1

1

Thursday 2 July 2015

దేశ ప్ర‌థ‌మ పౌరుడి క‌న్నా రేవంతుడు, చంద్ర‌బాబే ఎక్కువ‌య్యాడు ఈనాడు ప‌త్రిక‌కు...

రాష్ట్ర‌ప‌తి తిరుమ‌ల ప‌ర్య‌ట‌న వార్త‌కు ఈనాడు మొద‌టి పేజీలో ద‌క్క‌ని చోటు..
కేసీఆర్ గారూ క‌ళ్లు తెర‌వండీ... అదును కోసం వేచిచూస్తున్న మిన్నాగుల ప‌న్నాగాన్ని గుర్తించండి...
************
ఈరోజు అన్ని దిన‌ప‌త్రిక‌ల్లో మొద‌టి పేజీల్లో దేశ ప్ర‌థ‌మ పౌరుడు ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న వార్త క‌నిపించింది. కానీ రామోజీరావు ప‌త్రిక‌లో మాత్రం క‌నీసం ఇండికేష‌న్ కూడా ఇవ్వ‌లేదు.. ఎందుకంటే రేవంతుడు విడుద‌ల‌య్యాడు క‌దా.. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ డిజిటల్ ఇండియా ప్రారంభం వార్త త‌ర్వాత రెండో అత్యంత ప్రాధాన్య వార్త రేవంతుడిదే... అంటే రాష్ట్ర‌ప‌తి క‌న్నా ఎక్కువ‌గా, ప్ర‌ధాన‌మంత్రికి స‌మానంగా రేవంతుడికి ప్రాధాన్యం ఇచ్చారు.. ఇంకో విచిత్రం ఏంటంటే చంద్ర‌బాబు వార్త‌నూ తెలంగాణ ఎడిష‌న్లో మొద‌టి పేజీలో రేవంతుడి వార్త‌కు దిగువ‌న ఇవ్వ‌డం... పొరుగు రాష్ట్రానికి రాష్ట్ర‌ప‌తి వెళితే ఆ వార్త మొద‌టి పేజీలో ఇవ్వ‌లేదు కానీ... పొరుగు రాష్ట్రంలో పుష్క‌రాల కోసం గోదావ‌రి హార‌తిని చంద్ర‌బాబునాయుడు నిర్వ‌హిస్తే ఆ వార్త‌ను ఇచ్చారు.. ఒక‌వేళ రేవంత్ విడుద‌ల కాక‌పోయి ఉంటే తెలంగాణ‌లోని ఇత‌ర వార్త‌ల‌ను ఆ ప్లేస్‌లో వేసేవారా? ముమ్మాటికీ వేయ‌క‌పోయేవారు.. రాష్ట్ర‌ప‌తి వార్త‌ను మొద‌టి పేజీకి తెచ్చి తెలంగాణ వార్త‌ల‌ను కిల్ చేసేవారు.. అక్ష‌రం అక్ష‌రం తెలంగాణ వ్య‌తిరేక‌తతో రాస్తున్న మీకు గుణ‌పాఠం చెప్పే రోజు ఎంతో దూరంలో లేదు.. ఖ‌బ‌ర్దార్‌.. జై తెలంగాణ‌.. జై జై తెలంగాణ‌..!!!

No comments:

Post a Comment