1

1

Thursday 12 February 2015

తెలంగాణ‌లో మొండి బ‌కాయిలు వ‌సూలు కావడం ఆంధ్ర‌జ్యోతికి ఇష్టం లేన‌ట్లు ఉంది..

జీహెచ్ ఎంసీలో మొండి బ‌కాయిదారులైన వ్యాపార స‌ముదాయాల ముందు చెత్త డ‌బ్బాల‌ను ఏర్పాటు చేస్తే ఆంధ్ర‌జ్యోతి వాడికి న‌చ్చ‌డం లేదు..
మొండి బ‌కాయిదారుల ప‌క్షంగా ఉంటూ వార్త‌లు రాయ‌డం ఎందుకో?
కొంప‌దీసి మొండి బ‌కాయిదారుల జాబితాలో వీళ్లు కూడా ఉన్నారేమో...
నిన్న జీహెచ్ ఎంసీ ఇలా చెత్త డ‌బ్బాల‌ను ఏర్పాటు చేయ‌డంతో కొంద‌రు మొండి బ‌కాయిదారులు హుటాహుటిన వెళ్లి  బ‌కాయిల‌ను చెల్లించార‌ట‌...
అదంతా ఎందుకు బ్యాంకు లోన్లు తీసుకున్న వారి ఇంటి ముందు బ్యాంక్ ఉద్యోగులు ధ‌ర్నాలు చేయ‌డం, చాటింపులు వేయ‌డం ఆంధ్ర‌జ్యోతికి ఎప్పుడూ త‌ప్పుగా అనిపించ‌లేదు... ఉద్యోగులు వారి ప‌ని వారు చేసుకోవాలి కానీ ఇలా రోడ్లు ఎక్క‌డం ఏంటని ప్ర‌శ్నించ‌లేదు..?
ఇక్క‌డ తెలంగాణ ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం అమ‌లు చేస్తోండ‌టం... అందులోనూ ఆంధ్ర‌జ్యోతికి అస‌లే గిట్ట‌ని క‌మిష‌న‌ర్ సోమేశ్ కుమార్ ఇలా చేస్తుండ‌ట‌మే కంట‌గింపుగా మారింది....
-------------------
నోట్‌:  ఇదే ప‌నిని ఆంధ్రా ప్ర‌భుత్వం చేస్తే... త‌ప్ప‌దు మ‌రీ... మొండి బ‌కాయిదారుల‌కు గుణ‌పాఠం చెప్పాలి క‌దా.. వీలైతే మీరూ సూచ‌న‌లు స‌ల‌హాలు ఇవ్వండి అంటూ రోత రాత‌లు రాసేదే క‌దా...

No comments:

Post a Comment