1

1

Friday 30 January 2015

ఫాస్టు ప‌థ‌కం ర‌ద్దు...!

ఫాస్టు ప‌థ‌కం ఇక ఉండ‌దు... అంటే 1956కు ముందు తెలంగాణ‌లో స్థిర‌ప‌డిన వారి పిల్ల‌ల‌కు బోధ‌న రుసుములు చెల్లిస్తామ‌న్న ప్ర‌భుత్వ నిర్ణ‌యాన్ని మార్చుకున్నారు.. మొత్తానికి ఉమ్మ‌డి హైకోర్టు ఆదేశాల నేప‌థ్యంలో ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది.. ఇక్క‌డ తెలంగాణ‌కు ప్ర‌త్యేక హైకోర్టు ఏర్ప‌డి ఉంటే ప‌రిస్థితి ఎలా ఉండేదో...
అయితే జ‌న్మ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల విష‌యంలోనూ, స్థానిక‌త విష‌యంలోనూ ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హరించాలి.. మ‌ళ్లా దొంగ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాల‌ను తీసుకొని లోక‌ల్ గా చెలామ‌ణీ అయితే క‌ష్టం... అయితే వేరువేరుగా ఎంసెట్‌లు ఉండ‌టం కూడా ఒక‌విధంగా మంచిదైంది.. ఉమ్మ‌డి ఎంసెట్ ఉండి ఉంటే మ‌ళ్లా ఇక్క‌డ చేరి ఇక్క‌డ బోధ‌న ఫీజుల భారాన్ని ప్ర‌భుత్వం నెత్తిన వేసే అవ‌కాశం ఉంది.. బోధ‌న రుసుంల కోస‌మే వేచిచూస్తున్న కాలేజీల‌పై స‌ర్కారు దృష్టి కేంద్రీక‌రించాలి..

No comments:

Post a Comment