1

1

Tuesday 22 September 2015

తెలంగాణ నిరుద్యోగులంద‌రికీ శుభాశీస్సులు.. విజ‌యీభ‌వ‌..!

ఈ రోజు తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ తొలి ప‌రీక్ష‌ను నిర్వ‌హిస్తోంది.. ఈ ప‌రీక్ష‌లో తెలంగాణ విద్యార్థుల‌తో పాటు పొరుగు రాష్ట్ర‌మైన ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని గుంటూరు, విశాఖ ప‌ట్నం, కృష్ణా , అనంత‌పురం త‌దిత‌ర జిల్లాల నుంచి అభ్య‌ర్థులు ప‌రీక్ష రాస్తున్నారు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తెలంగాణ వారికి డీఎస్సీ రాసేందుకు అవ‌కాశం ఇవ్వ‌పోయినా మ‌నం మాత్రం ఆ రాష్ట్ర నిరుద్యోగుల‌కు మ‌న వ‌ద్ద అవ‌కాశం ఇస్తున్నాం.. 
ఇలాగే తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ పార‌ద‌ర్శ‌కంగా మ‌రిన్ని ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని, తెలంగాణ నిరుద్యోగుల‌కు న్యాయం చేయాలి. 
తెలంగాణ నిరుద్యోగులంద‌రికీ శుభాశీస్సులు.. విజ‌యీభ‌వ‌..!

మొత్తం వ్య‌వ‌స్థ‌ల‌నే నాశ‌నం చేసి ఫ‌లితాల‌ను చూసేందుకు బ‌య‌లు దేరే పెద్ద మ‌నుషులు

ఉస్మానియా విశ్వ‌విద్యాల‌యానికి 15 నెల‌ల్లోనే బీట‌లు ప‌డిపోయింది.. గ‌దుల‌న్నీ అప‌రిశుభ్ర‌త పేరుకు పోయింది. బాత్రూంల‌న్నీ పాడ‌య్యాయి.. అస‌లు మ‌నుషులు మ‌నుగ‌డ సాగించ‌డానికి వీలు లేకుండా హాస్ట‌ళ్లు త‌యార‌య్యాయి.. 
ఈ విష‌యాన్ని మొన్ననే వాళ్లు గుర్తించారు.. ఏదో ఒక‌టి మొత్తానికి 50 ఏళ్ల పాల‌న‌లో తాము చేసిన ఘ‌న కార్యాల ఫ‌లితాల‌ను చూడ‌టానికి బ‌య‌లు దేరిన కాంగ్రెస్ పెద్ద‌మ‌నుషుల‌కు వంద‌నాలు... 
*************
ఇంకా వంక‌ర‌లు తిరిగిన రింగ్ రోడ్డును, అందులో భూములు కోల్పోయిన రైతుల‌ను, భూ య‌జ‌మానులు కూలీలైన ప్రాంతాల‌ను సంద‌ర్శిస్తే కూడా బాగుంటుంది... భూములు కొనుగోలు చేసి కోటీశ్వ‌రులైన కాంగ్రెస్ పెద్ద మ‌నుషుల ఇళ్ల‌కు కూడా వెళితే ఇంకా అద్భుతంగా ఉండేదేమో..!!
**********
మొత్తం వ్య‌వ‌స్థ‌ల‌నే నాశ‌నం చేసి ఫ‌లితాల‌ను చూసేందుకు బ‌య‌లు దేరే పెద్ద మ‌నుషులు వీళ్లు త‌ప్ప ఇంకెవ‌రూ ఉండ‌రేమో...!!

వీళ్ల‌ను న‌వ తెలంగాణ ప‌రిర‌క్ష‌కులందామా?

తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌ ఉద్య‌మంలో క‌నీసం క‌న‌ప‌డ‌ని వాళ్లు.. తెలంగాణ ఉద్య‌మంలో క‌ల‌సి ప‌నిచేయ‌డానికి రానోళ్లు.. ఇప్పుడు ఒక్క‌ట‌య్యారు.. ఒక‌రి స‌భ‌ల‌కు మ‌రొక‌రు సంఘీభావాలు తెలుపుకుంటున్నారు..ఒక‌రి యాత్ర‌ల‌కు మ‌రొక‌రు స్వాగ‌తాలు ప‌లుక్కుంటున్నారు.. అందులో పాలుపంచుకుంటున్నారు.. !
గ్రేట్.. ఈ ఐక్య‌త వ‌ర్థిల్లాలి..!!
వీళ్ల‌ను న‌వ తెలంగాణ ప‌రిర‌క్ష‌కులందామా?

