1

1

Tuesday 29 July 2014

బాబుగారు బియాస్ బాధితుల ప‌రిహారం ఎప్పుడిస్తారు?


బియాస్ మృతుల కుటుంబాల‌కు రూ.5ల‌క్ష‌ల ప‌రిహారం ఇస్తామ‌న్న చంద్ర‌బాబునాయుడుగారు ఇప్ప‌డు మాట త‌ప్పితే ఈనాడు ప‌త్రిక‌కు, ఆంధ్ర‌జ్యోతి ప‌త్రిక‌ల‌కు క‌నిపించ‌డం లేదా? బాధితులు నిన్న మీడియా ముందుకు వ‌చ్చినా ఆ వార్త‌ను ఎందుకు క‌వ‌ర్ చేయ‌లేదు...?
ఇదే ప‌ని తెలంగాణ ప్ర‌భుత్వం చేస్తే ఈ పాటికి నింగీ నేల‌ను ఏకం చేసేలా గ‌గ్గోలు పెట్టేవారు కాదా? అస‌లు బియాస్ బాధితుల‌కు ప‌రిహారం ప్ర‌క‌టించి ప్ర‌చారం చేయించుకున్న బాబుగారు ఇప్పుడు మౌనం వ‌హించ‌డం ఏమిటి? ఇదంతా వీఎన్ఆర్ కాలేజీని కాపాడేందుకు దుర్ఘ‌ట‌న స‌మ‌యంలో ఆడిన డ్రామాలాగా అనిపిస్తోంది...

https://www.youtube.com/watch?v=QnUGxG3vCXM

బియాస్ బాధితుల‌కు బాబు ద్రోహం..

బియాస్ న‌దిలో తెలుగు విద్యార్థులు మృతిచెందిన స‌మ‌యంలో బాబుగారు ఇచ్చిన హామీ ఇది.. ఈ వీడియో చూడండి... !!
కానీ బాబుగారు ప‌రిహారం మాట‌ను బియాస్ న‌దిలోనే క‌లిపేశారు.. ప్ర‌చారం మాత్రం భారీగా పొందారు..

https://www.youtube.com/watch?v=QnUGxG3vCXM

సూశిండ్రా... దెబ్బ‌కు ద‌య్యం వ‌దులుతుందంటే ఇదే!.


సూశిండ్రా... దెబ్బ‌కు ద‌య్యం వ‌దులుతుందంటే ఇదే!. నిన్న‌టిదాకా సోకాల్డ్ మేధావులు, కొమ్మినేనిలాంటి ఏక‌ప‌క్ష జ‌ర్న‌లిస్టులు, అంతెందుకు ఈనాడు సంస్థ‌లో నెల‌కు ల‌క్ష జీతం తీసుకున్న వారి నుంచి ట్రెయినీ రిపోర్ట‌ర్ల వ‌ర‌కు త‌మ ఫేసుబుక్‌ల్లో ***హైద‌రాబాద్‌ను అభివృద్ధి చేసింది మేమే... అందుకే దివి నుంచి భువికి దిగిన‌ట్లు, సీమాంధ్ర నుంచి న‌గ‌రానికి వ‌చ్చాం. అంటూ ఒక‌వైపు చార్మినార్ బొమ్మ‌, మ‌రోవైపు హైటెక్ సిటీ బొమ్మ పెట్టి శున‌కానందం పొందారు. మ‌రి గీరోజు వ‌చ్చిన క‌థ‌నంలో వాళ్ల గోస చూడండి. అందితే జుట్టు... లేక‌పోతే కాళ్లు అన్న‌ట్లు... సీమాంధ్ర విద్యార్థుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం నుంచి ఉప‌కార వేత‌నాలు, ఫీజులు ఇప్పించేందుకు ఎంత‌టి వాస్త‌వానికి వ‌చ్చి క‌థ‌నాలు రాస్తున్నారో. ఈరోజు ఈనాడులో వండివార్చిన క‌థ‌నంలో వారి బాధ చూస్తుంటే నవ్వేస్తుంది. ***రెండు త‌రాల కింద‌ట పొట్ట‌కూటి కోసం ఇక్క‌డికి వ‌చ్చార‌ట‌**** ఈ విద్యార్థుల మూలాలు అన్నీ సీమాంధ్ర‌లో ఉన్నాయ‌ట‌...**** వారెవ్వా ప్ర‌భుదేవా!. మ‌రి నిన్న‌టిదాకేమో తెలంగాణ‌ను అభివృద్ధి చేయ‌డానికి, తెలంగాణోళ్ల‌కు చెడ్డీలు వేయ‌డం నేర్ప‌డానికి వ‌చ్చిన‌ట్లు ఫోజులు కొట్టిండ్రు. మ‌రి గియ్యాలేమైంది బిడ్డా. ఇంత‌కీ మూలాలు అంటే ఏందో?. అవి త‌రాలు మారినా గ‌ట్ల‌నే ఉంట‌యా?. మ‌రి అక్క‌డ మూలాలు ఉన్నోళ్ల‌కు గిక్క‌డ ఫీజులెందుకు క‌ట్టాలి?. రాసే ప్ర‌తి అక్ష‌రంలో గిట్ల ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకొని రాస్తే భ‌లే బాగుంటుంది క‌దా. అయినా... కుక్క తోక వంక‌ర అన్న‌ట్లు మీరు మార‌తారా??. ఫీజుల గండం గ‌ట్టెక్కించి, చంద్రాలుకు స‌హాయం చేసేందుకు గీ క‌థ‌ల‌న్నీ ప‌డుతుండ్రు. మాకు తెల్వ‌దా. ఇదేదో 1960-70 ద‌శ‌కంలోని తెలంగాణ కాదు. మీరు క‌ట్టుబ‌ట్ట‌ల‌తో వచ్చిన‌మ‌న్నా... బ‌రిబత్త‌ల సీమాంధ్ర నుంచి ఇక్క‌డికి వ‌చ్చిన‌మ‌న్నా... క‌రుణించెటోడు ఎవ‌డూ లేడు. ఎందుకంటే
ఇది గాయ‌ప‌డిన తెలంగాణ‌...
వేలాదిసార్లు క‌డుపుకోత‌ను అనుభ‌వించిన తెలంగాణ‌...
ఆరు ద‌శాబ్దాల పాటు త‌మ సంస్కృతి, సంప్ర‌దాయాల‌ను అవ‌మానించినా వాటిని డొక్క‌ల్ల దాచుకొని స‌మ‌యం కోసం ప‌డిగాపులు కాసిన తెలంగాణ‌...
అన్ని రంగాల్లో నిలువునా మోస‌పోతున్నా భావి త‌రాలైనా స‌ల్ల‌గుండాల‌ని లాఠీలు, తూటాలకు గుండెను ఎదురొడ్డిన తెలంగాణ‌... అన్నింటికీ మించి తాను బ‌తికేందుకు ప‌క్కోని శ‌రీరాన్ని సైతం పీక్కుతినేందుకు వెనుకాడ‌ని ఈరోజుల్లో ఒక ప్రాంత స్వేచ్ఛా వాయువుల కోసం వంద‌ల‌సార్లు అగ్నిదేవుడికి త‌నువును అప్ప‌గించిన తెలంగాణ...
అక్ష‌రాల‌తో, క‌ట్టు క‌థ‌ల‌తో, మాయ మాట‌ల‌తో మోసం చెయ్య‌లేరు. 1956 ఒక్క నిబంధ‌న‌తోనే వాస్త‌వాల రాక మీ నోటి నుంచి మొద‌లైంది. ముందుంది ముస‌ర్ల పండ‌గ‌. చెట్టుమీదున్న బేతాళుడు దిగి వ‌చ్చి స‌చ్చిన‌ట్లు అన్నీ నిజాలే చెప్తాడు. ఆ రోజు ఎంతో దూరంలో లేదు.
జై తెలంగాణ‌... జైజై తెలంగాణ‌

దీని భావ‌మేమి రామోజీగారు...?


తెలంగాణ ఎడిష‌న్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం ఫొటో వేస్తారు..
మ‌రి ఆంధ్ర‌ప్ర‌దేవ్ ఎడిష‌న్లో తెలంగాణ సీఎం బొమ్మ వేయ‌లేదు ఎందుకు?
వార్త శైలి కూడా పూర్తి భిన్నంగా ఉందెందుకు?



విప్రో ఛైర్మ‌న్ అజిమ్ ప్రేమ్‌జీ గారు మొన్న తెలంగాణ సీఎం కేసీఆర్‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం చంద్ర‌బాబుతో భేటీ అయ్యారు... అయితే తెలంగాణ ఎడిష‌న్లో మొద‌టి పేజీలో కేసీఆర్‌, చంద్ర‌బాబుతో అజిమ్ ప్రేమ్‌జీ భేటీ అయిన వార్త‌ను ఈనాడు పేప‌ర్లో వేశారు.. అలాగే రెండు రాష్ట్రాల్లోనూ ప‌రిశ్ర‌మ‌లు స్థాపిస్తామ‌ని చెప్పారు.. అయితే తెలంగాణ ఎడిష‌న్లో రెండు రాష్ట్రాల్లో ప‌రిశ్ర‌మ‌లు స్థాపించ‌డానికి ప్రేమ్ జీ ముందుకొస్తున్న‌ట్లు వార్త‌ను రాశారు...
ఇక ఆంధ్రా ఎడిష‌న్‌కు వెళ్తే పూర్తిగా ఆంధ్రాలో స్థాపించే ప‌రిశ్ర‌మ‌ల వివ‌రాల‌తో మొద‌టి పేజీ వార్త‌ను వ‌డ్డించారు... తెలంగాణ‌లో ఆంధ్రా వార్త‌ను రాసిన‌ప్పుడు.. ఆంధ్ర రాష్ట్రంలోనూ తెలంగాణ సీఎంను విప్రో ఛైర్మ‌న్ క‌లిసిన ఫొటోను ఎందుకు మొద‌టి పేజీలో వేయ‌లేదు.. అంటే ప్రేమ్ జీ కేవ‌లం చంద్ర‌బాబునే క‌లిశార‌ని అక్క‌డి ప్ర‌జ‌ల‌ను న‌మ్మించ‌డం మీ ఉద్దేశ‌మా?   అదే స‌మ‌యంలో కేసీఆర్‌ను మాత్ర‌మే కాదు చంద్ర‌బాబును కూడా ప్రేమ్ జీ క‌లిశాడ‌ని తెలంగాణ ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌న్న ఆత్రుత‌తో ఇదంతా చేశారా?   ప్రతి వార్త వెన‌క‌, ప్ర‌తి ఫొటో వెన‌క ఇంత విషం నింపుకుని రాయ‌డం ఎందుకు?   తెలంగాణ, ఆంధ్ర ప్ర‌జ‌ల‌ను ఇంకెన్ని రోజులు వంచించాల‌ని అనుకుంటున్నారు...?


Friday 25 July 2014

బీజేపీ నేత ల‌క్ష్మ‌ణ్ గారికి కృత‌జ్ఞ‌త‌లు...

తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డి దాదాపు 50 రోజులు దాటినా దేశంలో ఇంకా కొన్ని మారుమూల ప్రాంతాల ప్ర‌జ‌ల‌కు కొత్త రాష్ట్రం  ముచ్చ‌ట్లు తెలియ‌డం లేదు.. ఎందుకంటే మీడియా మంచి విష‌యాల‌ క‌న్నా సంచ‌ల‌నాలు, వివాదాస్ప‌దాల‌కే ప్రాధాన్యం ఇస్తుండ‌టం వ‌ల్లే..  కానీ టెన్నిస్ స్టార్‌ సానియా మిర్జాను తెలంగాణ రాష్ట్ర‌ బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా పెట్టుకోవ‌డంపై మ‌న బీజేపీ నేత ల‌క్ష్మ‌ణ్ గారు చేసిన విమ‌ర్శ‌ల వ‌ల్ల గ‌త రెండు మూడు రోజులుగా తెలంగాణ పేరు దేశ‌మంతా(నాకు తెలిసి ప్ర‌పంచంలోని కొన్ని దేశాల్లోనూ చ‌ర్చ‌నీయాంశం అయి ఉండొచ్చు) మారుమోగింది...


 మ‌న రాష్ట్రానికి ప్ర‌చారం చేయ‌డానికి, మ‌న‌కున్న‌ పాపులారిటీని మ‌రింత‌ పెంచ‌డానికి, మ‌న గుర్తింపును ద్విగుణీకృతం చేయ‌డానికి బ్రాండ్ అంబాసిడ‌ర్ల‌ను పెట్టుకుంటారు.. సానియా మిర్జాను ఎంపిక చేయ‌డ‌మే త‌రువాయి పాపం లక్ష్మ‌ణ్ గారు పార్టీ అధినాయ‌క‌త్వం వైఖ‌రిని కూడా తెలుసుకోకుండా చాలా విమ‌ర్శ‌లు చేశారు.. చివ‌ర‌కు ఆయ‌న సొంత పార్టీతో స‌హా కాశ్మీరం నుంచి క‌న్యాకుమారి దాకా.. ఈశాన్య‌భార‌తం నుంచి గుజ‌రాత్ వ‌ర‌కు అన్ని రాష్ట్రాల నేత‌లు ముక్త‌కంఠంతో ల‌క్ష్మ‌ణ్ గారి వ్యాఖ్య‌ల‌ను ఖండించారు.. ఏదైతేనేం ఆయ‌న రాజ‌కీయ ల‌బ్ధి కోసం విమ‌ర్శ‌లు చేసిన‌ప్ప‌టికీ.. తెలంగాణ రాష్ట్రం పేరు.. మ‌న రాష్ట్ర అంబాసిడ‌ర్ ఎవ‌ర‌న్న‌ది ప్ర‌తి ఒక్క‌రికీ తెలిసిపోయింది.. రేపు కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తీలో అమితాబ్ బ‌చ్చ‌న్ కూడా తెలంగాణ రాష్ట్ర బ్రాండ్ అంబాసిడ‌ర్ ఎవ‌రు? అన్న ప్ర‌శ్న‌ను సంధించినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు..!!!

క‌మ‌ల‌నాథులా?. సీమాంధ్ర‌వాదులా?.

తెలంగాణ అంబాసిడ‌ర్‌గా సానియా మీర్జాను నియ‌మించ‌డంపై బీజేపీ నాయ‌కుల స్పంద‌న విచిత్రంగా ఉంది. సాధార‌ణంగా ఈ కాషాయ‌వాదులు ఆమె పాకిస్తాన్ కోడ‌లు అయినందున ఆ కోణంలో వ్య‌తిరేక‌త వ్య‌క్తం చేయాలి. కానీ వీరి ధోర‌ణి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. సానియాను నియ‌మించ‌డంపై ఎలాంటి అభ్యంత‌రం లేద‌ట‌!. కానీ ఆమెను కేసీఆర్ హైద‌రాబాదీ అన‌డంపై వారు దృష్టిసారించారు. ఇదేదో హైద‌రాబాద్ మీద ప్రేమ‌తో కాదు... ఈ సందున సీమాంధ్ర‌కు తెలంగాణ సంప‌ద‌ను దోచిపెట్టాల‌ని చూస్తున్నారు. సానియాను హైద‌రాబాదీ అన్నందున సీమాంధ్ర నుంచి వ‌చ్చి ఇక్క‌డ స్థిర‌ప‌డిన వారిని కూడా హైద‌రాబాదీలుగానే ప‌రిగ‌ణించాల‌ట‌. వారికి తెలంగాణ ప్ర‌భుత్వం ఫీజులు చెల్లించాల‌ట‌. ఇదేదో సీమాంధ్ర బీజేపీ నాయ‌కులు డిమాండు చేసినా ఓ అర్థంప‌ర్థం ఉండేది. కానీ తెలంగాణ‌కు చెందిన నాయ‌కులే ప‌త్రిక‌లు, చానెళ్ల‌కు ఎక్కి... సీమాంధ్ర విద్యార్థుల‌కు ఫీజులు చెల్లించాలంటూ డిమాండు చేస్తున్నారు. నిజంగా వీరికి ఏమైనా తెలంగాణ సోయి ఉందా?. ఏపీ స‌ర్కారు పీపీఏలు ర‌ద్దు చేసిన‌పుడు వీళ్లు మీడియాకు ఎక్కి తెలంగాణ‌కు అనుకూలంగా మాట్లాడారా?. కానీ ఇప్పుడు మాత్రం సీమాంధ్ర విద్యార్థుల‌కు తెలంగాణ సొమ్ము దోచిపెట్టేందుకు పోటీప‌డుతున్నారు. వాస్త‌వంగా ఈ కాషాయ‌వాదులు సానియా మీర్జా ఎంపిక‌పై పాకిస్తాన్ కోణంలో విమ‌ర్శలు చేస్తే వీరి నిజాయితీ బ‌య‌ట‌ప‌డేది. బీజేపీ సిద్ధాంతానికి అనుగుణంగా వీరు వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు అర్థ‌మ‌య్యేది. కానీ సీమాంధ్ర కోసం వారి సిద్ధాంతాన్ని ప‌క్క‌న‌పెట్టి సానియా అంశాన్ని సాకుగా చూపి తెలంగాణేత‌ర విద్యార్థుల‌కు ల‌బ్ధి చేకూర్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అందుకే వీరు కాషాయ‌వాదులా?. సీమాంధ్ర‌వాదులా?. అనే అనుమానం క‌లుగుతుంది.
మావోయిస్టు నేత ఆజాద్ ఇంట‌ర్వూ కోసం వ‌చ్చిన‌ హేంచంద్ర పాండేను ఎన్‌కౌంట‌ర్ చేసిన వ్య‌వ‌స్థ‌... పాకిస్థాన్ ఉగ్ర‌వాది స‌యీద్‌తో భేటీ అయిన వేద్ ప్ర‌తాప్ వైదిక్‌ను ఎందుకు వ‌దిలి పెట్టింది.. ?

కేంద్ర ఎన్నిక‌ల సంఘం స్పందించాలి?.

ప్ర‌తి రాజ‌కీయ పార్టీకి మ్యానిఫెస్టో భ‌గ‌వ‌ద్గీత‌లాంటిది. తూ.చ‌. త‌ప్ప‌కుండా దానిని అమ‌లు చేయాల్సిందే. అందుకే అందులో అంశాలు పొందుప‌రిచేపుడు ఒక‌టికి రెండుసార్లు పార్టీలు ఆలోచించుకోవాలి. ఇదేరీతిన టీడీపీ ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో విడుద‌ల చేసిన మ్యానిఫెస్టోలోని హామీల‌పై కేంద్ర ఎన్నిక‌ల సంఘం స్పందించి, వివ‌ర‌ణ కోరింది. అన్నీ చూసుకొని, అమ‌లు చేసేవే తాము ప్ర‌క‌టిస్తున్న‌ట్లు అందుకు టీడీపీ లేఖ రూపంలో బ‌దులిచ్చింది. కేవ‌లం రుణ మాఫీ హామీ కార‌ణంగానే అధికారంలోకి వ‌చ్చింది. మ‌రి ఇప్పుడు అమ‌లు ఏమైంది?. అన్నీ తూట్లే!. ఒక‌టి కాదురెండు కాదు... ల‌క్ష‌న్న‌ర మొత్తం మొద‌లు మార్చి, 2014 వ‌ర‌కు అని, చివ‌ర‌కు పొదుపు సంఘాల రుణాల‌ను కూడా కుటుంబానికి ముడిపెట్టి కుటుంబానికి ఒక‌టి అనే అనేక ష‌ర‌తులు పెట్టాడు. నిజంగా ఇదేరీతిన మ్యానిఫెస్టోలో పేర్కొని అధికారంలోకి వ‌స్తే ఎవ‌రికీ ఎలాంటి అభ్యంత‌రం లేదు. కానీ బేష‌ర‌తుగా అంటూ జ‌నాన్ని ఏమార్చి అధికారంలోకి వ‌చ్చాడు. ఇప్పుడు ష‌ర‌తులు పెట్టాడు. అందుకే కేంద్ర ఎన్నిక‌ల సంఘం దీనిని తీవ్రంగా ప‌రిగ‌ణించాలి. ఎందుకంటే కేవ‌లం ఆ ఒక్క హామీ ద్వారానే టీడీపీ అధికారంలోకి వ‌చ్చింది. వైఎస్సార్సీపీ అధికారాన్ని కోల్పోయింది. ఇలా ముందుగానే ష‌ర‌తులు పెట్టి ఉంటే టీడీపీకి సీట్లు త‌గ్గేవేమో?. ఎందుకంటే అక్క‌డ కేవ‌లం రెండు పార్టీల‌కే (టీడీపీ-బీజేపీ కూట‌మి) సీట్లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో టీడీపీకి త‌గ్గే సీట్లు వైఎస్సార్సీపీకి ద‌క్కేవి. ఫ‌లితాలు తారుమార‌య్యేవి. అందుకే ఆ కీల‌క‌మైన హామీని సంపూర్ణంగా అమ‌లు చేయ‌క‌పోవ‌డ‌మంటే ఎన్నిక‌ల‌ను ప‌రిహాసం చేయ‌డ‌మే. అందుకే కేంద్ర ఎన్నిక‌ల సంఘం దీనిపై విచార‌ణ జ‌ర‌పాలి. సంపూర్ణంగా హామీని అమ‌లు చేయ‌క‌పోతే చ‌ర్య‌లు తీసుకోవాలి.
టీడీపీ ప్ర‌భుత్వ తీరుపై వైఎస్సార్సీపీ నిర‌స‌న‌లో కూడా స్ప‌ష్ట‌త కొర‌వ‌డింది. ఒకో కుటుంబం అంటే ఎలా ప‌రిగ‌ణిస్తారు?. ల‌క్ష‌న్న‌ర అంటే పంట రుణాలా?. బంగారు రుణాలా?. అని ఆ పార్టీ నాయ‌కులు అమాయ‌కంగా ప్ర‌శ్నిస్తున్నారు. ఈ సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారంటే టీడీపీ ప్ర‌భుత్వం పెట్టిన ష‌ర‌తుల‌ను ప‌రోక్షంగా అంగీక‌రించ‌డ‌మే?. అస‌లు మ్యానిఫెస్టోలో ఏముంది... నీవేం చేస్తున్నావ్‌... అని నిల‌దీయాల్సిన ప్ర‌తిప‌క్షం ష‌ర‌తుల్లో రంధ్రాన్వేష‌ణ చేయ‌డం అనుమానాల‌ను తావిస్తోంది. అంతేకాదు రైతులు రోడ్ల‌పైకి రావ‌డం లేదంటూ కొంద‌రు విశ్లేష‌కులు, సోకాల్డ్ మేధావులు చాన‌ళ్ల‌లో వ్యాఖ్యానిస్తున్నారు. అయినా రైతులు రోడ్ల మీద‌కు ఎందుకు రావాలి?. ఒక ఇంట్లో నాలుగు ల‌క్ష‌ల రుణం ఉంటే ల‌క్ష‌న్న‌ర రుణం మాఫీ అవుతుంది. వాస్త‌వంగా టీడీపీ మ్యానిఫెస్టో ప్ర‌కారం ఆ రైతు కుటుంబానికి అన్యాయం జ‌రిగిన‌ట్లే. ఆ విష‌యం ఆ రైతుకు కూడా తెలుసు. కానీ రోడ్డు మీద‌కొస్తే అయ్యే ల‌క్ష‌న్న‌ర మాఫీ ఆగుతుందేమో?. స్థానిక టీడీపీ నాయ‌కులు టార్గెట్ చేసి అడ్డుకుంటారేమోన‌ని భ‌య‌ప‌డ‌తారు. ఇది సాధార‌ణం. అంత‌మాత్రాన‌... రైతులు రోడ్డు మీద‌కు రానంత మాత్రాన టీడీపీ హామీ సంపూర్ణంగా అమ‌లైన‌ట్లా?. చంద్ర‌బాబు మోసం మాయ‌మ‌వుతుందా?. ఇలాంటి స‌మ‌యాల్లోనే ప్ర‌తిప‌క్షం, మీడియా నిల‌దీయాలి. రైతుల ప‌క్షాన నిల‌బ‌డి పోరాడాలి. వైఎస్ ల‌క్ష కోట్ల కుంభ‌కోణాల‌పై ఏ ప్ర‌జ‌లు వ‌చ్చి రోడ్డున ప‌డి ఆందోళ‌న చేశార‌ని ఈనాడు ఏళ్ల త‌ర‌బ‌డి పేజీల‌కు పేజీలు నింపింది. రామోజీరావు... జీజేరావు... అని ఏ రంగం ప్ర‌జ‌లు ఆ అంశాన్ని లేవ‌నెత్తార‌ని సాక్షి రోజుల త‌ర‌బ‌డి పేజీలు నింపింది. ఆయా అంశాల్లో వారి స్వార్థం ఉండ‌వ‌చ్చు. కానీ టీడీపీ హామీల అమ‌లు విష‌యంలో జ‌నం ప్ర‌యోజ‌నం ముడి ప‌డి ఉంది. ఇలాంటి స‌మ‌యాల్లోనే బ‌య‌టికిరాలేని రైతుల ప‌క్షాన నిల‌బ‌డి చంద్ర‌బాబును నిల‌దీయాల్సిన అవ‌స‌ర‌ముంది. ఎలాగూ ఆ క్ష‌ణం వ‌స్తుంద‌నే న‌మ్మ‌కం నాకు లేదు. కానీ ఆ క్ష‌ణం వ‌స్తే బాగుండ‌ద‌ని ఓ చిన్ని అత్యాశ‌!!!

