1

1

Wednesday 10 June 2015

ఆంధ్ర‌జ్యోతి మార్కు జ‌ర్న‌లిజం....

చంద్ర‌బాబునాయుడు ఫోన్ల‌ను తెలంగాణ ప్ర‌భుత్వ ట్యాప్ చేస్తుందన్న అబ‌ద్ధాన్ని జ‌నం న‌మ్మ‌క‌పోవ‌డంతో మ‌రో కొత్త పంథాను ఎంచుకున్నాడు రాధాకృష్ణ‌... తెలంగాణ‌లోని ప్రజాసంఘాల నేత‌ల ఫోన్ల‌ను కూడా ప్ర‌భుత్వం ట్యాప్ చేస్తుంద‌న్న క‌థ‌నాన్ని మ‌సాలా దంటించి మరీ రాశాడు.. ఇలా క‌థ‌నం రాయ‌డం.. రేపు కొంద‌రు ప్ర‌జా సంఘాల నేత‌ల‌ను క‌లిసి ఫోన్ల ట్యాపింగ్‌పై అభిప్రాయం సేక‌రించ‌డం, దాన్ని చంద్ర‌బాబునాయుడు కేసుకు జోడించ‌డం, మ‌ద్ద‌తు కూడ‌క‌ట్ట‌డం వీరి జ‌ర్న‌లిజంలో భాగ‌మ‌న్న‌ట్లు... పాపం ముద్దాయిగా మారిన‌ బాస్‌ను కాపాడేందుకు సేవ‌కుడు ప‌డుతున్న తాప‌త్ర‌యాన్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది.. బ‌హుషా ఉత్త‌మ సేవ‌కుడి అవార్డును ఆంధ్రా ప్ర‌భుత్వం ఇచ్చే అవ‌కాశం ఉంటే ఆంధ్ర‌జ్యోతి రాధాకృష్ణ‌కే ఇవ్వాలేమో...!!
నోట్: బాబు పాల‌న‌లో ఎంత మంది ప్ర‌జా సంఘాల నేత‌ల‌ను హ‌త‌మార్చారో రాధాకృష్ణ‌కు తెలియ‌దా? ఎంత మంది ప్ర‌జా సంఘాల నేత‌లు అదృశ్య‌మ‌య్యారో తెలియ‌దా? అవ‌న్నీ రాయ‌గ‌లితే ద‌మ్ముందా రాధాకృష్ణ‌... ఆ అదృశ్యాలు, ఆ హ‌త్య‌ల‌పై బాబును విచారించాల‌ని డిమాండ్ చేస్తుందా? నీ ప‌త్రిక‌...

No comments:

Post a Comment