ఓరుగ‌ల్లులో బై ఎల‌క్ష‌న్ ను త‌ల‌పిస్తున్న ప్రెస్ క్ల‌బ్ ఎన్నిక‌లు

ఓరుగ‌ల్లులో బై ఎల‌క్ష‌న్ ను త‌ల‌పిస్తున్న ప్రెస్ క్ల‌బ్ ఎన్నిక‌లు
స్విమ్మింగ్ ఫూల్ క‌ట్టిస్తార‌ట‌... జిమ్ పెట్టిస్తార‌ట‌... ఇంకేదో చేస్తార‌ట‌...
***********
ఓరుగ‌ల్లు లో పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జ‌రుగుతోందా? అన్న రీతిలో ప్రెస్ క్ల‌బ్ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి.. గ‌త నెల రోజుల‌ ప్ర‌చార ప‌ర్వం ముగిసి నేడు అక్క‌డ ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి.. ప‌ట్టు నిలుపుకోవ‌డం కోసం ఓ వ‌ర్గం... పూర్వ వైభ‌వం కోసం మ‌రో వ‌ర్గం హోరా హోరీ ప్ర‌చారాన్ని చేశాయి. విమ‌ర్శ‌లు, ప్ర‌తి విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు ప్ర‌త్యారోప‌ణ‌లు, విందు రాజ‌కీయాలు, వ‌ల‌స‌లు, ఆప‌రేష‌న్ ఆక‌ర్ష‌లు, స్టార్ క్యాంపెన‌ర్లను ర‌ప్పించి(ఇత‌ర జిల్లాల‌కు చెందిన సంఘం నేత‌లు) ప్ర‌చారానికి పూనుకున్నాయి. నిన్న ఒక కూట‌మిలో ఉన్న జ‌ర్న‌లిస్టు నేడు మ‌రో కూట‌మిలో చేర‌డంలాంటి ఎన్నో వింత‌లు విశేషాల‌కు వ‌రంగ‌ల్ వేదికైంది.
***************
ఒక‌డు స్విమ్మింగ్ ఫూల్ క‌ట్టిస్తానంటే.. ఇంకొక‌డు జిమ్ పెట్టిస్తానంటూ హామీలు... ఇంకా న‌యం తెలంగాణ స‌ర్కారుతో మాట్లాడి ప్రెస్ క్ల‌బ్‌లో వైన్ షాప్ లైసెన్సును తెప్పిస్తాన‌ని ఎవ‌డూ బ‌హిరంగ హామీ ఇవ్వ‌లేదు.(లోలోపల ఇచ్చినా ఆశ్చ‌ర్యం లేదు). అస‌లు ప్రెస్ క్ల‌బ్‌లో ఈ లైబ్ర‌రీ పెడ‌తాం (అంత‌ర్జాతీయంగా పాత్రికేయ రంగానికి పేరు తెచ్చిన ప్ర‌ముఖులు జీవిత చ‌రిత్ర‌లు, ఇత‌ర పుస్త‌కాల‌ను అందుబాటులో ఉంచొచ్చు క‌దా..).. ప్రెస్ క్ల‌బ్‌లో స‌భ్యుడైన వారికి కంప్యూట‌ర్ శిక్ష‌ణ ఇచ్చేలా కంప్యూట‌ర్ ల్యాబ‌రేట‌రీని ఏర్పాటు చేస్తామ‌నో హామీలు ఇవ్వొచ్చు క‌దా..
****************
మ‌రి ప్ర‌జ‌ల కోసం వార్త‌లు రాసే పాత్రికేయుల ఎన్నిక‌ల‌కు ఇంత ఆర్భాటం అవ‌స‌ర‌మా? అంటే.. మేమేం త‌క్కువ తిన్నాం రాజ‌కీయ నాయ‌కుల‌కు అంటున్నారు కొంద‌రు జ‌ర్న‌లిస్టులు . రాజ‌కీయ నాయ‌కులు ఇసుక దందాలు చేస్తున్నారు.. మేమూ చేస్తున్నాం.. రాజ‌కీయ నాయ‌కులు పైర‌వీలు చేస్తున్నారు.. వారికి ధీటుగా మేమూ పైర‌వీలు చేస్తున్నాం.. వారి క‌న్నా మా పైర‌వీల‌కే విలువెక్కువ అంటూ గ‌ర్వంగా చెబుతున్నారు.. ఎస్సైల బ‌దిలీల్లోనూ మా మాట‌ల‌కు విలువ‌లు ఉంటున్నాయి.. రియ‌ల్ దందాల్లోనూ మా సెటిల్ మెంట్లే ఫైన‌ల్‌...మా పేర్లు లేని మ‌ద్యం సిండికేటును చూశారా? అంటూ ప్ర‌శ్నిస్తున్నారు..
క‌నీసం రాజ‌కీయ నాయ‌కుల‌కు వ్య‌తిరేకంగా ప్ర‌జ‌లు బంద్ చేసిన ఉదంతాలు లేవు కానీ.. మాకు వ్య‌తిరేకంగా ప్ర‌జ‌లు బంద్‌లు చేసే ప‌రిస్థితి వ‌చ్చిందంటే అదంతా మా ప‌లుకుబ‌డే విర్ర‌వీగుతున్నారు..
ఇంత చేసి ఎవ‌రైనా గెలిస్తే వాళ్లు నిజంగా జ‌ర్న‌లిస్టుల సంక్షేమానికి కృషి చేస్తారా? అని ప్ర‌శ్నించుకుంటే అది స‌మాధానం లేని ప్ర‌శ్న‌గానే మిగిలిపోతుంది.
***********
నోట్ : మొన్న ఎన్ కౌంట‌ర్ వ‌రంగ‌ల్ లో జ‌రిగితే.. పెద్ద త‌ల‌కాయ‌లు(పెద్ద రిపోర్ట‌ర్లు) ప్రెస్ క్ల‌బ్ ప్ర‌చార హోరులో మునిగిపోయి చిన్న త‌ల‌కాయ‌ల‌ను (చిన్న రిపోర్ట‌ర్ల‌ను) పంపించడం మ‌రో విశేషం.. మాములుగా తెలంగాణ లో జ‌రిగిన తొలి ఎన్ కౌంట‌ర్ అంటే అది సంచ‌ల‌నం.
దానిపై క‌న్నా ప్రెస్ క్ల‌బ్ ఎన్నిక‌ల‌పైనే ఎక్కువ దృష్టి సారించిన ఈ పెద్ద మ‌నుషులంతా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను వెలుగులోకి తేవ‌డం మాట‌
అటు ఉంచితే ఎన్నుకున్న జ‌ర్న‌లిస్టుల‌కైనా న్యాయం చేస్తార‌న్న న‌మ్మ‌క‌మైతే నాకు లేదు..
***********
నోట్ : నిజాయ‌తీగా ప‌నిచేసే ఆ కొంద‌రు జ‌ర్న‌లిస్టులంద‌రికీ నేను సెల్యూట్ చేస్తా.. మిగ‌తా వారికి మాత్ర‌మే ఈ వ్యాసం అంకితం..
****
పొట్ట కూటి కోసం పెన్ను ప‌ట్టుకోవ‌డం గ‌తంలో ముచ్చ‌ట‌.. పైర‌వీ కోసం పెన్నులు ప‌ట్టుకుని పాత్రికేయులు కావ‌డం నేటి ముచ్చ‌ట‌..

Wednesday 16 September 2015

ఈనాడు పేప‌ర్లో క‌నిపించే ఫొటోలు ఇలాంటివే.. అవి వేయ‌డం వెన‌క ఉంటే ప‌ర‌మార్థాలు వేరే ఉంటాయి..

ఈనాడు పేప‌ర్లో క‌నిపించే ఫొటోలు ఇలాంటివే.. అవి వేయ‌డం వెన‌క ఉంటే ప‌ర‌మార్థాలు వేరే ఉంటాయి.. అర్థం చేసుకోక‌పోతే నిండా మున‌గ‌డం ఖాయం.. తెలంగాణ ప్ర‌జ‌లు, నేత‌ల్లారా పారా హుషార్‌...!!
*************
చైనా అందాల‌ను వీక్షిస్తున్న కేసీఆర్‌... ఇది ఫొటో కాప్ష‌న్‌... (దీన్ని చూస్తే అయ్యో రూ.2 కోట్ల విమానం తీసుకుని చైనా అందాలు చూడ‌టానికి వెళ్లాడా? మ‌న సీఎం అని జ‌నం అనుకోవాలి...)
*************
రామోజీ రావు ద‌గ్గ‌ర వంగి చేతులు క‌ట్టుకుని నిల‌బ‌డ్డ కేసీఆర్‌... (ఛీ.. ఇంత ఉద్య‌మం చేసి మ‌ళ్లారామోజీరావు ద‌గ్గ‌ర కేసీఆర్ చేతులు క‌ట్టుకుని నిల‌బ‌డ్డాడా? అన్న ఆలోచ‌న రేకిత్తించే ఫొటో..)
***************
అదే బాబు ఫొటో వేయాల్సి వ‌చ్చిన‌ప్పుడు జ‌పాన్‌లో తీరిక లేకుండా స‌మావేశాల్లో పాల్గొంటున్న చంద్ర‌బాబు.. (అబ్బో అమ‌రావ‌తి కోసం అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డుతున్న బాబు గారు అని జనం అనుకునేలా ఉండే ఫొటో)
****************
ఢిల్లీలో చంద్ర‌బాబు ఎదుట చేతులు క‌ట్టుకున్న మోదీ... (దేశానికి ప్ర‌ధాని అయినా బాబు గారి ముందు ఎవ‌రైనా చేతులు క‌ట్టుకోవాల్సిందే.. ఢిల్లీలోనూ చ‌క్రం తిప్పే స‌త్తా ఉన్న నేత బాబు గారే అని అనుకునే ఫొటో వేయ‌డం)

ఆయ‌న‌ను యాదికి తెచ్చుకున్న ముఖ్య‌మంత్రి ఎవ‌రైనా ఉన్నారా?

ఉమ్మ‌డి రాష్ట్రంలో కాళోజీ జ‌యంతిని ఏ విధంగా సెల‌బ్రేట్ చేసే వారో ఎవ‌రికైనా గుర్తుందా? క‌నీసం ఆయ‌న‌ను యాదికి తెచ్చుకున్న ముఖ్య‌మంత్రి ఎవ‌రైనా ఉన్నారా?
***
నాకు జ్ఞాప‌కం ఉన్న వ‌ర‌కైనా మ‌లి ద‌శ తెలంగాణ ఉద్య‌మం ఉద్ధృతంగా ఉన్న రోజుల్లో ఓ ప్ర‌ధాన తెలుగు ప‌త్రిక కాళోజీ జ‌యంతిని మాండ‌లిక భాషాదినోత్స‌వం ప్రాంతీయ భాషా దినోత్స‌వం అని ఒక వ్యాసం రాసిన‌ట్లు గుర్తు... 
***
ఉమ్మ‌డి పీడ పోయి మ‌రుగున ప‌డేయ‌బ‌డిన మ‌న‌ ప్ర‌జా క‌వి కాళ‌న్న‌కు నిజ‌మై నివాళి అర్పిస్తూ ఆయ‌న జ‌యంతిని తెలంగాణ భాషా దినోత్స‌వంగా జ‌రుపుకునే మ‌ధుర‌మైన రోజు రావ‌డం నిజంగా చాలా గొప్ప విష‌యం... తెలంగాణ ఆర్థికంగానే కాకుండా సాంస్కృతిక పున‌రుజ్జీవం కావాలి...
జై తెలంగాణ‌.. జై జై తెలంగాణ‌

హైకోర్టు విభ‌జ‌న జ‌ర‌గ‌నంత వ‌ర‌కూ బెయిళ్లు వ‌స్తాయి

హైకోర్టు విభ‌జ‌న జ‌ర‌గ‌నంత వ‌ర‌కూ బెయిళ్లు వ‌స్తాయి, ఆంధ్రా విద్యుత్ ఉద్యోగుల‌కు ఊర‌ట ల‌భిస్తుంది, ప్ర‌భుత్వం తీసుకునే నిర్ణ‌యాల‌కు మొట్టికాయ‌లు, అక్షింత‌లూ ఉంటాయి.. ఇంకా అనేకం ల‌భిస్తూనే ఉంటాయి.. ఇవ‌న్నీ కామ‌నే... !!