Thursday 17 July 2014

సీమాంధ్ర‌లో కాన‌రాని ష‌ర‌తులు




సీమాంధ్ర‌లో కాన‌రాని ష‌ర‌తులు
చూశారా... ఆర్బీఐ తెలంగాణ‌, ఏపీ ప్ర‌భుత్వాల‌కు పంపిన లేఖ సారాంశ‌మిది. అంతా ఒక‌టే!. పైగా ష‌ర‌తులు కూడా ఒక‌టే!!. కానీ ఈనాడు డ్రామోజీకి ఒకో ప్రాంతంలో అది ఒకో రీతిన క‌నిపించింది. తెలంగాణ‌కు వ‌చ్చే స‌రికి *ష‌ర‌తుల‌తో రీషెడ్యూల్‌** అట‌!. అంటే తెలంగాణ రైతులు అయ్యో రీషెడ్యూల్ కాదేమో అన్న భ‌యం రావ‌డానికి ఆ హెడ్గ్డింగ్ పెట్టారు. అదే సీమాంధ్ర ఎడిష‌న్‌లో చూడండి. *మూడేళ్ల‌కే రీషెడ్యూల్‌** అంటే సీమాంధ్ర రైతులు మాత్రం హ‌మ్మ‌య్య ఇప్ప‌డైతే గండం గ‌ట్టెక్కిన‌ట్లే క‌దా... అని అనుకోవ‌డానికి ఆ హెడ్డింగ్ పెట్టారు.
నోట్‌: అస‌లు తెలంగాణ ప్ర‌భుత్వం రీషెడ్యూల్‌పై ఆశ‌లే పెట్టుకోలేదు. మొత్తం మాఫీ చేసేందుకే సిద్ధ‌మైంది. అయినా ఎందుకో
ఈ డ్రామోజీకి ఇలాంటి కుటిల ఆరాటం.
మిత్రుల‌కు ఈ కుట్ర‌ల‌పై అవ‌గాహ‌న క‌ల్పించేందుకే ఈ పోస్టు పెడుతున్నాను.

వీళ్లు మ‌నుషులేనా?!




తెలుగు... తెలుగు...
నిత్యం ఉషోద‌యంబున అస‌త్య క‌థ‌నాల‌ను చూపించేందుకు ఈనాడు సంధించే ప‌దాస్త్రం ఇది. పైకి తెలుగు వెలుగులు అంటూ... లోప‌ల మాత్రం తాను, త‌న తాబేదారు చంద్ర‌బాబు స్వార్థం కోసం ప్ర‌జ‌ల మ‌ధ్య విద్వేషాలు రెచ్చ‌గొట్టేందుకు కూడా ఈ ప్ర‌తిక వెనుకాడ‌టం లేదు. చూడండి... ఈరోజు సీమాంధ్ర ఎడిష‌న్‌లో వ‌చ్చిన ఈ వార్త‌ను. అస‌లు ఎప్ప‌డైనా సీమాంధ్ర ఎడిష‌న్‌లో ఈనాడు కేసీఆర్ బొమ్మ వాడిన దాఖ‌లాలు ఉన్నాయా?. అస‌లు ఆ పేరు రాకుండానే ఎడిష‌న్ వ‌చ్చేలా క‌ట్టుదిట్ట‌మైన చ‌ర్య‌లు తీసుకుంటుంది. కానీ ఈరోజు మాత్రం చంద్ర‌బాబు హామీల అమ‌లుపై నుంచి జ‌నం దృష్టిని మ‌రల్చేందుకు ఈ దుస్సాహ‌సానికి ఒడిగ‌ట్టింది. స‌చివాల‌యంలో కేసీఆర్ గంట‌న్న‌ర‌కు పైగా విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హిస్తే... అందులో ఎన్నో అంశాలు, వంద‌ల విష‌యాల‌ను ప‌క్క‌న‌పెట్టింది. కేవ‌లం ** మీ పిల్ల‌ల ఫీజులు మీరే క‌ట్టుకోండి** అనే హెడ్డింగ్‌తో మొద‌టి పేజీలో ప్ర‌ముఖంగా ఈ వార్త‌ను ఇచ్చింది. కేసీఆర్ హామీల అమ‌లులో ముంద‌డుగు వేశార‌నిగానీ, అస‌లు తెలంగాణ‌లో రైతుల రుణాల మాఫీ, ఇలా అనేక వ‌రాలు కురిపించార‌నే వాస‌న కూడా ఆ ఎడిష‌న్‌లో రాకుండా జాగ్ర‌త్త‌ప‌డ్డారు. స‌రే.. కేసీఆర్‌ను అక్క‌డ పొగ‌డాల్సిన అవ‌స‌రం లేదు. కానీ ఇత‌ర అనేక విష‌యాలు ఉన్నాయి క‌దా... వాట‌న్నింటినీ ప‌క్క‌న‌పెట్టి కేవ‌లం సీమాంధ్ర విద్యార్థుల ఫీజుల‌ను ఆ ప్ర‌భుత్వ‌మే క‌ట్టుకోవాల‌న్న మాట‌ను సూటిగా అలా కాకుండా.. మీరే క‌ట్టుకోండి!. అని ఓ స‌గ‌టు సీమాంధ్ర వాసిని అన్న‌ట్లుగా, వారిలో కోపాన్ని ర‌గిల్చేలా, లేనిపోని విద్వేషాలు రెచ్చ‌గొట్టేందుకు శాయ‌శ‌క్తులూ ఒడ్డుతుంది. జ‌నం కొట్టుకు చ‌స్తే మాకేంది... నేను, నా అక్ర‌మ ఆస్తులు, చంద్ర‌బాబు స‌ల్ల‌గుంటే చాల‌న్న‌ట్లు డ్రామోజీ ఇలాంటి క‌థ‌నాల‌తో ప్ర‌జ‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ వాతావార‌ణాన్ని సృష్టిస్తున్నాడు. కానీ ఈ కుట్ర‌లు చంద్ర‌బాబు వైఫ‌ల్యాల‌ను ఏమాత్రం క‌ప్పి పుచ్చ‌లేవ‌ని, మ‌రికొన్ని రోజుల్లో డ్రామోజీ ఎన్ని డ్రామాలు ఆడినా చంద్ర‌బాబును వైఫ‌ల్యాల సుడిగుండం నుంచి గ‌ట్టెక్కించ‌లేడ‌నే విష‌యాన్ని మాత్రం గుర్తించడం లేదు. కాక‌పోతే ఆ స‌మ‌యం వ‌చ్చే వ‌ర‌క‌న్నా రామోజీ... సామాన్య జ‌నంతో సాగించే ఇలాంటి క్రీడ‌ల‌కు స్వ‌స్తి ప‌లికితే బాగుంటుంది.


Tuesday 15 July 2014

కేసీఆర్ గారూ... కుట్ర‌ల‌పై మేల్కొనండి!





సాగ‌ర్ ఎండినంక జీరో ప్ర‌వాహం గుర్తుకొచ్చిందా?.
కేసీఆర్ గారూ... కుట్ర‌ల‌పై మేల్కొనండి!

