1

1

Tuesday 10 February 2015

శ్రీ‌శైలాన్ని ఖాళీ చేయాల‌ని యోచిస్తోన్న ఆంధ్రా స‌ర్కారు..

వీళ్ల అవ‌స‌రాల కోసం ఏం చేసినా చెల్లుతుంది..
శ్రీ‌శైలాన్ని ఖాళీ చేయాల‌ని యోచిస్తోన్న ఆంధ్రా స‌ర్కారు..
800 అడుగుల వ‌ర‌కు నీటి వినియోగంపై యోచ‌న‌..

--------------------------
మొన్న తెలంగాణ‌లో పంట‌లు ఎండిపోతున్నాయి.. వాటిని కాపాడ‌టానికి విద్యుత్ అవ‌స‌రం ఉండి శ్రీ‌శైలంలో విద్యుత్ ఉత్ప‌త్తి చేస్తే ఆంధ్రా ప్రాంతా నేత‌లు, ఈనాడు ప‌త్రిక ఎంత గ‌గ్గోలు పెట్టింది... శ్రీ‌శైలం అడుగంటుతోంది అని తెగ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.. 854 అడుగుల వ‌ర‌కు వాడుకుంటామంటే కుద‌ర‌నే కుద‌ర‌ద‌ని పెద్ద పంచాయితీ పెట్టింది.. చివ‌రికి కృష్ణా బోర్డుతో ఆదేశాలు ఇప్పించి మ‌రీ నీటి వినియోగాన్ని అడ్డుకున్నారు...
ఇక ఇప్పుడు ఆంధ్రాలో ర‌బీలో పంట‌ల కోసం నీళ్లు కావాలట‌.. కేంద్రం ద్వారా ఒత్తిడి తెప్పించి నీళ్ల‌ను దోచుకెళ్లాల‌ని చూశారు.. కేంద్రం జోక్యం చేసుకోబోమ‌ని తేల్చిచెప్ప‌డంతో ఇక కుయుక్తులు ప‌న్నుతున్నారు.. అందుకోసం శ్రీ‌శైలాన్ని పూర్తిగా ఖాళీ చేసే ఆలోచ‌న చేస్తున్నారు.. 800 అడుగుల వ‌ర‌కు సాగు నీటి కోసం నీటిని వాడుకుంటే 65 టీఎంసీలు అందుబాటులో ఉంటాయ‌ట‌... 800 అడుగుల క‌న్నా కింద ఉన్న నీటిని తాగునీటి కోసం వాడుకునే ఆలోచ‌న చేస్తున్నార‌ట‌...
ఎంత దారుణం ఇది... అంటే పంట‌లు వారికే ఉన్న‌ట్లా... తెలంగాణ రైతుల కోసం విద్యుత్ ఉత్ప‌త్తికి నీటిని న్యాయ‌ప‌రంగా వాడుకుంటే చెల్ల‌ద‌న్న వాళ్లు ఇప్పుడు శ్రీ‌శైలాన్ని ఖాళీ చేసి ఆంధ్రాకు త‌ర‌లించుకుపోయే ఆలోచ‌న‌లు చేయ‌డాన్ని తెలంగాణ ప్ర‌భుత్వం అడ్డుకోవాలి... లేక‌పోతే వేస‌విలో తాగునీటి ఇబ్బందులు త‌ప్ప‌వు... ఈ విష‌యంలో ప‌చ్చ ప‌త్రిక‌ల ఎత్తుగ‌డ‌ల‌ను తిప్పికొట్టాల్సిందే..!!

No comments:

Post a Comment