ఇది నేటి బ్రేకింగ్ న్యూస్‌...

ఇది నేటి బ్రేకింగ్ న్యూస్‌...
*********
హైద‌రాబాద్‌లో ఏసీబీ దాడులు..
ఆదాయానికి మించిన ఉల్లి గ‌డ్డ‌ల కేసులో ఇద్ద‌రి అరెస్టు...
సోదాల్లో బ‌య‌ట ప‌డ్డ రెండు బ‌స్తాల ఉల్లి గ‌డ్డ‌లు..
లాక‌ర్ల‌లో దాచుకున్న వైనం...
బంధువుల ఇళ్ల‌లోనూ కొన‌సాగుతున్న సోదాలు..
అక్క‌డ‌క్క‌డా దొరుకుతున్న ఉల్లి గ‌డ్డ‌లు..
ఉల్లి గ‌డ్డ‌ల‌ను విలువ‌ను అంచ‌నా వేయ‌డానికి రంగంలోకి దిగిన ఎన్ ఫోర్సుమెంట్ డైరెక్ట‌రేట్ వ‌ర్గాలు...

గుజ‌రాత్‌లో జ‌రుగుతున్న అల్ల‌ర్లు మ‌న తెలంగాణ జ‌రిగిఉంటే ఏం వ‌చ్చేదో మీకు తెలుసా?

గుజ‌రాత్‌లో జ‌రుగుతున్న అల్ల‌ర్లు మ‌న తెలంగాణ జ‌రిగిఉంటే ఏం వ‌చ్చేదో మీకు తెలుసా?
*******************
రాష్ట్ర‌ప‌తి పాల‌న వ‌చ్చేది.... అది వ‌చ్చేది కాదు... ఇక్క‌డ ఉన్న విప‌క్షాలు వ‌చ్చేలా డిమాండ్ చేసేవి...
పెట్టుబ‌డులు వెన‌క్కి పోయేవి... అభివృద్ధి 20 సంవ‌త్స‌రాలు వెన‌క్కి వెళ్లేది... ఇంకా ఎన్నో జ‌రిగేవి(మీడియా రాత‌ల్లో, విప‌క్షాల కూత‌ల్లో ఇలాంటి మాట‌లు ఎన్నో వినేవాళ్లం)...

మీ ప్రాంతానికి చెందిన వారికి మాత్రం అన్యాయం చేయొద్దు బాబు గారూ...!!


మొన్న ఆంధ్రాలో డీఎస్సీ ప‌రీక్ష జ‌రిగింది..
అందుతో తెలంగాణ నుంచి ఆంధ్రాకు కోడ‌లుగా వెళ్లిన వారిని అన‌ర్హులను చేశారు..
టెట్‌లో మొద‌టి స్థానంలో నిలిచిన ఖ‌మ్మం వ‌నిత నెల్లూరు వాసిని పెళ్లాడింది.. ఆమె డీఎస్సీ రాయ‌లేక‌పోయింది..
దీనిపై ఏ ఒక్క‌డూ నోరు తెర‌వ‌లేదు..
చివ‌ర‌కు హైద‌రాబాద్‌లో స్థిర‌ప‌డిన ఆంధ్రా యువ‌తీ, యువ‌కుల‌ను కూడా ప‌రీక్ష‌లో అన‌ర్హుల‌ను చేశారు..
పాపం ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా చేబ్రోలుకు చెందిన ఒకాయ‌న కుమార్తె హైద‌రాబాద్‌లో 6 నుంచి 10వ త‌ర‌గ‌తి చ‌దివింది..
ఆమె డీఎస్సీకి అప్ల‌యి చేస్తే ద‌ర‌ఖాస్తును తోసి పుచ్చారు.. చివ‌ర‌కు హైకోర్టు ద్వారా ప‌రీక్ష‌కు అనుమ‌తి ఇప్పించుకోవాల్సిన దుస్థితి ఏర్ప‌డిండి..
ఆయ‌న మొన్న ఆత్మ‌హ‌త్యా ప్ర‌య‌త్నం చేసుకున్నాడు... ప్ర‌త్యేక హోదాతోనైనా ఉద్యోగాలు వ‌స్తాయ‌నుకున్నాను.. అదీ రాలేదు.. దానికి తోడు త‌న కుమార్తె వ్య‌వ‌హారంపై ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు...
ఆంధ్రాకు కోడ‌లుగా వెళ్లిన తెలంగాణ వారికి ఉద్యోగాలు ఇవ్వ‌క‌పోతే ఇవ్వ‌క‌పోయారు.. మేం అడ‌గం కూడా.. కానీ మీ ప్రాంతానికి చెందిన వారికి మాత్రం అన్యాయం చేయొద్దు బాబు గారూ...!!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి హృద‌య పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు...తెలంగాణ మ‌హ‌నీయుల చ‌రిత్ర‌ను మీ పుస్త‌కాల్లో నుంచి తొల‌గించినందుకు..




 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి హృద‌య పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు...
మొన్న‌నే ప్ర‌భుత్వం ఆంధ్రా పాఠ్య పుస్త‌కాల్లో ఉన్న తెలంగాణ చ‌రిత్ర‌, మ‌హ‌నీయుల పాఠాల‌ను తొల‌గించిన‌ట్లు స‌ర్క్యుల‌ర్ ఇచ్చింది... ఇది ఆహ్వానించ‌ద‌గిన ప‌రిణామం.
**********
హైద‌రాబాద్ విమోచ‌న ఉద్య‌మం, నిజాం వ్య‌తిరేక ఉద్య‌మం స్థానికేత‌ర అంశం కాబ‌ట్టి తొల‌గించండి...
స‌మ్మ‌క్క , సారక్క చ‌రిత్ర ఆంధ్ర‌ప్ర‌దేశ్ సంస్కృతిని ప్ర‌తిబింబించ‌దు కాబ‌ట్టి బోధించొద్దు..
సింగ‌రేణి తో మ‌న‌కు సంబంధం లేదు కాబ‌ట్టి దాన్ని పాఠంగా బోధించొద్దు..
గుసౌడీ స్థానికేత‌ర అంశం కాబ‌ట్టి తొల‌గించాం..
మిద్దె రాములు, కాపు రాజ‌య్య‌లు మన ప్రాంతానికి చెందిన వారు కాబ‌ట్టి వారి పాఠాలు బోధించొద్దు..
విద్యార్థుల స్థాయి క‌న్నా త‌క్కువ స్థాయిలో ఉండే హైద‌రాబాద్ న‌గ‌ర వ‌ర్ణ‌న తొల‌గించండి..
హైద‌రాబాద్‌లో బ‌జార్ల పాఠాలు అవ‌స‌రం లేదు... అది తెలంగాణ సంస్కృతిని ప్ర‌తిబింబిస్తుంది కాబ‌ట్టి తొల‌గిస్తున్నాం...
************
ఏది ఏమైతేనేం... మొత్తానికి హైద‌రాబాద్ మీది కాద‌ని అంగీక‌రించారు.. స‌మ్మ‌క్క సార‌క్క‌ల‌తో మీకు సంబంధం లేద‌ని, కాపు రాజ‌య్య‌ల‌తో ప‌నిలేద‌ని వారి చ‌రిత్ర‌ను బోధించొద్ద‌న్న నిర్ణ‌యం మంచిదే...
******
ఇదే త‌ర‌హాలో హైద‌రాబాద్ న‌డిబొడ్డున తెలంగాణ‌కు సంబంధం లేని వ్య‌క్తుల విగ్ర‌హాలు ఎందుకు ఉంచాలి? తెలంగాణ‌కు సంబంధం లేని పేర్ల‌ను హైద‌రాబాద్‌లో ఎందుకు పెట్టాలి... వీలైనంత త్వ‌ర‌గా వాటిని మీ ప్రాంతానికి తీసుకెళ్తార‌ని ఆశిస్తున్నాం..
మా మ‌హ‌నీయుల కోసం మా హైద‌రాబాద్‌లో ఉన్న మీ విగ్ర‌హాల‌ను ఇలాగే వెన‌క్కి తీసుకెళ్తే ఎంతో అనందిస్తాం...వీలైతే దారి ఖ‌ర్చు ఇస్తాం.. త్వ‌ర‌గా తీసుకెళ్లండి బాబూ... మీ విగ్ర‌హాలు, మీ సంస్కృతి మాకు వ‌ద్దే వ‌ద్దే...!!
***
నోట్ : వారు స్పందించ‌ని ప‌క్షంలో తెలంగాణ స‌ర్కారే స్పందించాల‌ని విజ్ఞ‌ప్తి.. ఇక‌పై మీడియా కూడా మాకు సంబంధం లేని ఆంధ్రా మ‌హ‌నీయుల గురించి ఇక్క‌డ వార్త‌లుగా చూపితే స‌హించ‌కూడ‌దు...