ప‌చ్చ పార్టీ పాంప్లెంట్‌కు ఇప్పుడు తెలివొచ్చింది. డ్రామోజీ, చంద్ర‌బాబు, వెంక‌య్య‌నాయుడు చీక‌టి స‌మావేశంతో నాగార్జున‌సాగ‌ర్ నుంచి కృష్ణా డెల్టాకు నీళ్లు తీసుకుపోయే కుట్ర‌ను విజ‌య‌వంతంగా కేంద్రంతో అమ‌లు చేయించారు. ఉన్న‌వే 513 టీఎంసీల నీళ్ల‌యితే అందులో ఏకంగా 16 టీఎంసీలు తోడేందుకు ప‌క్కా కుట్ర‌ను అమ‌లు చేశారు. ఆ స‌మ‌యంలో ఏమాత్రం కిమ్మ‌న‌ని ఈనాడు... ఇప్పుడు మ‌రో కొత్త నాట‌కానికి తెర లేపింది. వాస్త‌వంగా సామాజిక స్పృహ, బాధ్య‌త ఉన్న ప‌త్రిక‌యితే కృష్ణాజ‌లాల‌పై తెలంగాణ‌, ఎంపీల మ‌ధ్య వివాదం మొద‌లుకాగానే జీరో ప్ర‌వాహంపై క‌థ‌నం ఇవ్వాలి. నిన్న‌టిదాకా క‌లిసున్నోళ్లు ఇప్పుడు కొట్టాడ‌టానికి కార‌ణం వ‌ర్షాభావం అంటూ ఎగువ ప్రాంతం నుంచి చుక్క ఇన్‌ఫ్లో లేద‌ని రాయాలి. అందుకు బ‌ల‌మైన గ‌త సంవ‌త్స‌రాల వివ‌రాలు, అంకెలూ ఉన్నాయి. కానీ ఈనాడు ఆ ఆలోచ‌నను కుట్ర‌పూరితంగా విస్మ‌రించింది. ఎంత‌సేపు రెండు రాష్ట్రముల మ‌ధ్య వివాదం నెల‌కొందంటూ ప‌బ్బం గ‌డిపింది. ఇక కృష్ణా డెల్టాకు నీళ్లొదిలారు. ఇక ప‌నైపోయింది. అంతే... ఈనాడుకు వెంట‌నే వ‌ర్షాభావం గుర్తొచ్చింది. అస‌లు ఆల్‌మ‌ట్టిలోకి వ‌ర‌ద రాలేద‌నే విష‌యం ఇప్పుడు కొత్త‌గా వారి సో్యిలోకి వ‌చ్చింది. ఎక్క‌డ తెలంగాణ వాళ్లు శ్రీ‌శైలం నుంచి నీళ్లొద‌లాల‌ని డిమాండు చేస్తార‌నో్... లేదా తెలంగాణ ప్ర‌భుత్వం కృష్ణా న‌దిపై కొత్త ప్రాజెక్టుల‌ను రూప‌క‌ల్ప‌న చేస్తే నీటి ల‌భ్య‌త స‌రిగాలేన‌పుడు కొత్త ప్రాజెక్టులు ఎందుక‌ని కేంద్రం నుంచి అభ్యంత‌రాలు లేవ‌నెత్తేందుకు ప‌క్కా ప్లాన్‌తో క‌థ‌నాన్ని వండి వార్చింది. నిజంగా వ‌ర్షాభావం త‌లెత్తింద‌ని 20-25 రోజుల కింద‌టే లో్క‌మంతా తెలుసు. కానీ అప్పుడు ఇలాంటి క‌థ‌నం ఇస్తే కృష్ణా డెల్టాకు నీటి విడుద‌ల‌కు అంత‌రాయం క‌లుగుతుంద‌ని ఈనాడు ఉద్దేశ‌పూర్వ‌కంగా మౌనం వ‌హించింది.

రెండో పేజీలో నాగార్జున‌సాగ‌ర్ దుస్థితి అంటూ మ‌రో క‌థ‌నం ఇచ్చింది. ఏకంగా 21 ల‌క్ష‌ల‌కు పైగా ఎక‌రాలు దీనిపై ఆధార‌ప‌డి ఉన్నాయ‌ని, సాగు క‌ష్టంగా ఉంద‌ని మొస‌లి క‌న్నీరు కార్చింది. మ‌రి గ‌త 20-25 రోజుల‌కు, ఇప్ప‌టికి సాగ‌ర్‌లో తేడా ఏముంది?. అప్పుడు జ‌ల‌క‌ళ ఉట్టిప‌డిందా?. సాగ‌ర్ దుస్థితి ఇలా ఉన్నందున 513 టీఎంసీల్లో 16 టీఎంసీలు ఎలా విడుద‌ల చేస్తారు అని రాయ‌వ‌చ్చు క‌దా... రాయ‌దు. డెల్టాకు క‌డుపు నిండే దాకా వాస్త‌వాల‌ను క‌ప్పి పెట్టింది. ఇక తెలంగాణ వాళ్లు ఎక్క‌డ నీళ్లు విడుద‌ల‌చేసుకుంటారోన‌ని ఆసూయ‌తో అయ్యో... సాగ‌ర్ ప‌రిస్థితి ఇలా త‌యారైందంటూ ఆవేద‌న చెందుతున్న‌ట్లు న‌టిస్తుంది. మ‌రికొన్ని రోజులు పోగానే మ‌రో క‌థ‌నం వ‌స్తుంది. ఎలాగూ నారుమ‌ళ్ల‌కు నీళ్లు వ‌దిలినందున డెల్టా రైతాంగం అధికారుల మాట‌ల‌ను పెడ‌చెవిన పెట్టి పంట వేసుకున్నార‌ని, ఇలాంటి స‌మ‌యంలో వారిని ఎలా వ‌దిలేస్తాం... సాగ‌ర్‌లో 480 అడుగుల నీళ్లు ఉన్నా ఎలాంటి ఇబ్బంది ఉండ‌నందున డెల్టాకు నీళ్లు వ‌ద‌లొచ్చంటూ క‌థ‌నాలు సిద్ధం చేసుకుంట‌ది.

అంతేకాదు... ఈరోజే ఈనాడులో మ‌రో క‌ట్టుక‌థ‌తో తెలంగాణ‌ను ఎండ‌బెట్టేందుకు మ‌రో కుట్ర క‌థ‌నాన్ని ఇచ్చింది. ఉభ‌య‌తార‌కంగా జ‌ల వాద‌న‌లు అంటూ స‌మైక్య రాష్ట్రంలో ఆంధ్ర పాల‌కులు తెలంగాణ డిమాండ్ల‌తో కూడిన వాద‌న‌ల‌ను ట్రైబ్యున‌ళ్ల ముందు ఉంచార‌ట‌. అందుకే ఇప్పుడు తెలంగాణ ప్ర‌భుత్వం చేసే డిమాండ్ల‌లో కొత్త‌వేవీ లేద‌ని చెప్పుకొచ్చింది. ఆంధ్ర అధికారులు ఏపీ స‌ర్కారుకు నివేదిక ఇచ్చారంటూ త‌న చేతికి మ‌ట్టి అంట‌కుండా ఉండే ప్ర‌య‌త్నం చేసింది. కానీ దీని వెన‌క భారీ కుట్ర దాగి ఉంది. ట్రైబ్యున‌ళ్ల ముందు తెలంగాణ స‌ర్కారు మ‌న కోణంలో జ‌ల వాద‌న‌లు వినిపించేందుకు సిద్ధ‌మ‌వుతుంది. దానిని అడ్డుకునేందుకు ఏపీ ప్ర‌భుత్వం, ఈనాడు క‌లిసి ఇలాంటి క‌థ‌నాలు అల్లుకొస్తున్నారు. దీనిని కేంద్ర ప్ర‌భుత్వానికి పంపి, ఇక‌పై ట్రైబ్యున‌ళ్ల ముందు తెలంగాణ ప్ర‌భుత్వం నుంచి డిమాండ్లు వినాల్సిన ప‌నేమీ లేద‌ని, అవి పాత చింత‌కాయ ప‌చ్చ‌ళ్లు అని న‌మ్మించేందుకు వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు. అందుకే వీళ్ల కుట్ర‌ల‌ను స‌మ‌ర్ధంగా తిప్పి కొట్టేందుకు ఇంజినీర్లు, తెలంగాణ ప్ర‌భుత్వం సిద్ధం కావాలి. అదే స‌మ‌యంలో ఈనాడు కుట్ర‌ల‌ను భ‌గ్నం చేసేందుకు సైతం చ‌ర్య‌లు తీసుకోవాలి. లేన‌ట్ల‌యితే వీళ్ల చీక‌టి ఒప్పందాలు తెలంగాణ గొంతుకు ఉరి తాళ్లుగా మార‌తాయి. వీళ్ల క‌ట్టు క‌థ‌ల‌కు ఆందోళ‌న చెంది మ‌న యువ‌త ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేసిన విషాద అనుభ‌వాలు మ‌న‌కున్నాయి. అందుకే త‌క్ష‌ణ‌మే మేల్కొనాలి.

Friday 11 July 2014

ఏ చీక‌టికో ఈ ప్ర‌స్థానం?!

