1

1

Thursday 11 June 2015

రెండు రాష్ట్రాల స‌మ‌స్య‌గా ఎలా చిత్రీక‌రిస్తారు...?

త‌మిళ‌నాడుకు చెందిన‌ ఎర్ర చంద‌నం దొంగ‌ల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం కాల్చేస్తే త‌మిళ‌నాడులోని నాయకులు ఆందోళ‌న చేసిన స‌మ‌యంలో ఇది రెండు రాష్ట్రాల ప్ర‌జ‌ల మ‌ధ్య వివాదం కాదని చంద్ర‌బాబు అండ్ కో వాదించింది... దొంగ‌లు ఎదురుతిరిగారు కాబ‌ట్టే మా పోలీసులు కాల్చేశార‌ని చెప్పుకొచ్చారు....
మ‌రి తెలంగాణ రాష్ట్రంలో దొంగ‌త‌నంగా ఎమ్మెల్యేని ప్ర‌లోభ‌పెట్టే కేసులో ఇరుక్కున్న చంద్ర‌బాబునాయుడిపై కేసు పెడితే అది ఐదు కోట్ల మంది ఆంధ్రుల‌ను అవ‌మానించిన‌ట్లు ఎలా అవుతుంది... ఎర్ర చంద‌నం దొంగ‌ల మాదిరిగానే చంద్ర‌బాబునాయుడు, రేవంత్‌రెడ్డిలు ఏసీబీకి చిక్కారు క‌దా...
మ‌రి ఎర్ర చంద‌నం దొంగ‌ల‌ను కాల్చేయ‌డం స‌బ‌బే అయిన‌ప్పుడు బాబు అండ్ కోను అరెస్టు చేయ‌డం చ‌ట్ట విరుద్ధం ఎలా అవుతుంది... రెండు రాష్ట్రాల స‌మ‌స్య‌గా ఎలా చిత్రీక‌రిస్తారు...?

No comments:

Post a Comment