1

1

Monday 9 February 2015

మోడీ ల‌క్ష్యాన్ని పూర్తి చేసిన కేజ్రీవాల్‌..


మోడీ ల‌క్ష్యాన్ని పూర్తి చేసిన కేజ్రీవాల్‌..
మోడీ స్ఫూర్తితో కాంగ్రెస్ ముక్త్ ఢిల్లీని సాకారం చేసిన కేజ్రీ....
-------------------
కాంగ్రెస్ ముక్త్ భార‌త్ కావాల‌ని మోడీ గారు ప‌దేప‌దే దేశ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు... ఆ పిలుపును అర‌వింద్ కేజ్రీవాల్ బాగా వంట‌బ‌ట్టించుకున్నారు.. మోడీ పిలుపునిచ్చిన‌ప్ప‌టికీ హ‌ర్యానా, మ‌హారాష్ట్ర‌, జార్ఖండ్, జ‌మ్మూకాశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌కు కొన్ని సీట్లు వ‌చ్చాయి.. ఆ పార్టీ ఎన్నిక‌ల్లో ఓడిపోయిన‌ప్ప‌టికీ ఆ పార్టీకి చెందిన కొంద‌రు అభ్య‌ర్థులు మాత్రం గెలిచారు.. దీంతో మోడీ గారు చెప్పిన కాంగ్రెస్ ముక్త్ భార‌త్ లక్ష్యం అంత‌గా సాకారం కాలేదు..
అయితే అరవింద్ కేజ్రీవాల్ అయితే ఢిల్లీని.. కాంగ్రెస్ ముక్త్ ఢిల్లీగా మార్చారు.. కాంగ్రెస్‌ను పూర్తిగా తుడిచిపెట్టేశారు... ఒక్క సీటు కూడా ఆ పార్టీకి ద‌క్క‌కుండా చేశాడు... ఈ క్ర‌మంలో కొంత మేర‌కు బీజేపీ ముక్త్ ఢిల్లీగా కూడా మార్చారు..
అంటే మోడీ ల‌క్ష్యాన్ని వంద‌కు వంద శాతం పూర్తి చేసిన అరవింద్ కేజ్రీవాల్‌ను బీజేపీ అభిమానులు కూడా అభినందిస్తార‌నుకుంటా...!!

No comments:

Post a Comment