చంద్రుడు సంపూర్ణంగా ఉంటే అది పౌర్ణ‌మి. అందుకు భిన్నంగా ఉంటే అది అమావాస్య‌. మ‌రి... బొల్లి చంద్రుడు సీమాంధ్ర ఎన్నిక‌ల్లో సంపూర్ణ అధికారం చేప‌ట్టాడు. సీమాంధ్ర‌కు అది పౌర్ణ‌మినో కాదోగానీ... తెలంగాణ‌కు మాత్రం సంపూర్ణ అమావాస్య‌గా మారుతోంది. అందుకే ఈ చీక‌ట్లో *కొంద‌రు* స‌ర్దుకుంటున్నారు. వారిలో మ‌న చంద్రాలు అనే రిమోట్‌ను చేతులో పెట్టుకున్న డ్రామోజీ ఉన్నాడు. చంద్ర‌బాబు అధికారంలోకి రాగానే తెలంగాణ జ‌ర్న‌లిస్టుల‌పై త‌న ప్ర‌తాపాన్ని చూపుతున్న రాజ‌గురువింద ఇటీవ‌ల ఓ అడుగు ముందుకేశారు. ఉద్యోగులు ఏ ఏట్ల‌కు పోతే నాకేంది!. అని సోమాజీగూడ‌, మూసాపేట కార్యాల‌యాల్లో ఉన్న వాళ్లంద‌రినీ రామోజీ ఫిలిం సిటీకి త‌ర‌లిస్తున్నాడు. కొన్నాళ్లు పోతే తెలంగాణ‌లోని అన్ని జిల్లాల డెస్క్‌ల‌ను కూడా అక్క‌డికే త‌ర‌లిస్తార‌ట‌. ఖ‌ర్చు త‌గ్గించుకునేందుకు డ్రామోజీ వేస్తున్న పాచిక‌లో తాజాగా మ‌రోటి బ‌య‌టికొచ్చింది. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో తెలుగువారు ఎక్క‌డున్నా ఈనాడు వాళ్ల గ‌డ‌ప‌ను త‌ట్ట‌డంతో పాటు అక్క‌డి స్థానిక వార్త‌ల‌ను కూడా వారికి తెలుగు అక్ష‌రాల్లో అందించేందుకు ఒరిస్పా, త‌మిళ‌నాడు, ఢిల్లీ, మ‌హారాష్ట్ర ఎడిష‌న్ల‌ను కూడా చానాళ్ల కింద‌ట మొద‌లుపెట్టిండు. ఇప్పుడు వాట‌న్నింటినీ ఎత్తివేస్తున్నాడ‌ట‌. ఈనెల 16 నుంచి ఆ ఎడిష‌న్ల‌కు మంగ‌ళం పాడుతున్న‌ట్లు ప్ర‌క‌టించార‌ట కూడా. కానీ క‌ర్ణాట‌క ఎడిష‌న్‌ను మాత్రం అదేవిధంగా కొన‌సాగిస్తార‌ని అంటున్నారు. ఎందుకంటే అక్క‌డ నుంచి యాడ్స్ (ప్ర‌క‌ట‌న‌లు) రూపంలో భారీగానే ఆదాయం వ‌స్తుంద‌ట‌. చూశారా... తెలుగు మీద ప్రేమ‌, తెలుగోళ్లంటే మ‌మ‌కారం... ఇవ‌న్నీ ఒట్టి మాట‌లే. రాజ‌కీయ చాప‌మీద ప‌వ‌ళించిన‌ ఫ‌క్తు వ్యాపార వేత్త... డ్రామోజీ!. ఇప్ప‌టికైనా ఆయ‌న బ‌హిరంగంగా దీనిని అంగీక‌రిస్తే బాగుంటుంది. కానీ ఇక‌ముందు కూడా సంద‌ర్భం వ‌చ్చిన‌పుడ‌ల్లా తెలుగు జాతిని మేల్కొల్పేందుకే తానేదో అక్ష‌ర సేద్యం చేస్తున్న‌ట్లుగా పేరాల‌కు పేరాలు ఎడిటోరియల్ రాస్తే మాత్రం అది ఆత్మ‌వంచ‌నే అవుతుంది.
కొస‌మెరుపు: ఈనాడులో గ‌త‌కొన్ని రోజులుగా చోటుచేసుకుంటున్న అనూహ్య ప‌రిణామాల వెన‌క రిల‌య‌న్స్ ఆదేశాలు ఉన్నాయ‌నే ప్ర‌చారం కూడా జ‌రుగుతుంది. ఇప్ప‌టికే జాతీయ స్థాయిలో మీడియా ప్ర‌పంచాన్ని గుప్పిట్లో పెట్టేందుకు చురుకుగా పావులు క‌దిపి చాలామేర‌కు స‌ఫ‌లీకృత‌మైన రిల‌య‌న్స్ ఏ క్ష‌ణంలోనైనా రామోజీ గ్రూపును సైతం టేకోవ‌ర్ చేసినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రంలేద‌నే టాక్ కూడా జోరందుకుంది. మ‌రి ఇందులో ఎంత‌వ‌ర‌కు వాస్త‌వ‌ముంద‌నేది కాల‌మే చెప్ప‌నుంది.

మిస్ట‌ర్ అద్వానీజీ... ఇప్పుడేల మౌనం?.

మిస్ట‌ర్ అద్వానీజీ... ఇప్పుడేల మౌనం?.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్ల‌మెంటులో ప్ర‌వేశ‌పెట్టిన‌పుడు సీమాంధ్ర ఎంపీలు సృష్టించిన బీభ‌త్స కాండ‌పై యావ‌త్ భార‌త‌దేశం భ‌గ్గుమంది. కానీ రాజ‌కీయ కురువృద్దుడు మిస్ట‌ర్ అద్వానీజీ మాత్రం భిన్నంగా స్పందించారు. చివ‌రి ద‌శ‌లో ఉన్న కేంద్ర ప్ర‌భుత్వం ఇప్పుడు ఎందుకు బిల్లు పెడుతుందో?. అంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసిన ఆయ‌న గ‌తంలో ఎన్న‌డూ ఇలాంటి స‌భ‌ను చూడ‌లేదంటూ వాపోయారు. నిజ‌మే... మ‌రి శుక్ర‌వారం జ‌రిగిన స‌భ‌ను అద్వానీజీ గ‌తంలో ఎన్న‌డైనా చూశారా?. పో్ల‌వ‌రం ఆర్డినెన్స్ బిల్లుకు ఆమోదం తెలిపేందుకు ఎన్డీయే ప్ర‌భుత్వం చూపించిన అత్యుత్సాహం అంతా ఇంతా కాదు. పూర్తి మెజార్టీ ఉన్న‌ప్ప‌టికీ ముజువాణి ఓటుతో ఆ బిల్లును ఆమోదించిన తీరు చాలా బాధాక‌రం. మ‌రి ఇప్పుడు అద్వానీజీ ఎందుకు స్పందించ‌లేదో అర్థం కావ‌డం లేదు. ఒక‌వైపు మూడు రాష్ట్రముల‌కు చెందిన ఎంపీలు త‌మ గోడు వినండంటూ పోడియం వ‌ద్ద గొల్లుమంటున్నా... పక్క‌నే ఉన్న అద్వానీజీ ఎందుకు స్పందించ‌లేదు?. నిజ‌మే... కేంద్ర స‌ర్కారుకు ఇంత తొంద‌ర ఎందుకు?. దేశ ప్ర‌జ‌లు సంపూర్ణంగా ఐదేళ్ల పాటు ఉండేందుకు ఆ ప్ర‌భుత్వానికి పూర్తి మెజార్టీ ఇచ్చారు. ఇప్ప‌టికిప్పుడు ఆ బిల్లును ఆమోదించేందుకు తొంద‌రేం వ‌చ్చింది?. అస‌లు వ్య‌తిరేకిస్తున్న ఎంపీల మ‌నోభావం ఏమిటి?. వారి అభ్యంత‌రాలేమిటి?. అని బీజేపీగానీ అద్వానీజీగానీ తెలుసుకునే ప్ర‌య‌త్నం ఎందుకు చేయ‌లేదు?. కేవ‌లం చంద్ర‌బాబు, వెంక‌య్య‌నాయుడు చెప్ప‌డ‌మే ప్రామాణికంగా హ‌డావుడిగా బిల్లును ఆమోదించారు. మ‌రి ఇది ప్ర‌జాస్వామ్యంలో దుర‌దృఫ్ట‌క‌ర సంఘ‌ట‌న కాదా?. నోరులేని అమాయ‌క ఆదివాసీలకు ఢిల్లీలో చక్రం తిప్పే సామ‌ర్థ్యం లేదు. మీడియాను మేనేజ్‌చేసి గంట‌ల త‌ర‌బ‌డి చ‌ర్చ‌లు, రోజంతా హడావుడి చేసే చాక‌చ‌క్యం కూడా లేదు. ఇలాంటి త‌రుణంలో వారి గోడు ఎవ‌రు వినాలి?. మూడు, నాలుగు జిల్లాల మూడో పంట కోసం ల‌క్ష‌లాది మంది గిరిపుత్రుల‌ను నిలువునా ముంచి, వారి సంస్కృతి, సంప్ర‌దాయాల‌ను జ‌ల స‌మాధి చేసే అధికారం ఎవ‌రు ఇచ్చారు?. నాలుగు కోట్ల జ‌నం ఆకాంక్ష‌ను నెర‌వేస్తున్న స‌మ‌యంలోనే అద్వానీజీ ఆవేద‌న చెందారే... మ‌రి శుక్ర‌వారం జ‌రిగిన స‌భ ఎంత‌మంది ఆకాంక్ష‌ను నెర‌వేర్చింది?. మ‌రెంత మంది జీవితాల‌ను న‌డివీధిలోకి తెచ్చింది?. రాజ‌కీయ దిగ్గ‌జమైన అద్వానీజీ కించిత్త‌యినా వీటి గురించి ఆలోచించారా?. అంతెందుకు ఆయ‌న ఓ విష‌యాన్ని గుర్తించాలి. హైద‌రాబాద్ త‌మ‌కు ద‌క్క‌డంలేద‌నే వాస్త‌వాన్ని జీర్ణించుకోలేని ల‌గ‌డ‌పాటి ఏకంగా ప‌విత్ర‌మైన స్థ‌లంలో పెప్ప‌ర్‌స్ప్రే చ‌ల్లి, తోటి ఎంపీల‌ను ఇబ్బంది పెట్టేందుకు ప్ర‌య‌త్నించారు. కానీ శుక్ర‌వారం రోజు తెరాస‌, ఇత‌ర ఎంపీలు ప్ర‌జాస్వామ్య‌బ‌ద్దంగా త‌మ నిర‌స‌న వ్య‌క్తం చేశారే త‌ప్ప కించిత్తు కూడా స‌భా మ‌ర్యాద‌ల‌కు భంగం వాటిల్లేలా ప్ర‌వ‌ర్తించ‌లేదు. అద్వానీజీ... ఇది చాల‌దా!. ఎవ‌రు ప్ర‌జాస్వామ్యాన్ని గౌర‌వించేవారు.. మ‌రెవ‌రు కించ‌ప‌రిచేవార‌నేది. ఎలాగూ అధికారం, అంగ బ‌లం ఉంద‌ని ఈరోజు ఎన్డీయే అమాయ‌క గిరిజ‌నుల‌ను స‌మాధి చేసే బిల్లును నెగ్గించుకోవ‌చ్చు. కానీ వారి గోస‌, వారి ఆవేద‌న క‌చ్చితంగా ఈ ప్ర‌భుత్వాన్ని వెంటాడుతుంది. బీజేపీ, అద్వానీజీ ఈరోజు మిత్ర ధ‌ర్మాన్ని నెగ్గించుకున్నామ‌ని సంబ‌ర‌ప‌డొచ్చు. కానీ అదే స‌మ‌యంలో మాన‌వ‌తా ధ‌ర్మానికి ఘోరీ క‌ట్టార‌నే వాస్త‌వాన్ని మాత్రం మ‌ర‌వ‌ద్దు. ఎందుకంటే ప్ర‌జాస్వామ్యంలో అధికారం ఐదేళ్లు మాత్ర‌మే!!!

అభాసుపాలు చేయ‌కండి..!

