1

1

Tuesday 20 January 2015

ఢిల్లీ ప‌రిణామం స్వాగ‌తించాల్సిందే..

స‌చ్ఛీలుర మ‌ధ్య స‌మ‌రాలు శుభ‌ప‌రిణామం...
బేడీ,, కేజ్రీవాల్‌లో ఎవ‌రు సీఎం అయినా మంచిదే...
--------------------------------------
ఒక‌ప్పుడు స‌చ్ఛిలురైన రాజ‌కీయ నాయ‌కులు ఎంద‌రున్నా అందులో అత్యంత సచ్ఛీలురుల‌ను ఎంపిక చేసి అవ‌కాశం ఇచ్చే వారు.. రానురాను ప‌రిస్థితులు మారిపోయి ఎవ‌రిపై ఎక్కువ కేసులున్నాయో వారికే సీట్లు ఇచ్చి అంద‌లం ఎక్కే రోజులొచ్చాయి... పోటీ చేసే అభ్య‌ర్థుల‌పై కేసులు లేకుంటే ఆశ్చ‌ర్య‌పోయే రోజులివి.. నిజాయ‌తీగా ఉంటే గెలుస్తామో లేదో అన్న భ‌యాందోళ‌న‌.. అవినీతి ఆరోప‌ణ‌లు స‌ర్వ‌సాధార‌ణం... కానీ ఢిల్లీ ఎన్నిక‌ల్లో మాత్రం స‌చ్ఛీలురుల‌ మ‌ధ్య పోటీ న‌డుస్తోంది.. ముఖ్యంగా కేజ్రీవాల్‌ను ఢీకొట్ట‌డానికి అంతే నిజాయ‌తీ, స‌చ్ఛీల‌త క‌లిగిన వారిని ఏరికోరి బీజేపీ ఎంపిక చేస్తోంది.. నువ్వు మంచోడిని పోటీలో దించితే.. నేను అంత‌క‌న్నా ఎక్కువ మంచోడికి సీటు ఇచ్చి గెలిపించుకుంటా అన్న రీతిలో వ్య‌వ‌హ‌రిస్తుండ‌టం ఆహ్వానించ‌ద‌గిన విష‌య‌మే.. ఏది ఏమైనా ఢిల్లీ ఎన్నిక‌ల అనంత‌రం కిర‌ణ్ బేడీ, కేజ్రీవాల్ ఇద్ద‌రిలో ఎవ‌రు సీఎం అయినా అది శుభ‌ప‌రిణామ‌మే అనుకోవాలి... ఉద్యోగాల్లో నిజాయ‌తీగా ప‌నిచేస్తే డ‌బ్బు సంపాదించ‌క‌పోయినా జ‌నాభిమానం క‌ల‌కాలం ఉంటుంద‌న‌డానికి ఇవి నిద‌ర్శ‌నంగా నిలిచే అవ‌కాశం ఉంది..

No comments:

Post a Comment