తెలంగాణ‌లో త‌యార‌య్యే వ‌స్తువుల‌పై ఏపీ పేరు...

మొన్న క‌రాచీ బేక‌రీ బిస్కెట్ డ‌బ్బా కొన్నాను.. అయితే అందులో అవి త‌యారైన ప్రాంతం పేరు డ‌బ్బా మీద రాశారు.. చ‌దివితే ఏదో రంగారెడ్డి(ఏపీ) అని ఉంది.. ఇంకా ఏపీ ఎందిరా? టీఎస్ అని పెట్టాలి క‌దా..! మ‌రి అంత‌ర్జాతీయంగా గుర్తింపు ఉన్న క‌రాచీ బేక‌రీ డ‌బ్బా మీద ఇంకా ఏపీ పేరే ఎందుకు ఉంటోంది...? ఇలా ఇంకెన్ని వ‌స్తువుల‌పై ఇలా ఉంటుందో అర్థం కావ‌డం లేదు..
*********
ఇక నిన్న కింగ్ ఫిష‌ర్ నీళ్ల బాటిల్ కొనుగోలు చేశాను.. అందులో ప‌టాను చెరు మండ‌లం రామ‌చంద్రాపురం(ఏపీ) అని ఉంది...
ఇదెక్క‌డి క‌థ‌... రాష్ట్రం విడిపోయినా ఈ ఏపీ పేరు మ‌న ప్రాంతంలో ఉత్ప‌త్తి అవుతున్న తిను ప‌దార్థాల డ‌బ్బాల నుంచి ఎందుకు పోవ‌డం లేదు..
దీనిపై స‌ర్కారు కొంచెం దృష్టి పెట్టాలి...!!
మేడిన్ తెలంగాణ వ‌స్తువులు అయిన‌ప్ప‌టికీ ఏపీ అన్న‌ది ఎందుకు ఉంటుందో కొంచెం న‌జ‌ర్ పెడితే బాగుంటుంది..

ఆన్‌లైన్లో రైతు ఉత్ప‌త్తుల అమ్మ‌కాలు జ‌రిగితే...

ఉల్లి గడ్డ రైతులు, వ‌రి సాగు చేసే రైతులు నేరుగా అమెజాన్‌, ఫ్లికార్ట్ లో త‌మ స‌ర‌కులు అమ్ముకుంటే వినియోగ‌దారుల‌కు, రైతుల‌కు మేలు జ‌రుగుతుందేమో..!! ఈ దిశ‌గా ఆన్ లైన్‌లో వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తులను అమ్ముకునే స్వేచ్ఛ‌ను రైతుల‌కు ఇస్తే ద‌ళారుల‌కు చెక్ పెట్టొచ్చు క‌దా.. ఈ ప‌ద్ధ‌తిలో ఉండే అవ‌రోధాల‌ను గుర్తిస్తే బాగుంటుంది... బియ్యం బ‌స్తాల‌ను అమెజాన్ వాడు ఆటోల్లో వినియోగ‌దారుల‌కు అమ్ముతుంటే చూడాల‌ని ఉంది... వీలైతే ఎఫ్ సీ ఐ మాదిరిగా ఈ అమ్మ‌కాల సంస్థ‌లే గోడౌన్ లు ఏర్పాటు చేసుకుంటే మేలేమో...!!

తెలంగాణ‌లో ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో బ‌యోమెట్రిక్ హాజ‌రు ప‌ట్టిక‌ను పెట్టాలి..

తెలంగాణ‌లో ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో బ‌యోమెట్రిక్ హాజ‌రు ప‌ట్టిక‌ను పెట్టాలి..
ఉద్యోగులు స‌మ‌య పాల‌న పాటించ‌కుంటే జీతాల్లో కోత‌లు పెట్టాలి..
********************
వేత‌న స‌వ‌ర‌ణ సంఘం సిఫార్సుల ప్ర‌కారం జీతాలు పెంచాల‌ని డిమాండ్ చేసిన తెలంగాణ ప్ర‌భుత్వ ఉద్యోగులు మ‌రి.. నిబంధ‌న‌ల ప్ర‌కారం స‌మ‌య‌పాల‌న పాటించాల‌ని తెలియ‌దా?
60 శాతం మంది ఆఫీసుల‌కు ఆల‌స్యంగా రావ‌డం, ముందుగా వెళ్తున్నారు.. ఇక వ‌చ్చిన వాళ్లు స‌రిగా ప‌నిచేయ‌డం లేదు...
ఇలాంటి వాటిని అరిక‌ట్టాలి... ఉద్యోగులు జీతాల పెంపు ఎలాగైతే త‌మ హ‌క్కు అని కొట్లాడారో.. అలాగే స‌రిగా ప‌నిచేయ‌డ‌మూ వారి బాధ్య‌త అన్న విష‌యాన్ని విస్మ‌రించ‌రాదు...
తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తీ ప్ర‌భుత్వ కార్యాల‌యంలోనూ బ‌యో మెట్రిక్ హాజ‌రు విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టాలి.. ఆధార్‌తో అనుసంధానం చేయాలి... ఆల‌స్యంగా వ‌చ్చే ఉద్యోగుల వేత‌నాల్లో కోత విధించాలి... ఉద్యోగ సంఘాలు వ్య‌తిరేకించినా స‌రే ఈ మార్పు దిశ‌గా అడుగులు ప‌డాల్సిందే.. లేక‌పోతే తెలంగాణ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో విఘాత‌కులుగానే మారుతారు... !

మోదీ మ‌న‌సులోని మాట‌ను ఆల‌కించిన ఓవైసీ

************

సంప‌న్నులు గ్యాస్ స‌బ్సిడీ వ‌దులు కోండి అని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ పిలుపునివ్వ‌డం... హైద‌రాబాద్‌లో ఉన్న ఎంఐఎం పార్టీ అధినేత అస‌దుద్దీన్ ఓవైసీ త‌న స‌బ్సిడీని వ‌దులు కోసం జ‌రిగింది... ఇది చాలా మంచి ప‌రిణామం.. ఓవైసీని ఆద‌ర్శంగా తీసుకుని మ‌రింత మంది నేత‌లు స‌బ్సిడీని వ‌దులుకుంటే బాగుంటుంది.. ఇందులోనూ మ‌త‌ప‌ర‌మైన రాజ‌కీయాల‌ను జొప్పించొద్ద‌ని విజ్ఞ‌ప్తి.. మంచిని స్వాగ‌తించాలి..

ఆ ప్ర‌శ్న వేయ‌నందుకు సంతోషించాల్సిందే..