రెండ్రోజుల కింద‌ట ఒక ప‌త్రిక‌లో వ‌చ్చిన వార్తపై నేను వివ‌రాలు రాబ‌ట్టాను. దాని ద్వారా తెలిసిందేమిటో తెలుసా... తెలంగాణ ప్ర‌భుత్వంలో రెండు శాఖ‌లు ఒకే అంశంపై భిన్నంగా జీవోలు ఇవ్వ‌డం. హైద‌రాబాద్‌లోని వాట‌ర్ వ‌ర్క్స్ డిపార్టుమెంటులో ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ పోస్టు ఉంది. ఇది ఖాళీగా ఉండ‌టంతో చాలా రోజుల కింద‌ట‌నే కేసీఆర్ ఆదేశంతో ప్ర‌భుత్వం (జీఏడీ విభాగం) ఆదిలాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్‌ను ఆ పోస్టుకు బ‌దిలీ చేసింది. ఆత‌ర్వాత వాట‌ర్ వ‌ర్క్స్‌లో ప‌ని చేసే ఇద్ద‌రు ఇంజినీర్ల‌కు ప్ర‌మోష‌న్ ఇస్తూ నాలుగు రో్జుల కింద‌ట ప్ర‌భుత్వం (పుర‌పాలక శాఖ‌) మ‌రో జీవో ఇచ్చింది. ఇందులో వాట‌ర్ వ‌ర్క్స్‌లోని ఒక సీనియ‌ర్ అధికారిని ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్‌గా నియ‌మించిన‌ట్లు ఆ జీవోలో చెప్పింది. అంటే గ‌తంలో ఆదిలాబాద్ జిల్లా క‌లెక్ట‌ర్‌ను నియ‌మించిన పోస్టులోనే మ‌రో అధికారిని నియ‌మిస్తున్న‌ట్లు ఆదేశాలు వ‌చ్చాయి. ఇదెలా సాధ్యం...?. ఒకే పోస్టులో ఇద్ద‌రెలా ఉంటారు?. దీని వెన‌క అస‌లు క‌థ ఏమిటంటే... ప్ర‌మోష‌న్ పొందిన ఇద్ద‌రు ఇంజినీర్ల‌లో ఒక‌రు అన‌ర్హుడ‌ట‌. అత‌ని సంబంధిత విద్యార్హ‌తను పూర్తి చేయ‌కుండానే (సుప్రీం కోర్టు నిబంధ‌న‌ల ప్ర‌కారం 24 స‌బ్జెక్టులు పాస్ కావాల్సి ఉంటే 14 మాత్ర‌మే పాస్ అయ్యాడు) ప్ర‌మోష‌న్లు పొందుతున్నాడ‌ట‌. ఈ విష‌యంపై సీఎం పేషీకి అన్ని ఆధారాల‌తో స‌హా ఫిర్యాదు కూడా అందింద‌ట‌. అందుకే వెంట‌నే రెండోసారి జారీ అయిన జీవో అమ‌లు కాకుండా నిలిపివేశాట‌ర‌. బాగానే క‌ళ్లు తెరిచారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది. పైగా ప‌రిపాల‌న‌లో త‌ప్పిదాలు దొర్ల‌డం స‌హ‌జ‌మే. కానీ దీని వెన‌క అస‌లు తంతు నాకు బాధ క‌లిగించింది. ఆ ఇద్ద‌రు ఇంజినీర్ల‌కు ప్ర‌మోష‌న్లు ఇప్పించ‌డంలో తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషించిన ఒక వ్య‌క్తి సూత్ర‌ధారిగా వ్య‌వ‌హరించారు. స‌చివాల‌యంలో ఉద్య‌మాల్లో పాల్గొన్న వారే కాదు... తెలంగాణ‌లోని సాధార‌ణ వ్య‌క్తి కూడా పైర‌వీ చేయ‌డంపై ఎలాంటి అభ్యంత‌రం లేదు. ఆ విష‌యానికొస్తే నిన్న‌టిదాకా స‌చివాల‌యమంటే ఆంధ్రోళ్ల అడ్డాగా ప‌రిఢ‌విల్లింది. కానీ ఇప్పుడు తెలంగాణ‌వారితో కిట‌కిట‌లాడ‌టం, వారు త‌మ ప‌నులు మ‌న ప్ర‌భుత్వంతో చేయించుకోవ‌డం చాలా సంతోష‌క‌రం. కాక‌పోతే ఇలాంటి ప‌నులు చేసే స‌మ‌యంలో తెలంగాణ భ‌విష్య‌త్తుకు ఎలాంటి ఆటంకం క‌ల‌గ‌కుండా చూడ‌టం మ‌న బాధ్య‌త‌. ఎందుకంటే హైద‌రాబాద్‌లో వాట‌ర్ వ‌ర్క్స్ అనేది కీల‌క‌మైన శాఖ‌. రానున్న రోజుల్లో 20వేల కోట్ల‌తో ప్రాజెక్టులు రానున్నాయి. ఇలాంటి ప్ర‌ధాన‌మైన శాఖ‌లో అన‌ర్హులు అంద‌లం ఎక్కేలా మ‌నం స‌హ‌క‌రిస్తే అభివృద్ధి నిధులు బూడిద‌లో పోసిన ప‌న్నీరులా మార‌తాయి. అందుకే మ‌న మంత్రులు, ఎమ్మెల్యేల‌తో స‌న్నిహితంగా ఉండేవారు ప‌నులు చేయించుకోండి. త‌ప్పులేదు... మ‌న స‌ర్కారుతో ప‌నులు చేయించుకునే హ‌క్కు మ‌న‌కు ఉంది. కాక‌పోతే అందులో మ‌న స‌మాజానికి ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా విఘాతం క‌ల‌గ‌కుండా జాగ్ర‌త్త ప‌డండి. ముఖ్యంగా ఇలా తెలంగాణ ప్ర‌భుత్వం అభాసుపాలు అయ్యే ప‌నులు మాత్రం ద‌య‌చేసి చేయ‌కండి.

మ‌రోసారి మ‌న‌నం...

మొన్న‌...
ఎన్నిక‌ల స‌మ‌యంలో టికెట్లు ఇచ్చేట‌ప్పుడు చంద్ర‌బాబు ఇంటికే ప‌రిమితం అవుతాడు. సీమాంధ్ర మీడియాలో ఆయ‌న మేధోమ‌థ‌నం చేస్తున్న‌ట్లుగా వ‌స్తుంది. కానీ కేసీఆర్ త‌న వ్య‌వ‌సాయ క్షేత్రంలో జాబితాపై కుస్తీ ప‌డితే... పార్టీలో వ్య‌తిరేక‌త త‌ట్టుకోలేక పార్టీ కార్యాల‌యం రాకుండా అక్క‌డ దాక్కున్న‌ట్లు వ‌స్తుంది. ఇది ఎన్నో ఏళ్లుగా సీమాంధ్ర మీడియా అతి చాక‌చ‌క్యంగా చేసిన కుట్ర‌. అందుకే 2009 న‌వంబ‌రు ముందు వ‌ర‌కు తెలంగాణ జ‌నంలో కేసీఆర్ ప‌ట్ల సీమాంధ్ర మీడియా పెంచిపోషించిన వ్య‌తిరేక‌త భావం ఉండేది. ఆత‌ర్వాత అది ప‌టాపంచ‌లైంద‌నుకోండి. ఇది ఎందుకు చెబుతున్నానంటే... చంద్ర‌బాబు, డ్రామోజీ ఒక అబ‌ద్ధాన్ని ఎంత చాక‌చ‌క్యంగా జ‌నాల్లోకి ఎక్కిస్తార‌నేందుకు ఓ ఉదాహ‌ర‌ణ‌.
నిన్న‌...
ఇదే కోవ‌లోకి మ‌రోటి వ‌చ్చింది. వాస్త‌వంగా రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం... పారిశ్రామిక రంగంలో కేంద్రం నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఎలాంటి రాయితీలు, ప్రోత్సాహకాలు వ‌ర్తిస్తాయో స‌రిగ్గా తెలంగాణ‌లోనూ అదేరీతిన అమ‌ల‌వుతాయి. ఇది అక్ష‌ర స‌త్యం. కానీ సీమాంధ్ర మీడియా కేవ‌లం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు మాత్ర‌మే ఈ అవ‌కాశం ఉన్న‌ట్లుగా పారిశ్రామిక‌వేత్త‌లు, జ‌నాల్లో భ్ర‌మ‌లు క‌ల్పిస్తుంది. ఇది నిజం కాద‌నే మ‌న గోడుకు స‌రైన ప్ర‌చారం ల‌భించ‌డం లేదు.
తాజాగా...
రాష్ట్ర పున‌ర్విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ఉమ్మ‌డి రాజ‌ధానిలో ప‌లు అంశాల‌కు సంబంధించి గ‌వ‌ర్న‌ర్‌కు కొన్ని బాధ్య‌త‌లు అప్ప‌గించ‌నున్నారు. కానీ సీమాంధ్ర ఆ బాధ్య‌త‌లు అనే ప‌దాన్ని అధికారాలుగా మార్చింది. వాస్త‌వంగా ఇది రాజ్యాంగ విరుద్ధం. ఇదే విష‌యంపై గ‌తంలో అప్ప‌టి కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబ‌రంను ఒక మీడియా ప్ర‌శ్నించిన‌పుడు గ‌వ‌ర్న‌ర్‌కు వ‌ర్తించేవి అధికారాలు కావు... కేవ‌లం బాధ్య‌త‌లు అని మాత్ర‌మే స్ప‌ష్టం చేశారు. న‌మ‌స్తే తెలంగాణ ప‌త్రిక‌తో పాటు అనేక‌మంది తెలంగాణ మేధావులు, నాయ‌కులు ఈ విష‌యాన్ని చెబుతున్నా... సీమాంధ్ర మీడియా మాత్రం ఇంకా అధికారాలు అనే ప‌దాన్ని వాడుతుంది. ఇదంతా అమాయ‌క తెలంగాణ ప్ర‌జ‌లను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేయ‌డంతో పాటు సీమాంధ్ర ప్ర‌జ‌ల్లో లేనిపోని ఆశ‌లు రేకెత్తించ‌డానికి చేస్తున్న కుట్ర‌.

అందుకే సీమాంధ్ర మీడియా అస్థిత్వాన్ని దెబ్బ‌తీయాలంటే స‌ర్క్యులేష‌న్‌, ప్ర‌క‌ట‌న‌ల‌పై మ‌నం స్వీయ నిషేధాన్ని విధించుకోవాలి. లేక‌పోతే ఇలాంటి ఎన్నో కుట్ర‌ల‌కు మ‌నం బ‌లి కావాల్సి ఉంటుంది. అందుకే తెలంగాణ ఉద్యోగులు సీమాంధ్ర ప‌త్రిక‌ల‌కు స‌మాచారం విష‌యంలో స‌హాయ నిరాక‌ర‌ణ‌, జ‌నం ప‌త్రిక‌లు వేయించుకోకుండా, ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌కుండా ఉండేలా ప్ర‌తినబూనితే త‌ప్ప ఈ విష వృక్షాల‌ను కూక‌టివేళ్ల‌తో పెకిలించ‌డం సాధ్యం కాదు. జై తెలంగాణ‌.. జైజై తెలంగాణ‌

Monday 7 July 2014

భూదాన్ భూముల వ్య‌వ‌హారంపై మౌన‌మేల‌?!

