1

1

Friday 12 June 2015

అంటే మ‌న రైతులు చావాలి... మ‌న తెలంగాణ ఎడారి కావాలి.. ఇదే వారి తీరు..

జాగో తెలంగాణ జాగో...
-----------
మ‌న‌కు క‌రెంట్ లేక‌పోతే శ్రీ‌శైలంలో మ‌న వాటా నీటితో విద్యుత్ ఉత్ప‌త్తి చేసుకుంటే అడ్డుప‌డ్డారు... మ‌న రైతుల పొలాలు ఎండి చ‌నిపోతున్నా క‌రుణ చూప‌లేదు... అయినా స‌హించాం...
*************
ఆ త‌ర్వాత నెల‌లోనే హుదుద్ తుపాన్ వ‌చ్చి ఆంధ్రా అత‌లాకుత‌లం అయితే వెల‌క‌ట్ట‌ని విద్యుత్ ప‌రిక‌రాలు, తీగ‌లు, స్తంభాల‌ను పంపి మాన‌వ‌త్వం చాటుకున్నాం...
***************
తెలంగాణ‌లో క‌రెంట్ క‌ష్టాలున్నాయి.. కృష్ణ‌ప‌ట్నంలో రావాల్సిన వాటా విద్యుత్ ఇవ్వ‌మంటే స‌సేమిరా అన్నారు.. అయినా ఊరుకున్నాం..
****************
వేస‌విలో తెలంగాణ‌లో తాగునీటికి క‌ష్టాలు ఉన్నా స‌రే.. కృష్ణా డెల్టా ఎండిపోతుంది.. మా రైతుల‌ను ఆదుకోండి అని అడిగితే పాపం పోనీ అని సాగ‌ర్ నీళ్లిచ్చి ఆదుకున్నాం...
***********************
ప‌ట్టిసీమ క‌ట్టుకుంటున్నామ‌న్నా, సీలేరు విద్యుత్ ప్రాజెక్టును ఆంధ్రాలో క‌లుపుకున్నా రాద్ధాంతం చేయ‌లేదు...
***************
ఇప్పుడు మ‌న ప్రాజెక్టులు క‌ట్టుకోవ‌ద్ద‌ని, కృష్ణా ప్రాజెక్టుల‌పై మ‌న‌కు హ‌క్కులు ఉండొద్దంటూ కేంద్రానికి ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నారు...
*******************
అంటే మ‌న రైతులు చావాలి... మ‌న తెలంగాణ ఎడారి కావాలి.. దేశంలో ప్రాజెక్టుల‌పై హ‌క్కులు లేని రాష్ట్రంగా తెలంగాణ మారాల‌న్న‌దే వీరి కుట్ర‌... దీనిపై తెలంగాణ‌లోని అన్ని రాజ‌కీయ ప‌క్షాలు ఏకం కావాలి... త‌గిన బుద్ది చెప్పాల్సిందే..!!

No comments:

Post a Comment