ఇంకా న‌యం.. తెలంగాణ ఉద్య‌మంలో బీటెక్ సివిల్ అభ్య‌ర్థులు కొట్లాడ‌లేదు.. ఆర్ట్స్ పోర‌గాళ్లే ఎక్కువ మంది కొట్లాడిన్లు.. మ‌రి నోటిఫికేష‌న్ మాత్రం సివిల్ అభ్య‌ర్థుల కోసం మొద‌ట వేస్తారా? అని ఎవ‌రూ ప్ర‌శ్నించ‌లేదు..
***********
నోట్‌: ఉద్య‌మంలో చ‌నిపోయిన యువ‌త‌ను బీసీలు, ఎస్సీ, ఎస్టీలుగా విభ‌జిస్తూ చెప్పిన పెద్ద మ‌నుషుల‌ను చూశాం క‌దా.. మ‌రి చ‌దువుకున్న‌ కోర్సుల వారీగా కూడా విభ‌జిస్తారేమో అన్నఅనుమానం ఉండే.. ఇప్ప‌టి వ‌ర‌కూ అలా ఎవ‌రూ ప్ర‌శ్నించ‌లేదు.. ప్ర‌శ్నించకూడ‌దు కూడా..

నాగం జ‌నార్ద‌న్‌రెడ్డి పార్టీ పెడితే మేలు..

నాగం జ‌నార్ద‌న్‌రెడ్డి పార్టీ పెడితే మేలు.. 
బీజేపీలో ఉంటూ.. వేరు ఉద్య‌మ సంస్థ‌లు న‌డిపితే ఫ‌లితం శూన్య‌మే..
********
బీజేపీలో గుర్తింపు ద‌క్క‌క‌.. త‌న అస్తిత్వాన్ని కోల్పోయే స్థితితో బ‌చావో తెలంగాణ పేరిట ఉద్య‌మిస్తామ‌ని ప్ర‌క‌టించిన నాగం జ‌నార్ద‌న్‌రెడ్డి ప్ర‌త్యేక పార్టీ పెడితే మంచిది.. టీడీపీలోని త‌న స‌న్నిహితుల‌ను, బీజేపీలోని క‌ర‌డుగ‌ట్టిన తెలంగాణ వాదుల‌ను, అలాగే టీఆర్ఎస్‌లోని అసంతృప్తి నేత‌ల‌ను క‌లుపుకుని ముందుకు వెళ్ల‌గ‌లగాలి. అలా కాకుండా యెన్నం లాంటి ఒక‌రిద్ద‌రు త‌న‌ జిల్లా నేత‌ల‌తో క‌లిసి ఎంత పోరాడినా చివ‌రికి మిగిలేది శూన్య‌మే..
మ‌రోవైపు తెలంగాణ‌ బ‌చావో నినాదం ఇప్పుడు కావాల్సింది కాదు.. 60 ఏళ్ల స‌మైక్య పాల‌న నుంచి తెలంగాణ ర‌క్షించ‌బ‌డింది.. ఇప్పుడు ఆ తెలంగాణ‌ను ముందుకు తీసుకెళ్లాలి.. అందుకే నాగం ఉద్య‌మ సంస్థ పేరు బ‌డావో తెలంగాణ అని ఉంటే బాగుండేది.. ఇందులోనూ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ఎత్తిచూపుతూ,, స‌ర్కారుకు నిర్మాణాత్మ‌క సూచ‌న‌లు ఇస్తూ ముందుకు వెళ్తే అది ఆయ‌న విశ్వ‌స‌నీయ‌త‌ను పెంచుతుంది.. కేవ‌లం విమ‌ర్శ‌ల‌కే ప‌రిమితం అయితే మిగ‌త ఉద్య‌మ సంస్థ‌ల మాదిరిగా క‌నుమ‌రుగు కావాల్సిన ప‌రిస్థితి ఉంటుంది..
****
నోట్‌: ప్ర‌స్తుతం తెలంగాణ‌లో ఒక్కో పార్టీకి ఒక్కో సామాజిక వ‌ర్గానికి చెందిన‌ది అన్న రీతిలో ముద్ర ప‌డిన స‌మ‌యంలో నాగం ఉద్య‌మ సంస్థ కూడా అప్ర‌మ‌త్తంగా ఉండాలి. ఒక్క వ‌ర్గం వారితో దాన్ని న‌డిపించ‌కుండా అన్ని వ‌ర్గాల‌ను క‌లుపుకుని వెళ్లేలా ప్ర‌ణాళిక‌లు వేసుకోవాలి.

వారంలో ఒక రోజు మ‌న కార్ల‌ను వినియోగించ‌డం మానేస్తే ఎంత బాగుంటుంది.

వారంలో ఒక రోజు మ‌న కార్ల‌ను వినియోగించ‌డం మానేస్తే ఎంత బాగుంటుంది. ర‌హ‌దారుల‌పై ర‌ద్దీ త‌గ్గుతుంది. కాలుష్యం త‌గ్గుతుంది. కొంత క‌ష్ట‌మైనా ప్ర‌జా ర‌వాణా వ్య‌వ‌స్థ‌ను ఉప‌యోగించుకుంటే బాగుంటుంది. ఈ ఆలోచ‌న‌తో ఐటీ కారిడార్‌లో చేప‌డుతున్న కార్ ఫ్రీ థ‌ర్స్ డే కార్య‌క్ర‌మానికి నా సంపూర్ణ మ‌ద్ద‌తు. ఐటీ ఉద్యోగులు దాదాపు 50000 కార్ల‌ను వినియోగిస్తున్న‌ట్లు అంచ‌నా వేశారు. ఈ లెక్క‌న ఒక్క రోజు వీళ్లంతా కార్ల‌ను వినియోగించ‌కుంటే ఎంత బాగుంటుంది. అయితే ఈ కార్య‌క్ర‌మాన్ని హైద‌రాబాద్ మొత్తం వ‌ర్తింపజేయాలి. ప్ర‌జ‌లంతా ప్ర‌తీ వారం స్వ‌చ్ఛందంగా ఇలాంటి కార్య‌క్ర‌మాన్ని కొన‌సాగించాలి... జై తెలంగాణ‌, జై జై తెలంగాణ‌...

తెలంగాణ ఉద్యోగాల‌కు స‌న్న‌ద్ధం అవుతున్న సీమాంధ్ర అభ్య‌ర్థులు.. తెలంగాణ చ‌రిత్రను తెలుసుకుంటున్న వైనం..

