1

1

Tuesday 10 February 2015

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో, తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెరిగాయి... ప‌త్రిక‌ల్లో వార్తా శైలిలో మారాయి...






ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో, తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెరిగాయి... 
అయితే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ, తెలంగాణ‌లోనూ పేదోడిపై భారం ప‌డ‌కుండా విద్యుత్ ఛార్జీలు పెంచార‌న్న‌ది వాస్త‌వం..
మ‌రి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విద్యుత్ ఛార్జీలు పెంచిన‌ప్పుడు ఆంధ్ర‌జ్యోతి, ఈనాడు వాళ్లు సామాన్యుల‌కు అవ‌గ‌తం అయ్యే రీతిలో వార్త‌ల‌ను రాశారు..
పేదోళ్ల‌పై ఎలాంటి భారం ఉండ‌బోద‌ని రాశారు.. మ‌రి తెలంగాణ ప్ర‌భుత్వం విద్యుత్ ఛార్జీల‌ను పెంచ‌బోతున్న‌ప్పుడు మాత్రం... వాడే కొద్దీ మోత అని ఒక‌డు... మ‌రొక‌డైతే తెలంగాణ జ‌నులారా.. బీ రెడీ... మీపై విద్యుత్ భారం మోప‌బోతున్నారు.. ప్ర‌త్యామ్నాయ ఆదాయ అవ‌కాశాల‌ను అన్వేషించ‌కుండా విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపుతున్నారంటూ ఆంధ్ర‌జ్యోతి లో రాశారు...
ఎందుకిలా?
తెలంగాణ పాఠ‌కుల‌ను గంద‌ర‌గోళానికి గురి చేయ‌డం ఎందుకు?  70 శాతం మందిపై భారం ఉండ‌బోద‌ని బాక్స్‌లోనో, డెక్ లోనో పెట్టవ‌చ్చు కదా.. వాటిని హైలెట్ చేయ‌డం ఇష్టం లేదా...?
----------------

నోట్‌: ఇంకో విచిత్రం ఏంటంటే 100 యూనిట్ల లోపు వినియోగించే వారికి రెండు రాష్ట్రాల్లోనూ ఛార్జీలు పెంచ‌లేదు..
అయితే 200లోపు వినియోగించే వారికి ఆంధ్రాలోనే అధికంగా ఛార్జీలు పెంచారు.. ఈ విష‌యాన్ని ఛార్జీల ప‌ట్టిక‌లోనూ చూస్తే అర్థం అవుతుంది.. 


1 comment:

  1. ఆంధ్ర పత్రికల మితిమీరిన రాతలను తెలంగాణా ప్రజలేకాదు , మీడియా ఉద్యోగులూ ఖండించాలి... ప్రత్యామ్నాయ పత్రికలు రావాలి

    ReplyDelete