1

1

Friday 17 July 2015

రిషితేశ్వ‌రిని బ‌లిగొన్న ఈ ముగ్గురు విద్యార్థుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలి...!!


గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివ‌ర్సిటీలో ర్యాగింగ్ వ‌ల్ల ఆత్మ‌హ‌త్య చేసుకున్న రిషితేశ్వ‌రి(14) కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు.. హ‌నీషా అనే ద్వితీయ సంవ‌త్స‌రం విద్యార్థిని నాలుగో సంవ‌త్స‌రం చ‌దువుతున్న చ‌ర‌ణ్‌, శ్రీ‌నివాస్‌ల‌ను ప్రేమించాలంటూ రిషితేశ్వ‌రిపై ఒత్తిడి తెచ్చింద‌ట‌.. వీళ్లు ముగ్గురూ మాన‌సికంగా వేధిస్తున్నార‌ని రిషితేశ్వ‌రి త‌న డైరీలో రాసుకుంది... పాపం ఆ అమ్మాయి త‌న అవ‌య‌వాల‌ను పేద‌ల‌కు దానం చేయాల్సిందిగా ఆత్మ‌హ‌త్యా లేఖ‌లోనూ రాసింది.. ఎంత సున్నిత మ‌న‌స్కురాలు.. ఆమెను బ‌లిగొన్న ఈ ముగ్గురు విద్యార్థుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలి...!!

1 comment:

  1. నేరస్తుల్ని పట్టుకున్న్నాక కఠిన చర్యల సంగతేమో గానీ ఒక ఆదపిల్ల ఇంకో ఆడపిల్లకి ఇద్దరు మగపిల్లల పేర్లు చెప్పి వీళ్ళలో యెవరో ఒకర్ని ప్రేమించాలనటం వింతగా ఉంది,ఆ అమ్మాయి కూడా ఇంత్లోనూ ఇంకా పెద్దవాళ్ల కెవరికీ చెప్పకుండా తనపాటికి తను ఆత్మహత్య చేసుకోవడం,యేమిటిదంతా - నాకైతే వెయిటింగ్ ఫర్ గోడో లాంటి అబ్సర్డ్ నాటకం చూస్తున్నట్టు ఉంది?!

    జనరేషన్ గ్యాప్,పెద్దలకీ పిల్లలకీ మధ్యన భావాల్ని పంచుకునే సంబంధాలూ అన్నీ తెగిపోతేనే గదా ఇట్లాంతివి జరిగేది!పైగా ఇదే మొదటిసారి కాదు,మళ్ళీ మళ్ళీ జరుగుతున్నా సమస్యకి మూలం గురించిన ఆలోచనే రావ్టం లేదు యెవరికీ.

    ReplyDelete