ఆయ‌న ఓట‌మికి కార‌ణాలు విశ్లేషించే ఛానెల్ ఏదీ లేదు.... ఇదే ఓట‌మి టీఆర్ఎస్‌కు వ‌స్తే మాత్రం చీల్చి చెండాలే వాళ్లు.... ఎంతైనా మ‌న కుల పోడు.. మ‌న ప్రాంతం వాడు అన్న‌రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నాయి ఆంద్రా మీడియా సంస్థ‌లు...

రేపు జేపీ ఢిల్లీకి వెళ్లి మోడీని అడిగి ఏదైనా పోస్టు కోసం పైర‌వీ చేసుకుంటారా?
లేదా వెంక‌య్య‌నాయుడు, రామోజీరావు గారు జేపీ కోసం పైర‌వీ చేసి ఏదైనా ప‌ద‌వి ఇప్పిస్తారా? అన్న‌ది వేచిచూడాలి..
గతంలో సోనియాగాంధీ కూడా ఈయ‌న‌కు జాతీయ స‌ల‌హా మండ‌లిలో చోటు ఇచ్చిన‌ట్లు గుర్తు....
ఇప్పుడు ఎన్డీయేను కూడా జేపీ వాడుకుంటారా చూడాలి...!!!!

No comments:

Post a Comment