1

1

Thursday 12 February 2015

ఆంధ్రాలో ప్ర‌తిప‌క్షం చ‌చ్చిపోయిందా? లేక తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్షం ఆంధ్రా ప‌క్షంగా మారిందా?

తెలంగాణ‌లో ఏ నిర్ణ‌యం తీసుకున్నా విప‌క్షాలు కోర్టుకు వెళ‌తాయి, విమ‌ర్శ‌లు చేస్తాయి...
ఫాస్టు ప‌థ‌కంపై కోర్టు వెళ్లారు..
స‌చివాల‌యం మార్చుతామంటే కోర్టు వెళుతున్నారు..
పార్టీ మారిన నేత‌ల‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని కోర్టు వెళుతున్నారు..
మంచిదే.. అలా వెళుతున్న వాళ్లంతా బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ నేత‌లే..
-------------------
ఈ  పార్టీల‌కు చెందిన ఆంధ్రా నేత‌లు చంద్ర‌బాబు నిర్ణ‌యాల‌పై కోర్టుకు వెళుతున్నారా?
బ‌ల‌వంతపు భూ స‌మీక‌ర‌ణ‌పై హైకోర్టును ఆశ్ర‌యించారా?
విప‌క్షాల ఎమ్మెల్యేల‌ను, ఎమ్మెల్సీల‌ను టీడీపీలో చేర్చుకున్న‌దానిపై కోర్టుకు వెళ్లారా?
హైద‌రాబాద్‌లో ఆధార్ కార్డు ఉన్న రైతుల‌కు రుణ మాఫీ ఇవ్వ‌బోమంటే కోర్టుకు వెళ్లారా?
ఆంధ్రాకు కోడలుగా వెళ్లి అక్క‌డే ఏళ్ల త‌ర‌బ‌డి ఉన్న వారిని స్థానికేత‌రులుగా గుర్తించి ప్ర‌వేశ ప‌రీక్ష‌ల్లో అనుమ‌తి ఇవ్వ‌కుంటే ఎవ‌రైనా కోర్టుకు వెళ్లారా?
-----------------------
మీరు కోర్టుకు కొన్ని విష‌యాల్లో వెళితే మంచిదే.. కానీ త‌ప్పులు ఒక్క ద‌గ్గ‌రే క‌నిపిస్తున్న‌ట్లుగా ప్ర‌వ‌ర్తిస్తుంటే మీ విశ్వ‌స‌నీయ‌త‌పైనే సందేహాలు మొద‌ల‌వుతాయి..

నోట్‌:  విద్యుత్ ఛార్జీలు పెంచితే ఆంధ్రాలో బీజేపీ, కాంగ్రెస్ ఎంత తీవ్రంగా స్పందించాయో ఎవ‌రైనా చూశారా?   ఇక్క‌డ మాత్రం తెగ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.. ఆంధ్రాలో ప్ర‌తిప‌క్షం చ‌చ్చిపోయిందా?  లేక తెలంగాణ‌లో ప్ర‌తిప‌క్షం ఆంధ్రా ప‌క్షంగా మారిందా?  ఏమీ అర్థం కావ‌డం లేదు.. 

No comments:

Post a Comment