1

1

Thursday 25 June 2015

వివాదాల్లో బీజేపీ మ‌హిళా నేత‌లు...

బీజేపీలోని మ‌హిళా నేత‌ల‌పై అవినీతి ఆరోప‌ణ‌లు, అక్ర‌మాల ఆరోప‌ణ‌లు ఒక్క‌సారిగా చుట్టుముట్టాయి.. ఇదంతా కాక‌తాళీయంగా జ‌రిగిందో లేక ఎవ‌రైనా బీజేపీలోని పురుష నేత‌లు వీరంద‌రినీ ఇరికిస్తున్నారో అర్థం కావ‌డం లేదు... విద్యార్హ‌త‌ల విష‌యంలో త‌ప్పుడు స‌మాచారాన్ని ఇచ్చిన కేసులో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, ఇక ల‌లిత్ మోడీకి స‌హ‌క‌రించిన కేసులో కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌, రాజ‌స్థాన్ ముఖ్య‌మంత్రి వ‌సుంధ‌ర రాజే, ఇక రూ.206 కోట్ల‌ ప‌ల్లీ చిక్కిల కుంభ‌కోణంలో మ‌హారాష్ట్ర మంత్రి పంక‌జా ముండేలు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు.. మ‌రి వీళ్లంతా స‌చ్చీలురుగా బ‌య‌ట‌కు వ‌స్తారో లేక ఇరుక్కుపోతారో కాల‌మే స‌మాధానం చెబుతుంది.. ఏది ఏమైనా అవినీతి, అక్ర‌మాల కేసులో పురుషుల‌కు తీసిపోమ‌ని నిరూపిస్తున్న‌ట్లు ఉన్నారు వీరంతా..!!

No comments:

Post a Comment