1

1

Thursday 19 February 2015

వారిని త‌ల‌పై పెట్టుకుంటే అది భ‌స్మాసుర హ‌స్తం కావ‌డం ముమ్మాటికీ త‌థ్య‌మే...!

మాయావ‌తి ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ద‌ళిత‌, బ‌హుజ‌న‌, క్ష‌త్రియ‌, బ్రాహ్మ‌ణుల‌తో చెలిమి చేసింది.. అంతేకాని ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌కు పొరుగు రాష్ట్రాలైన బీహార్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ నుంచి వ‌చ్చి స్థిర‌ప‌డిన‌ వారితో మాత్రం కాద‌న్న విష‌యాన్ని గుర్తుంచుకోవాలి .. కేసీఆర్ మాయావ‌తి లెక్క‌పోతుండు అనే వారు ఈ విష‌యాన్ని గుర్తుంచుకోవాలి...  సోష‌ల్ ఇంజినీరింగ్ తెలంగాణ‌లో అవ‌స‌రం అనుకుంటే ఇక్క‌డి బీసీ, ద‌ళిత‌, గిరిజ‌న‌, రెడ్డి, వెల‌మ‌ల‌తో క‌లిసి చేయొచ్చు... అంతేకాని ఇక్క‌డి వాళ్ల‌ను సైడ్‌లైన్ చేసి పొరుగు నుంచి వ‌చ్చిన వారిని  త‌ల‌పై పెట్టుకుంటే అది భ‌స్మాసుర హ‌స్తం కావ‌డం ముమ్మాటికీ త‌థ్య‌మే...!
--------------------
నోట్‌:  శివ‌సేన‌, ఎంఎన్ఎస్‌లు మూల సిద్ధాంతాన్ని వ‌దిలి బీహారీల‌తో చెట్ట‌ప‌ట్టాలు వేసుకుంటే ఆ పార్టీల అస్థిత్వం ఎప్పుడో మంట‌గ‌లిసేది...మూల సిద్ధాంతానికి క‌ట్టుబ‌డి ఉంది కాబ‌ట్టే శివ‌సేన మ‌నుగ‌డ సాగిస్తోంది.. మ‌రాఠీ హక్కుల‌ను ప‌రిర‌క్షిస్తోంది... !!

No comments:

Post a Comment