తెలంగాణ ఉద్యోగాల‌కు స‌న్న‌ద్ధం అవుతున్న సీమాంధ్ర అభ్య‌ర్థులు..
తెలంగాణ చ‌రిత్రను తెలుసుకుంటున్న వైనం..
మెరిట్ పోస్టులు కొట్టుకుపోతామ‌ని ధీమా..!!
సింగ‌రేణిలో ఒక కొలువు కొట్టేసిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ వాసి..
*******************
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వ నోటిఫికేష‌న్లు వ‌స్తాయో రావో తెలియ‌క‌... తెలంగాణ‌లో రాబోయే నోటిఫికేష‌న్ల‌లో ఎలాగైన ఉద్యోగాలు పొందాల‌ని సీమాంధ్ర అభ్య‌ర్థులు గంపెడాశ‌ల‌తో ఉన్నారు... సీరియ‌స్‌గా స‌న్న‌ద్ధం అవుతున్నారు.. మా రాష్ట్రంలో మీరెలా ఉద్యోగాలు పొందుతార‌ని ఓ మిత్రుడిని ప్ర‌శ్నిస్తే.. సెల‌బ‌స్‌లో కొన్ని మార్పులు త‌ప్ప భాషాప‌ర‌మైన స‌మ‌స్య‌లు లేవు క‌దా.. ఎలాగూ మెరిట్ తెచ్చుకుంటే నాన్ లోక‌ల్ కోటా కింద 15-20 శాతం ఉద్యోగాల‌కు ఇత‌ర రాష్ట్రాల వారు పోటీ ప‌డొచ్చు అని స‌మాధానం ఇచ్చాడు.. అంటే 25 వేల పోస్టుల‌లో 20 శాతం అంటే దాదాపు 5 వేల పోస్టులు ఓపెన్‌లో ఉంటాయ‌న్న మాట‌.. ఇదే నిజ‌మైతే తెలంగాణ అభ్య‌ర్థులు మ‌రింత‌గా క‌ష్ట‌ప‌డాలి.. ప్ర‌తీ పోస్టును మ‌న‌మే ద‌క్కించుకోవాలి..
***********************
ఓపెన్ కోటా పోస్టులు కూడా ఇత‌ర రాష్ట్రాల వారు త‌న్నుకుపోకుండా జాగ్ర‌త్త ప‌డాలి... స్థానిక‌త ధ్రువ‌ప్ర‌తాలు, ఇత‌ర‌త్రా అన్ని అంశాల్లోనూ టీపీఎస్సీ, తెలంగాణ స‌ర్కారు జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. ఆంధ్రాలో డీఎస్సీలో తెలంగాణ వారికి క‌నీసం అవ‌కాశ‌మే ఇవ్వ‌లేదు.. మ‌రి మ‌న వ‌ద్ద అలాంటి నిబంధ‌న‌లు రూపొందిస్తే మేలేమో..!!
మొన్న సింగ‌రేణిలో 6 వేల ఉద్యోగాల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న ఇవ్వ‌డం, ప‌రీక్ష‌లు అన్ని జ‌రిగిపోయాయి. కొన్ని పోస్టుల నియామ‌కాలు కొన‌సాగుతున్నాయి. అయితే 15 ఉద్యోగాలు ఉన్న పోస్టుకు జ‌రిగిన నియామ‌కాల్లో ఎంపికైన అభ్య‌ర్థుల్లో ఒక‌ ఆంధ్ర‌ప్ర‌దేశ్ వాసి కూడా ఉండ‌టం గ‌మ‌నార్హం. మిగిలిన పోస్టుల్లో ఎంత మంది ఉన్నారో చూడ‌లేదు..
*************************
నోట్‌: విచిత్రం ఏంటో కానీ మ‌న అభ్య‌ర్థులు క‌నీసం ఎప్పుడు కూడా పొరుగు రాష్ట్రాల ప‌రీక్ష‌ల కోసం స‌న్న‌ద్ధం కూడా కారు.. తెలంగాణ త‌ప్ప దేశంలో ప‌డుతున్న ఇత‌ర నోటిఫికేష‌న్ల ధ్యాసే ఉండ‌దు.. ఈ ధోర‌ణి ఎప్పుడు మారుతుందో ఏమో.. స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్‌, యూపీఎస్సీ నోటిఫికేష‌న్లు ప్ర‌తీ నెల‌లోనూ ఉంటాయి.. సీరియ‌స్‌గా ప్రిపేర్ అయితే కేంద్ర కొలువులో లేక కేంద్ర ప్ర‌భుత్వ రంగ సంస్థ‌ల్లో లేక రైల్వేలు, బ్యాంకుల్లో కొలువులు కొట్టేయవ‌చ్చు. ఆ దిశ‌గా తెలంగాణ యువ‌త ఆలోచించాలి. తెలంగాణ స‌ర్కారు ఉచితంగా కోచింగ్ కేంద్రాల‌ను న‌డ‌పాలి.

తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లూ ఎన్నిక‌ల‌కు పోతే...!! చెరో ల‌క్ష‌న్న‌ర కోట్లు వ‌స్తాయేమో క‌దా..!!!

ఓ ఆలోచ‌న‌...!!
తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లూ ఎన్నిక‌ల‌కు పోతే...!!
చెరో ల‌క్ష‌న్న‌ర కోట్లు వ‌స్తాయేమో క‌దా..!!!
**********
ఎన్నిక‌లు ఉండే రాష్ట్రాల‌కు ప్యాకేజీలు ఇస్తాన్నారు క‌దా... మ‌రి ఇప్ప‌ట్లో తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రాల‌కు ఎన్నిక‌లు లేవు.. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ గారి నుంచి ప్యాకేజీ అందుకోవాలంటే క‌చ్చితంగా ఎన్నిక‌లు ఉండాలి... ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రులు త‌మ రాష్ట్రాల విశాల ప్ర‌యోజ‌నాల కోసం, ప్యాకేజీ కోసం శాస‌న‌స‌భ‌ను ర‌ద్దు చేసి ఎన్నిక‌ల‌కు వెళితే బాగుంటుందేమో... తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెరో ల‌క్ష‌న్న‌ర కోట్ల ప్యాకేజీ అయినా ద‌క్కుతుందేమో.. ఆలోచిస్తే పోలే...!!

బీ అల‌ర్ట్‌.. ఇది కేవలం ప్ర‌భుత్వం బాధ్య‌తే కాదు.. తెలంగాణ నిరుద్యోగుల బాధ్య‌త కూడా..!!

హైద‌రాబాద్‌లో ప‌నిచేస్తున్న ఆంధ్రా ఉద్యోగుల పిల్ల‌ల‌కు ఆంధ్రాలో స్థానిక‌త క‌ల్పించే విష‌యంపై అక్క‌డి ప్ర‌భుత్వం చ‌ర్చిస్తోంది... మ‌రి వాళ్ల‌కు రెండు ప్రాంతాల్లోనూ ఉద్యోగావ‌కాశాలు ఇవ్వ‌కూడ‌దు.. ఏదో ఒక ప్రాంతంలో మాత్ర‌మే వారు స్థానిక‌త‌ను ఉప‌యోగించుకోవాలి.. ఈ విష‌యంపై తెలంగాణ ప్ర‌భుత్వం క్లారిటీగా ఉండాలి... లేక‌పోతే మ‌న నోటిఫికేస‌న్లు ప‌డిన‌ప్పుడు ఇక్క‌డ స్థానిక‌త‌తో ప‌రీక్ష రాయ‌డం, మ‌ళ్లా ఆంధ్రాలో నోటిఫికేష‌న్ల‌కు అక్క‌డ స్థానిక‌త‌ను ఉప‌యోగించుకోవ‌డం చేస్తారు... బీ అల‌ర్ట్‌.. ఇది కేవలం ప్ర‌భుత్వం బాధ్య‌తే కాదు.. తెలంగాణ నిరుద్యోగుల బాధ్య‌త కూడా..!!

కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నం కోసం అన్వేష‌ణ‌..

కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నం కోసం అన్వేష‌ణ‌.. అంటే 87 ఏళ్ల‌కే పార్ల‌మెంట్ 
భ‌వ‌నం మార్పు.. దీనిపై గ‌గ్గోలు ఉండ‌దు.. ఎందుకంటే అక్క‌డ రాధాకృష్ణ లేడు క‌దా.. ఆలోచ‌న చేసింది కేసీఆర్ కాదు క‌దా..

రిషితేశ్వ‌రికి ఇలా నివాళి అర్పిస్తే బాగుంటుంది..

రిషితేశ్వ‌రికి ఇలా నివాళి అర్పిస్తే బాగుంటుంది..
**************
ఏదైనా సినిమాలో ర్యాగింగ్ సీన్ పెట్టిన‌ప్పుడు క‌చ్చితంగా కింద ర్యాగింగ్ చ‌ట్ట వ్య‌తిరేకం. ర్యాగింగ్ చేసే వారికి జైలు శిక్ష అని కింద హెచ్చ‌రిక వేయాల్సిందే.. అలా వేయ‌ని చిత్రాల‌కు నిషేధం విధించాలి...
అస‌లు సినిమాల్లో ర్యాగింగ్ స‌న్నివేశాలే ఉండ‌కూడ‌దు.. !!

యూఏఈ ఇస్లామిక్ దేశం కాదండోయ్‌... అది మినీ భార‌త దేశం..

యూఏఈ ఇస్లామిక్ దేశం కాదండోయ్‌... అది మినీ భార‌త దేశం.. 
ఈ లెక్క‌న భార‌త్ ఇస్లామిక్ దేశ‌మా? లేక యూఏఈ లౌకిక దేశ‌మా? నాకు అర్థం కావ‌డం లేదు..

