1

1

Thursday 18 June 2015

ప‌ట్టిసీమ నుంచి ప్ర‌త్యేక పైపులైన్ వేయించుకున్నావా ఏంటి?


కృష్ణా బేసిన్‌లో ఉన్న హైద‌రాబాద్‌కు తాగునీరు రావొద్ద‌ని కుట్ర‌లు ప‌న్నుతున్న చంద్ర‌బాబు, రామోజీ కుట్ర‌ల‌ను చీల్చి చెండాలుతూ న‌మ‌స్తే తెలంగాణ‌లో వ‌చ్చిన క‌థ‌న‌మిది...
రామోజీ ఫిల్మ్ సిటీ కోసం రోజుకు అర టీఎంసీ నీరు ఇవ్వాల్సిందిగా రాజ‌గురువు జ‌ల మండ‌లికి ద‌ర‌ఖాస్తు చేసుకున్నాడ‌ట‌.. అయితే నీటి కొర‌త వ‌ల్ల ఇవ్వ‌లేమ‌ని వాళ్లు తిర‌స్క‌రించార‌ట‌.. మ‌రి విశ్వ‌న‌గ‌ర‌మైన హైద‌రాబాద్‌కు కృష్ణా నుంచి నీళ్లు తేకుంటే నీ ఫిల్మ్ సిటీకి, ఓం సిటీకి నీళ్లు ఎవ‌రిస్తారు రామోజీ గారు... కొంప‌దీసి ప‌ట్టిసీమ నుంచి ప్ర‌త్యేక పైపులైన్ వేయించుకున్నావా ఏంటి?
ఏ బేసిన్‌లో లేని మ‌ద్రాసుకు మ‌న నీళ్ల‌ను ధార‌ద‌త్తం చేస్తే అహో ఒహో అంటూ ఎన్టీఆర్‌ను కీర్తిస్తారు.. మ‌రి న్యాయంగా హైద‌రాబాద్‌కు రావాల్సిన నీటిని పాల‌మూరు నుంచి ఇస్తే ఎందుకు నిట్టూర్పులు.. అంటే హైద‌రాబాద్‌లోని ఆంధ్రా సీఎంకు, మంత్రుల‌కు, మీర‌న్న 40 ల‌క్ష‌ల మంది సీమాంధ్ర జ‌నానికి నీళ్లు అవ‌స‌రం లేదంటారా?

No comments:

Post a Comment