1

1

Tuesday 23 June 2015

టేపులు ప్ర‌సారం చేయ‌డం నేర‌మా...

ఆంధ్రాలో ప్రసారాలు రాని టీ న్యూస్ కు నోటీసులు ఇవ్వ‌డం నిజంగా హాస్యాస్ప‌ద‌మే.. ఇక టేపులు ప్ర‌సారం చేయ‌డ‌మే నేర‌మైతే ఏబీఎన్ ఆంధ్ర‌జ్యోతికి ఎన్ని నోటీసులు ఇవ్వాలి.. అందులోనూ బూతు వీడియోలు త‌ప్ప ఇంకే వీడియోలు ప్ర‌సారం చేయ‌ని ఆ ఛానెల్‌పై అంత‌ర్జాతీయ నేరాలు మోపాలేమో... ఇక కుట్ర క‌థ‌నాల‌కు పెట్టింది పేరైన రామోజీ ప‌త్రిక‌, ఛానెళ్ల సంగ‌తి ఏం చేయాలి.. తెలంగాణ‌లో ఈ ఆంధ్రా ఛానెళ్లు, పేప‌ర్లు ఉన్నంత కాలం మ‌న ప్ర‌యోజ‌నాల‌కు విఘాత‌మే... ఇవి ఆంధ్రా నేత‌ల ప్ర‌యోజ‌నాల కోస‌మే కొట్లాడుతాయి... టీ న్యూస్‌కు ఆంధ్రాప్ర‌భుత్వం ఒక్క ప్ర‌క‌ట‌న ఇవ్వ‌దు క‌దా.. మ‌రి మ‌నం ఎందుకు ఆంధ్రా ఛానెల్‌కు ప్ర‌క‌ట‌న‌లు ఇస్తున్నాం... న‌మ‌స్తే తెలంగాణ‌కు ఆంధ్రా స‌ర్కారు ప్ర‌క‌ట‌న‌లు ఇవ్వ‌దు క‌దా.. మ‌రి మ‌నం ఈనాడుకు ఎందుకు ప్ర‌క‌ట‌న‌లు ఇచ్చి వారిని ఆర్థికంగా ఎదిగేలా చేస్తున్నాం.. ఆత్మ విమ‌ర్శ చేసుకోవాలి... ఆంధ్రాలో మ‌న మీడియా అస్తిత్వాన్ని లేకుండా చేసిన వారికి, వారికి అండ‌గా ఉన్న రామోజీ, రాధాకృష్ణ ల‌కు గుణ‌పాఠం చెప్పాల్సిందే.. జై తెలంగాణ జై జై తెలంగాణ‌

No comments:

Post a Comment