రిషితేశ్వ‌రి స్వ‌ప్నం చెదిరింది

ఇంట‌ర్‌లో 88 శాతం మార్కులు తెచ్చుకున్నా. ఆర్కిటెక్చ‌ర్ కోర్సుతో కెరీర్‌ను తీర్చిదిద్దుకోవాల‌ని ఆశిస్తున్నా.. నిరుపేద‌ల‌కు త‌క్కువ ఖ‌ర్చుతో ఇళ్లు నిర్మించుకునేలా చేయాల‌నేది నా ల‌క్ష్యం. - రిషితేశ్వ‌రి.

మిత్రులంద‌రికీ స్వాతంత్ర్య దినోత్స‌వ శుభాకాంక్ష‌లు..

మిత్రులంద‌రికీ స్వాతంత్ర్య దినోత్స‌వ శుభాకాంక్ష‌లు.. 
దేశానికి స్వేచ్ఛా వాయువులు అందించిన మ‌హ‌నీయుల అడుగుజాడ‌ల్లో న‌డుద్దాం. వాళ్లు క‌ల‌లు గ‌న్న భార‌తావ‌నిని నిర్మిద్దాం. దేశాన్ని, మ‌న‌ రాష్ట్రాన్ని అభివృద్ధి ప‌థంలో నిలుపుదాం. పేద‌రిక నిర్మూల‌నలో మ‌న‌వంతు తోడ్పాటును అందిద్దాం. కాశ్మీరం నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కు, గుజ‌రాత్ నుంచి అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ వ‌ర‌కు అంద‌రు భార‌తీయుల మోముపై చిరున‌వ్వుల‌ను నింప‌డ‌మే ల‌క్ష్యంగా శ్ర‌మిద్దాం... 
జై హింద్‌.. జై తెలంగాణ‌..!!
*******
Wish You all a Happy Independence Day...

ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ పేరిట నీతులు చెప్పే వారు చెరువులో ఇళ్లు క‌ట్టుకున్నార‌ని ఆరోప‌ణ‌..


ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ పేరిట నీతులు చెప్పే వారు చెరువులో ఇళ్లు క‌ట్టుకున్నార‌ని ఆరోప‌ణ‌.. దీనిపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌ర‌పాలి.. పెద్ద‌లంతా చెరువుల్లో ఇళ్లులు క‌ట్టుకుంటే ఇక చెరువులు మాయం కావా? చెప్పండి..

ఈనాడు ఉద్యోగుల భిక్షాట‌న‌

వీళ్ల‌కు న్యాయం జ‌రిగేది ఎన్న‌డో?
మ‌జిథియా సిఫార్సుల అమ‌లు ఎప్పుడో?

పుష్క‌ర పాఠాలు..

పుష్క‌ర పాఠాలు..
****************
పుష్క‌రాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించామ‌ని ఆనందంగానే ఉన్నాం. అయితే కొన్ని లోటుపాట్ల‌ను మ‌నం గుర్తించాం. వాటిని భ‌విష్య‌త్‌లో అధిగ‌మించేందుకు ప్ర‌య‌త్నించాలి.. అలాగే కొన్ని అవ‌కాశాల‌ను అందిపుచ్చుకుని దేశంలో మ‌న గుర్తింపును చాటుకునే ప్ర‌య‌త్నం చేశాం..
1. పుష్క‌రాల సంద‌ర్భంగా తెలంగాణ‌లో నాలుగు వ‌రుస‌ల ర‌హ‌దారులు లేక‌పోవ‌డం, కొన్ని ప్రాంతాల్లో రెండు వ‌రుస‌ల ర‌హ‌దారులు కూడా స‌రిగా లేని విష‌యాన్ని మ‌నం గుర్తించ‌గ‌లిగాం. ఈ నేప‌థ్యంలో ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌, నూత‌న ర‌హ‌దారుల నిర్మాణంపై ప్ర‌భుత్వం దృష్టిసారించాలి. కేంద్రం నుంచి అధిక నిధులు తీసుకు రావాలి...
2. తెలంగాణ‌లో ఆర్టీసీలో గ‌రిష్ఠంగా 5-6 వేల బ‌స్సులు ఉన్నాయి. ఈ బ‌స్సుల‌తో కోట్ల మంది భ‌క్తుల‌ను త‌ర‌లించ‌లేం.. తెలంగాణ‌కు ఉన్న ప్ర‌ధాన లోటు రైల్వే క‌నెక్టివిటీ లేక‌పోవ‌డం.. ఇది పుష్క‌రాల్లో సుస్ప‌ష్టంగా క‌నిపించింది. ఆంధ్రాకు వంద‌ల్లో ప్ర‌త్యేక రైళ్లు న‌డిచాయి. ఇక్క‌డ రైళ్లు
న‌డిపేందుకు మార్గ‌మే లేదు.. ఈ నేప‌థ్యంలో తెలంగాణ‌లో ఆధ్యాత్మిక కేంద్రాల‌కు రైలు నెట్‌వ‌ర్కు ఉండేలా కృషి చేయాలి.. అలాగే ఆర్టీసిని మ‌రింత‌గా బ‌లోపేతం చేయాలి.
వ‌చ్చే పుష్క‌రాల నాటికి ధ‌ర్మ‌పురి క్షేత్రానికి రైలు నెట్ వ‌ర్కు వ‌స్తే ఎంతో బాగుంటుంది. రైల్వే నెట్‌వ‌ర్కు ఉంటే ఆర్టీసీపై కొంత భారం త‌గ్గుతుంది. దీనిపై స‌ర్కారు దృష్టిసారించాలి.
3. పుష్క‌రాల సంద‌ర్భంగా కేవ‌లం మ‌న చుట్టుప‌క్క‌ల రాష్ట్రాల నుంచి తెలంగాణ ప‌ర్యాట‌క శాఖ ప్ర‌త్యేక బ‌స్సుల‌ను న‌డిపింది. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర త‌దిత‌ర రాష్ట్రాల నుంచి టూరిస్టుల‌ను ఇక్క‌డికి తీసుకురావ‌డం మంచి ప‌రిణామం.. కేవ‌లం టూరిజం అంటే మ‌న వారికి మ‌న ప్ర‌దేశాలు చూప‌డం కాద‌ని, ఇత‌ర రాష్ట్రాలు, దేశాల‌కు మ‌న విశిష్ట‌త‌ల‌ను చాట‌డం అన్న విష‌యాన్ని దృష్టిలో ఉంచుకొని ప‌ర్యాట‌క శాఖ ప‌నిచేసింది.. వాళ్ల‌ను అభినందించాలి.
4. తెలంగాణ‌లో ఆధ్యాత్మిక‌, టెంపుల్ టూరిజానికి మంచి స్పంద‌న ఉంటుంద‌ని, ఆ దిశ‌గా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు ప్రారంభించాలి. యాద‌గిరి గుట్ట త‌ర్వాత‌, ధ‌ర్మ‌పురి, కాళేశ్వ‌రం, గూడెం, బాస‌ర‌ల‌కు విశేష ఆద‌ర‌ణ ల‌భిస్తోంది.. ఈ ప్రాంతాల‌ను మ‌రింత ఎక్కువ‌గా అభివృద్ధి చేయాలి.. వ‌స‌తులు క‌ల్పించాలి. రెండు మూడు ప్రాంతాల‌ను క‌లిపే టూరిజం స‌ర్క్యుట్స్‌ను అభివృద్ధి చేయాలి. ఆధ్యాత్మిక ప్రాంతాల్లో హ‌రిత హోట‌ళ్ల నిర్మాణం చేప‌ట్టాలి.
5. ఇక కోటిలింగాల లాంటి ప్రాంతాల్లో చారిత్ర‌క సంప‌ద ఉంది.. దీన్ని కాపాడటం, ఈ ప్రాంతానికి బ‌స్సు సౌక‌ర్యాన్ని మెరుగుప‌ర‌చ‌డం లాంటివి చేయాలి. వీలైతే నాగార్జున కొండ‌లో ఎలాగైదే సంప‌ద‌ను భ‌ద్ర‌ప‌రిచారో అలాంటి ఏర్పాట్ల‌ను ప్ర‌భుత్వం చేయాలి.
6. తెలంగాణ గోదావ‌రి ప‌రివాహ‌క ప్రాంతం ఎక్కువ‌గా ఉంది.. ఈ నేప‌థ్యంలో అనువైన చోట బోటింగ్ స‌దుపాయాన్ని క‌ల్పించాలి. పోచంపాడ్‌, కోటిలింగాల‌, ఇంకా ఏదైనా ప్రాంతంలో ఈ బోటింగ్‌ను ఏర్పాటు చేయాలి.
7. పుష్క‌రాల సంద‌ర్భంగా జిల్లాల్లో ట్రాఫిక్ జామ్ పెరిగింది. ట్రాఫిక్ నియంత్ర‌ణ‌పై దృష్టి సారించాలి. డివైడ‌ర్లు లేక‌పోవ‌డం వ‌ల్ల కొన్నిచోట్ల ఇబ్బందులు వ‌చ్చాయి. ఇక కూడ‌ళ్ల‌లో ట్రాఫిక్ సిగ్న‌ల్స్ లేక‌పోవ‌డమూ స‌మ‌స్య‌ల‌ను తెచ్చిపెట్టింది.
8. గోదావ‌రిలో నీళ్ల కొర‌త మ‌నం ప్ర‌త్య‌క్ష్యంగా చూశాం. ఈ నేప‌థ్యంలో డ్యాంల నిర్మాణం చేయ‌డం వ‌ల్ల క‌నీసం బ్యాక్ వాట‌ర్‌ను నిల్వ ఉంచుకోవ‌డం చేయొచ్చు.. కోటిలింగాల‌, ఎల్లం ప‌ల్లి త‌దిత‌ర ప్రాంతాల్లో బ్యాక్ వాట‌ర్ వ‌ల్ల భ‌క్తులు పుష్క‌ర స్నానం చేయ‌గ‌లిగారు.
9. బాస‌ర‌లో అసౌక‌ర్యాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని ఫిర్యాదుల వ‌చ్చాయి(నేను చూడ‌లేదు). అక్క‌డ త‌ప్పు ఎవ‌రిదో విచారించాలి. దోషుల‌ను శిక్షించాలి.
10. వ‌చ్చే ఏడాది స‌మ్మ‌క్క సార‌క్క జాత‌ర జ‌ర‌గ‌నుంది. మ‌ళ్లా ట్రాఫిక్ ఇబ్బందులు, రోడ్లు స‌రిగా లేక‌పోవ‌డం ఇత‌ర స‌మ‌స్య‌లు లేకుండా ముందునుంచే జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి.
11. ఎమ్మెల్యే ప్ర‌శాంత్ రెడ్డి గారు నిగ్ర‌హం కోల్పోయి ఓ కానిస్టేబుల్‌పై బూతుపురాణం వినిపించ‌డం త‌ప్పు.. ప్ర‌జా ప్ర‌తినిధులు ఎవ‌రైనా స‌రే సంయ‌మ‌నంతో వ్య‌వ‌హ‌రిస్తే వారికి మంచిది. ఆయ‌న ఇలాంటి త‌ప్పులు పున‌రావృతం చేయ‌ర‌ని ఆశిద్దాం.