ఇటీవ‌ల గురుకుల్ ట్ర‌స్టు భూముల్లో కూల్చివేత‌లు జ‌ర‌గ్గానే సీమాంధ్ర మీడియా తెగ హ‌డావుడి చేసింది. అమాయ‌కులు బ‌ల‌వుతున్నారు... అస‌లైన వారిని శిక్షించ‌కుండా వ‌దిలేస్తున్నారు... అంటూ లేనిపోని క‌ట్టుక‌థ‌లు అల్లేందుకు తెగ ఆరాట‌ప‌డింది. మ‌రి ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది. కానీ వీటి న‌ల్లి నంగ‌నాచి నాట‌కాలు రోజుల వ్య‌వ‌ధిలోనే బ‌ట్ట‌బ‌య‌ల‌య్యాయి. నిజంగా వీరు స‌మాజ శ్రేయ‌స్సు కోరే వారయితే... నిరుపేద రైతుల‌ను ఆదుకోవాల్సిన భూదాన్ః భూములు అన్యాక్రాంత‌మైనా ఎందుకు ప‌ట్టించుకోవ‌డం లేదు?. అమాయ‌క జ‌నం నుంచి కొంద‌రు వేల‌కు వేలు గుంజి కోట్లు గ‌డించినా వారిని ఎందుకు నిల‌దీయడం లేదు?. భూదాన్ అక్ర‌మాల‌కు సూత్ర‌ధారి అయిన రాజేంద‌ర్‌రెడ్డి సోద‌రుడే వీటిని బ‌ట్ట‌బ‌య‌లు చేశాడు. ఆధారాల‌తో స‌హా అన్ని మీడియా సంస్థ‌ల‌కు వివ‌రాలు ఇచ్చిన‌ట్లు చెప్పారు. ఆయ‌న గ‌తంలో వార్త‌లో కూడా వ‌రుస క‌థ‌నాలు ఇప్పించారు. అయితే ఇప్ప‌డు మాత్రం కేవ‌లం ఐ న్యూస్‌, టెన్ టీవీలు మాత్ర‌మే ఈ అక్ర‌మాల‌పై క‌థ‌నాల‌ను ప్ర‌సారం చేశాయి?. మెరుగైన స‌మాజం కోసం పోరాడే టీవీ-9, ద‌మ్మ్మున్న ఛానెల్ ఏబీఎన్‌, సామాన్యుడి ఆరో ప్రాణ‌మైన 6టీవీ, ఇలా స్లోగ‌న్లు పెట్టుకున్న ఎన్‌టీవీ, ఈటీవీ (అందునా తెలంగాణ ఈటీవీ)లు ఎక్క‌డ‌కు పోయాయి?. జ‌గ‌న్ అవినీతిపై ల‌క్ష‌ల పేజీలు వేసిన ఈనాడు, డ్రామోజీ భాగోతంపై పేజీల‌కు పేజీలు నింపిన సాక్షి, నాలుగు గోడ‌ల మ‌ధ్య జ‌రిగే శృంగారాన్ని సైతం వెతికి ప‌ట్టుకొని వండి వార్చే ఆంద్ర‌జ్యోతి ఇలా ఒక‌టేమిటి!. తెలంగాణ గొంతుక‌లు అని చెప్పుకునే మీడియా కూడా అస‌లు ఎందుకు వీటిని ప్ర‌చురించ‌లేదు... ప్ర‌సారం చేయ‌లేదు. అస‌లు తెలంగాణోడు సెంటు భూమి జాగా క‌బ్జా చేస్తే ఆ అర్హ‌త నీకెక్క‌డిది?. అనే రీతిలో హ‌డావుడి చేసే సీమాంధ్ర మీడియా ఈ అక్ర‌మాల్లో ఫ‌క్తు తెలంగాణ‌కు చెందిన వ్య‌క్తులే బాధ్య‌లైన‌ప్ప‌టికీ ప్ర‌చురించేందుకు, ప్ర‌సారం చేసేందుకు ఎందుకు ముందుకు రాలేదు?. దీని వెన‌క ఆంత‌ర్య‌మేమిటి?. ఏ ప్రాంతం వారైనా అక్ర‌మార్కులు అంతా ఒక‌టి.. జ‌న‌మంతా ఒక‌టి అనే నినాదాన్ని ఏమైనా పాటిస్తున్నారా?. అస‌లు వారి మౌనానికి కార‌ణ‌మేమిటో ఈ సంస్థ‌ల‌న్నీ ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌ర‌ముంది. 

కేంద్ర స‌ర్కారు స‌ర్క్యుల‌ర్ వెన‌క బ‌హుముఖ వ్యూహాలు!


నిత్య స‌మీక్ష‌లు... సాఫీగా సాగుతున్న తెలంగాణ స‌ర్కారు పాల‌న‌... అక్ర‌మార్కుల‌పై కొన‌సాగుతున్న కొర‌డా... ఇలాంటి స‌మ‌యంలో కేంద్ర స‌ర్కారు నుంచి గ‌వ‌ర్న‌ర్ అధికారాల‌పై తెలంగాణ ప్ర‌భుత్వానికి స‌ర్క్యుల‌ర్ వ‌చ్చింది. వాస్త‌వంగా ఇది పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలోని అంశ‌మైనప్ప‌టికీ ఇప్ప‌డే ఇది జారీ కావ‌డం వెన‌క బ‌హుముఖ వ్యూహాలు క‌నిపిస్తున్నాయి. చంద్ర‌బాబునాయుడు, వెంక‌య్య‌నాయుడు, డ్రామోజీతో పాటు ప‌లువురు సినీ, వ్యాపార ప్ర‌ముఖులు క‌లిసి మోడీ ద్వారా ఈ పావులు క‌దుపుతున్న‌ట్లు తెలుస్తోంది. దీని ద్వారా వీరు ప‌లు ప్ర‌యోజ‌నాలు ఆశిస్తున్నారు...
! సాఫీగా సాగుతున్న తెలంగాణ స‌ర్కారు పాల‌న‌కు దీని ద్వారా అవ‌రోధం (డిస్డ‌ర్బ్‌) క‌లిగించ‌డం
! గురుకుల్ భూముల మాదిరిగా తెలంగాణ స‌ర్కారు ఇక‌ముందు సీమాంధ్ర ఆక్ర‌మ‌ణ‌ల‌పై దూకుడు ప్ర‌ద‌ర్శించ‌కుండా నిలువ‌రించ‌డం
! ఎలాగూ కేసీఆర్ దీనిని వ్య‌తిరేకిస్తారు క‌నుక కేంద్ర ప్ర‌భుత్వ‌నాకి, తెలంగాణ ప్ర‌భుత్వానికి మ‌ధ్య అంత‌రం పెంచ‌డం
! ముఖ్యంగా...... త‌ల‌కుమించిన హామీల భారంతో స‌త‌మ‌తం అవుతున్న చంద్ర‌బాబు సీమాంధ్ర జ‌నం దృష్టిని పూర్తిగా హైద‌రాబాద్ వైపున‌కు మ‌ళ్లించ‌డం
! విభ‌జ‌న స‌మ‌యం వ‌ర‌కు హైద‌రాబాద్‌పై ఆశ‌లు పెట్టుకున్న సీమాంధ్ర జ‌నం త‌మ‌కూ ఓ రాజ‌ధాని కావాల‌నే భావ‌న‌లోకి వ‌చ్చారు. దీంతో వారిని పూర్తిగా దారి మ‌ళ్లించి... ఈ అంశం ద్వారా మ‌ళ్లీ వారిలో హైద‌రాబాద్‌పై ఆశ‌లు రేగేలా భావోద్వేగాల‌ను రెచ్చ‌గొట్ట‌డం... త‌ద్వారా చంద్ర‌బాబు వైఫ‌ల్యాల‌ను క‌ప్పి పుచ్చ‌డం. ప్ర‌ధానంగా రుణ మాఫీల‌ను త‌ప్పించుకోవ‌డం

అందుకే తెలంగాణ ప్ర‌భుత్వం కూడా వ్యూహాత్మ‌కంగానే దీనిని ఎదుర్కోవాల్సి ఉంది. తెలంగాణ‌వాదులు దూకుడు ప్ర‌ద‌ర్శిస్తే అదే అదును చేసుకొని ఆ సాకు చూపి... సీమాంధ్ర భ‌ద్ర‌త పేరిట చంద్ర‌బాబు, డ్రామోజీ కేంద్ర స‌ర్కారు ద్వారా హైద‌రాబాద్‌ను త‌మ గుప్పిట పెట్టుకునే ప్ర‌మాదం ఉంది. అందుకే సంయ‌మ‌నంతో ప్ర‌జా ఉద్య‌మాల ద్వారానే ఈ స‌మ‌స్య‌ను ఎదుర్కోవాల‌నేది నా భావ‌న‌.

Friday 4 July 2014

జ‌ర్న‌లిస్టుల‌కు ఇచ్చిన భూములు కూడా స్వాధీనం చేసుకోవాలి

తెలంగాణ ప్ర‌భుత్వం వినియోగించ‌ని స‌ర్కారు భూముల‌ను స్వాధీనం చేసుకునే ప్ర‌క్రియ‌కు శ్రీ‌కారం చుట్టి ద‌శాబ్దాలుగా బూజుప‌ట్టిన నిబంధ‌న‌కు తుప్పు వ‌దిలిస్తుంది. ఇదే ఊపులో జ‌ర్న‌లిస్టుల‌కు ఇచ్చిన భూముల‌ను కూడా స్వాధీనం చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ల‌కు గ‌తంలో 80 ఎక‌రాల భూమి (వంద‌ల కోట్ల విలువైన భూమి) ఇచ్చారు. కానీ వీరు క‌నీసంగా ఏడేళ్ల అనుభ‌వం ఉండాల‌నే నిబంధ‌న పెట్టి కేవ‌లం 600-700 మంది జ‌ర్న‌లిస్టులే దానిని పంచుకోవాల‌ని చూశారు. ఇందులో అత్య‌ధికంగా సీమాంధ్ర జ‌ర్న‌లిస్టులే ఉన్నారు. సంఘంలో గొడ‌వ కార‌ణంగా ఇప్ప‌టికీ దానిని లేఅవుట్ కూడా చేయ‌లేదు. అందుకే వెంట‌నే ప్ర‌భుత్వం ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలి. ఆత‌ర్వాత జ‌ర్న‌లిస్టులు మ‌రోసారి ఇళ్ల స్థ‌లాల కోసం విన‌తిప‌త్రం ఇస్తే దానిని ప‌రిశీలించాలి. ఇందులో స్థానిక‌త ఆధారంగా స్థ‌లాల కేటాయింపు జ‌ర‌గాలి. ఎందుకంటే రెండు రాష్ట్రములు ఏర్ప‌డ్డాయి. మ‌రి ఎక్క‌డి వారికి అక్క‌డ స్థ‌లాలు ఇవ్వ‌డం స‌మంజసం. అందుకే ఇక్క‌డ తెలంగాణ జ‌ర్న‌లిస్టుల‌కు మాత్ర‌మే ఈ స‌ర్కారు ఇళ్ల స్థ‌లాలు ఇవ్వాలి. సీమాంధ్ర జ‌ర్న‌లిస్టుల‌కు
కొత్త రాజ‌ధానిలో (సింగ‌పూర్‌) స్థ‌లాలు ఇవ్వాలి. ఎట్టి ప‌రిస్థితుల్లో సీమాంధ్ర జ‌ర్న‌లిస్టుల‌కు ఇక్క‌డ స్థ‌లాలు ఇవ్వ‌ద్దు. ఎందుకంటే...

