1

1

Tuesday 21 July 2015

కేసీఆర్ పండుగ‌ల‌కు పబ్బాల‌కు డ‌బ్బులు ఇవ్వ‌కుండా దోచుకుంటే బాగుంటుందేమో..

బతుకమ్మ కు 10 కోట్లు 
క్రిస్టమస్ కు 25 కోట్లు 
రంజాన్ కు 25 కోట్లు 
పుష్కరాలకు 650కోట్లు 
బోనాలకు 10కోట్లు 
సానియా మిర్జాకు 2 కోట్లు
స్వచ్చ హైదరాబాద్ కు 200 కోట్లు
యాదగిరి గుట్టకు 100 కొట్లు
తిరుప‌తికి 5 కొట్లు...
ఎవ‌డ‌బ్బ సొమ్మ‌ని కేసీఆర్ ఇస్తున్నాడ‌ని కొంద‌రు మేధావులు ప్ర‌శ్నిస్తున్నారు..
బ‌తుక‌మ్మ ఆడేది మ‌హిళ‌లే... తెలంగాణ‌లో 1.5 కోట్ల మంది మ‌హిళ‌లు ఉన్నారు.. కేసీఆర్ కుటుంబ‌మే కాదు.. రంజాన్ జ‌రుపుకునేది ముస్లింలే కేవ‌లం కేసీఆర్ ఒక్క‌టే కాదు.. తెలంగాణ‌లో దాదాపు 70-80 ల‌క్ష‌ల మంది ముస్లింలు ఉన్నారు... పుష్క‌రాల‌కు ఇప్ప‌టికే 3 కోట్ల మంది వ‌చ్చారు.. బోనాల‌కు ల‌క్ష‌ల మంది వ‌స్తారు.. హైద‌రాబాద్‌లో ఉన్న ప్ర‌తీ తెలంగాణ వ్య‌క్తి బోనాలు చేసుకుంటారు.. ఇన్ని కోట్లు ఖ‌ర్చు చేయ‌డం వ‌ల్ల దాదాపు తెలంగాణ‌లో 5 కోట్ల మందికి అసౌక‌ర్యాలు క‌ల‌గ‌కుండా ఉన్నాయి..
మీరే అంటున్నారు ఈ సొమ్మును కేసీఆర్ ఇస్తున్నాడ‌ని... మ‌రి కేసీఆర్ ఇస్తున్నాడు కానీ జేబులో వేసుకోవ‌డం లేదు క‌దా...
ల‌క్ష‌ల కోట్ల అవినీతితో తెలంగాణ సొమ్మును గ‌త పాల‌కులు కాజేస్తే నిల‌దీయ‌ని వాళ్లు.. ఇప్పుడు పండుగ‌ల‌కు, క్రీడాకారుల‌కు, పేద‌ల‌కు ప్ర‌భుత్వం నిధులు ఇస్తుంటే తెగ ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.. చూస్తుంటే కేసీఆర్ కూడా రాజ‌శేఖ‌రెడ్డిలాగా, చంద్ర‌బాబులాగా ల‌క్ష‌ల కోట్ల
కుంభ‌కోణాలు చేసి లోట‌స్ పాండ్‌ల‌ను క‌ట్టించుకుంటేనే వీళ్లు ప్ర‌శ్నించ‌డం ఆపేస్తారేమో...!!

No comments:

Post a Comment