శెభాష్ తెలంగాణ‌.. పుష్క‌రాల ఘ‌న నిర్వ‌హ‌ణ‌ స‌మ‌ష్టి విజ‌యం..

శెభాష్ తెలంగాణ‌..
పుష్క‌రాల ఘ‌న నిర్వ‌హ‌ణ‌ స‌మ‌ష్టి విజ‌యం..
ఇదే స్ఫూర్తిని భ‌విష్య‌త్‌లోనూ కొన‌సాగించాల‌ని ఆకాంక్ష‌..
***
పుష్క‌రాల సంద‌ర్భంగా తెలంగాణ స‌మాజం తీరు అద్భుతంగా ఉంది.. ఒక్క ముఖ్య‌మంత్రిని పొగ‌డ‌టం క‌న్నా మొత్తం తెలంగాణ స‌మాజాన్ని కూడా అభినందించాల్సిందే.. ప్ర‌తీ ఒక్క‌రూ ఎంతో విజ్ఞ‌త‌తో, స‌హ‌నంతో ఇది మ‌న తెలంగాణ‌, ఇవి మ‌న పుష్క‌రాలు, వీటిని ఎలాగైన విజ‌య‌వంతంగా నిర్వ‌హించుకోవాల‌న్న ఆరాటంతో త‌మ‌వంతు పాత్ర పోషించారు., పోలీసులు, పంచాయ‌తీ రాజ్ సిబ్బంది, వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది, పారిశుద్ధ్య విభాగం సిబ్బంది, నీటిపారుద‌ల శాఖ అధికారులు, స్వ‌చ్ఛంద సంస్థ‌లు, గ్రామీణ యువ‌కులు, పాఠ‌శాల విద్యార్థులు, మంత్రులు, ప్ర‌జ‌లంద‌రూ స‌మ‌ష్ఠిగా పుష్క‌రాల‌ను విజ‌య‌వంతం చేశారు.. వీళ్లంద‌రికీ శ‌త‌కోటి వంద‌నాలు.. ఇలాంటి ఐక్య‌త‌ను, అంకిత‌భావాన్ని మున్ముందు మ‌రింత‌గా ప్ర‌ద‌ర్శించాలి.. అన్ని సంద‌ర్భాల్లోనూ తెలంగాణ స‌మాజం ఏక‌తాటిపై నిల‌వాలి.. ఈ ప‌న్నెండు రోజుల పుష్క‌రాల‌ను విజ‌య‌వంతం చేయడానికి, ఏర్ప‌ట్ల కోసం శ్ర‌మించిన ప్ర‌తీ ఒక్క‌రికీ పేరు పేరునా కృతజ్ఞ‌తాభినంద‌న‌లు... తెలంగాణ జ‌నాభా 4 కోట్లే. కానీ పుష్క‌రాల‌కు దాదాపు 6 కోట్ల మంది(రేప‌టితో క‌లిపితే) రావ‌డం నిజంగా గొప్ప విష‌య‌మే.. వాళ్ల‌కు చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైన మాట వాస్త‌వ‌మే కానీ.. త‌క్కువ స‌మ‌యంలో ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా ప‌నిచేసిన ప్ర‌తీ ఒక్క‌రినీ ప్ర‌భుత్వం గుర్తించాలి..
************
పుష్క‌రాల్లో సేవ‌లు అందించిన వారికి ముఖ్య‌మంత్రి త‌ర‌ఫున ప్ర‌శంసా ప‌త్రాల‌ను అందిస్తే బాగుంటుంది..
ఇది వేల మంది వ‌లంటీర్ల‌కు, ఇత‌ర స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌కు, ఊరిలోని సంఘాల‌కు పంపించాలి... ఇది ఒక జ్ఞాపిక‌గా మిగులుతుంది.. ప్ర‌జ‌లు డ‌బ్బు క‌న్నా ప్ర‌శంసా ప‌త్రాల‌కు ఎక్కువ విలువ ఇస్తారు.. తెలంగాణ ప్ర‌భుత్వం జిల్లా స్థాయిలో క‌లెక్ట‌ర్ పేరు మీదైనా లేక దేవాదాయ శాఖ త‌ర‌ఫునో లేక సీఎం కార్యాల‌యం నుంచైనా స‌రే ఈ ప్ర‌శంసా ప‌త్రాల‌ను అందించాల‌ని విజ్ఞ‌ప్తి...!
పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది సేవ‌ల‌ను మ‌రువ‌లేం.. వారికి పాదాభివంద‌నం చేసినా త‌క్కువే.. !!
పుష్క‌రాల సంద‌ర్భంగా తెలంగాణ‌కు వ‌చ్చి అసౌక‌ర్యానికి ఎవ‌రైనా గురై ఉంటే వారు పెద్ద మ‌న‌సుతో మ‌మ్మ‌ల్ని క్ష‌మించాలి..
భ‌విష్య‌త్‌లో మ‌రింత ఘ‌న‌మైన ఆతిథ్యాన్ని ఇస్తామ‌న్న భ‌రోసాను ఇస్తున్నాం..
జై తెలంగాణ‌.. జై జై తెలంగాణ‌..