ఈ గ‌డ్డ‌పై ఉండి తెలంగాణ‌కు వ్య‌తిరేకంగా క‌థ‌నాలు రాశారు...
ఇక్క‌డ గాలి పీల్చి ఇక్క‌డి జ‌నం మ‌నోభావాల‌ను కించ‌ప‌రిచారు...
వేలాది మంది తెలంగాణ యువ‌త బ‌లిదానాలు చేసినా చ‌లించ‌కుండా ట్యాంక్‌బండ్‌పై మ‌ట్టి బొమ్మ‌లు కూలితే ప్ర‌పంచం మునిగిపోయిన‌ట్లు లోకాన్ని న‌మ్మించే ప్ర‌య‌త్నం చేశారు...
క‌రెంటు స‌ర‌ఫ‌రా ఆపి మ‌న ఓయూ హాస్ట‌ల్‌ల విద్యార్థినిల‌ను పోలీసులు చావ‌గొడితే కించిత్తు స్పందించ‌నివారు సోకాల్డ్ మేధావి జేపీపై చెయ్యి ప‌డితే అది ప్ర‌జాస్వామ్యంలో చీక‌టిరోజుగా అభివ‌ర్ణించారు...
రాష్ట్రం విడిపోగానే సీమాంధ్ర యాజ‌మాన్యాల అండ చూసుకొని తెలంగాణ జ‌ర్న‌లిస్టుల‌పై క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు.
అందుకే వెంట‌నే ప్ర‌భుత్వం ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలి... సొంత రాష్ట్రంలో మ‌న జ‌ర్న‌లిస్టుల‌కు మాత్ర‌మే హైద‌రాబాద్‌లో ఇండ్ల స్థ‌లాలు ఇవ్వాలి.

Wednesday 2 July 2014

తెలంగాణ టూరిజానికి ట్యాగ్ లైన్ ఏమైతే బాగుంటుంది?

https://www.youtube.com/watch?v=kOy35Q7xuEE

https://www.youtube.com/watch?v=FAzoD7EEL4c





తెలంగాణ టూరిజం ప్ర‌క‌ట‌న‌ల రూప‌క‌ల్ప‌న‌పై కూడా ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టిని కేంద్రీక‌రించాలి....
ఒక్కో రాష్ట్రం టూరిజానికి ఒక్కో ట్యాగ్ లైన్ ఉంటుంది...
ఉదాహ‌ర‌ణ‌కు కేర‌ళ తీసుకుంటే... గాడ్స్ ఓన్ కంట్రీ అని ఉంటుంది..
మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ను తీసుకుంటే.. హిందుస్తాన్ కా దిల్ దేఖో అని ఉంటుంది..
మ‌న తెలంగాణ రాష్ట్ర టూరిజానికి కూడా ఇలాంటి ప్ర‌భావ‌వంత‌మైన‌, అర్థ‌వంత‌మైన ట్యాగ్‌లైన్‌ను రూపొందించాలి..
తెలంగాణ టూరిజానికి బ్రాండ్ అంబాసిడ‌ర్‌ను ఎంపిక చేసినా చేయ‌క‌పోయినా స‌రే.. ప్ర‌క‌ట‌న‌లు మాత్రం వినూత్నంగా ఉండాలి..
మ‌ధ్య‌ప్ర‌దేశ్ టూరిజం వాళ్లు ఎలాంటి గ్లామ‌ర్‌, మ‌నుషుల‌ను ఉప‌యోగించ‌కుండానే రూపొందించిన ఈ టీవీ ప్ర‌క‌ట‌న‌లు ఆక‌ట్టుకునేలా ఉన్నాయి..
మ‌నం కూడా వినూత్న‌మైన ప్ర‌క‌ట‌న‌ల‌ను రూపొందించి విడుద‌ల చేయాలి...

Tuesday 1 July 2014

బైలెల్లిపోతున్న ఈనాడు

2004లో వైఎస్ అధికారంలోకి రావ‌డంతో నైరాశ్యంలో్కి వెళ్లిన ఈనాడు ప‌దేళ్ల పాటు అహంకారాన్ని త‌న‌లో అణ‌చుకుంది. స్వ‌త‌హాగా ఉద్యోగ‌స్తులంటే బానిస‌లుగా భావించే యాజ‌మాన్యం వైఎస్ స‌ర్కారు విసిరిన స‌వాళ్ల‌తో ఆర్థికంగా అయోమ‌యంలోకి వెళ్లి ఉద్యోగుల జోలికి వెళ్ల‌కుండా ఉంది. కానీ రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిణామాలు మారాయి. రామోజీ రిమోట్ చంద్ర‌బాబు ఏపీలో అధికారంలోకి వ‌చ్చాడు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వ‌చ్చింది. ఇంకేముంది... ఈనాడు త‌న‌లో అణ‌చుకున్న అహంకారాన్ని ఇప్పుడు ఒక్క‌సారిగా బ‌య‌టికి తీసింది. కొన్నిరోజులుగా మిడిల్ మేనేజ్‌మెంట్ ద్వారా త‌న వికృత‌రూపాన్ని ప్ర‌ద‌ర్శిస్తుంది. బ‌దిలీల‌తో తెలంగాణ జ‌ర్న‌లిస్టుల‌పై ఉక్కుపాదాన్ని మోపిన యాజ‌మాన్యం తాజాగా ఉద్యోగుల‌పై మ‌రో పంజా విసిరింది. మూసాపేట‌, సోమాజిగూడ కార్యాల‌యాల‌ను ఖాళీ చేయించి... అన్ని డెస్క్‌ల‌ను రామోజీ ఫిల్మ్‌సిటీకి త‌ర‌లించేందుకు రంగం సిద్ధం చేశారు. కొన్ని గంట‌ల ముందే అధికారికంగా దీనిని ప్ర‌క‌టించారు. జులై24 మొద‌లై ఆగ‌స్టు మొద‌టి వ‌ర‌కు ఈ త‌ర‌లింపు ప్ర‌క్రియ పూర్తి కావాల‌ని షెడ్యూలు కూడా ప్ర‌క‌టించారు. దీంతో ఉద్యోగుల్లో ఆందోళ‌న మొద‌లైంది. న‌గ‌రానికి ప‌దుల కిలోమీట‌ర్ల దూరంలో అందునా జాతీయ ర‌హ‌దారిపై ఉన్న ఫిల్మ్ సిటీకి ఎలా వెళ్లాల‌ని ఆవేద‌న చెందుతున్నారు. ఈ త‌ర‌లింపుతో ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరుగెత్తుతుంటే యాజ‌మాన్యం మాత్రం కాసులు వెన‌కేసుకుంటున్నందుకు సంతోష‌ప‌డుతుంది. ఇప్పుడు ఇంటి అద్దె అల‌వెన్స్ కింద 20 శాతం ఇస్తుంటే రామో్జీ ఫిల్మ్ సిటీకి వెళ్ల‌డం ద్వారా ఉద్యోగ‌స్తుల‌కు 10 శాతం మాత్ర‌మే అల‌వెన్స్ ఇవ్వాల్సి వ‌స్తుంది. అంటే యాజ‌మాన్యానికి 10 శాతం మిగులుతుంది. అంతేకాదు ఎలాగూ ఆరెఫ్‌సీ బ‌స్సులు ఉన్నందున అందులో ఉద్యోగుల‌ను త‌ర‌లించి ర‌వాణా అల‌వెన్స్ కూడా కోత విధించేందుకు నిర్ణ‌యించార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది. న‌గ‌రంలో ఉన్న భ‌వ‌నాల‌ను అద్దెకు ఇచ్చి ల‌క్ష‌లు సంపాదించాల‌నేది వ్యూహం.
చూశారా... చంద్ర‌బాబు అధికారంలోకి వ‌స్తే రామో్జీ సామాన్యుల‌పై ఎలా పంజా విసురుతాడో?! దేవుడి ద‌య వ‌ల్ల ఇక్క‌డ కేసీఆర్ రావ‌డం వ‌ల్ల ఆ కొంత నియంత్ర‌ణ ఉందిగానీ లేకుంటే జ‌ర్న‌లిస్టుల‌ను దిన‌స‌రి కూలీలుగా మార్చినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రంలేదేమో!

మెట్రో మార్గంపై కేసీఆర్ జోక్యం చేసుకోకుంటే... ఆంధ్ర‌జ్యోతి వార్త ఇలా ఉండేది..!



మెట్రో మార్గంపై కేసీఆర్ జోక్యం చేసుకోకుంటే... ఆంధ్ర‌జ్యోతి వార్త ఇలా ఉండేది..!


బేగ‌మ్ బ‌జారు త‌దిత‌ర ప్రాంతాల్లో మెట్రో రైల్‌ను అండ‌ర్ గ్రౌండ్ మార్గంలో తీసుకెళ్లాల‌ని కేసీఆర్ విప‌క్షంలో ఉన్న‌ప్ప‌టి నుంచీ కోరుతున్నాడు.. ఒక వేళ త‌మ మాట విన‌కుండా నిర్మాణాలు చేప‌డితే బాంబుల‌తో కూల్చేస్తామ‌న్నంత హెచ్చ‌రిక‌లు కూడా ఇచ్చాడు..
ఈ విషయంపై చాలాసార్లు బేగంబ‌జారు వ్యాపారులు చేసిన బంద్‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాడు.. ఇప్పుడు కేసీఆర్ అధికారంలో ఉన్నాడు..
మెట్రో రైల్ మార్గాన్ని య‌థాత‌థంగా అనుమ‌తిస్తే ఎల్ అండ్ టీ వ‌ద్ద భారీగా డ‌బ్బు తీసుకున్నాడు.. అందుకే మెట్రో మార్గంపై నోరు మెద‌ప‌డం లేదు అంటూ వార్త‌లను ప్ర‌సారం చేసేది...!


కేసీఆర్ జోక్యం చేసుకోవ‌డంతో ఇలా రాయాల్సి వ‌చ్చింది...!


ష్చ్‌... ఆంధ్ర‌జ్యోతి ఆశ‌లు ఫ‌లించ‌లేదు... మెట్రో మార్గం విష‌యంలో కేసీఆర్ ముక్కుసూటిగా ఉన్నాడు.. చ‌రిత్రాత్మ‌క ప్రాంతాల్లో అండ‌ర్‌గ్రౌండ్ ప‌నులు చేయాల‌ని ఆదేశించ‌డంతో ఇప్పుడు మెట్రోకు ఎర్ర‌జెండా అంటూ క‌థ‌నాలు రాస్తోంది...  హైద‌రాబాద్ అభివృద్ధికి విరోధ‌కుడు కేసీఆర్ అన్న‌ట్లు అర్థం వ‌చ్చేలా ప్ర‌య‌త్నాలు చేస్తోంది.... తెలంగాణ వాదులారా.. పారాహుషార్‌...



అయితే చ‌రిత్రాత్మ‌క ప్రాంతాల్లో అండ‌ర్ గ్రౌండ్ మెట్రో మార్గాన్ని వేయాల‌న్న పార్టీల జాబితాలో బీజేపీ, టీడీపీ కూడా ఉన్నాయి.. ఆ రెండు పార్టీలు 
చాలాసార్లు బంద్ కు కూడా పిలుపునిచ్చాయి.. మ‌రి ఇప్పుడు ఎలా స్పందిస్తాయో వేచిచూడాలి...