1

1

Thursday 29 January 2015

అడ‌విలో ఉన్న ఆసుప‌త్రి అడ‌వికే వెళ్తోంది..

ఎర్ర‌గ‌డ్డ‌లోని ఛాతీ ఆసుప‌త్రి అడ‌విలోకి వెళ్లిపోతోంద‌ని ఓ ప‌త్రిక తెగ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది..
వాస్త‌వానికి నిజాం కాలంలో ఆసుప‌త్రిని అడ‌విలోనే ఏర్పాటు చేశారు.. ఒక‌ప్పుడు ఆ ప్రాంతం అడ‌విని త‌ల‌పించేదే క‌దా..!!
పంజ‌గుట్ట‌లో పులులు తిరిగేవి... కాల‌క్ర‌మంలో హైద‌రాబాద్ విస్త‌రించింది.. ఎర్ర‌గ‌డ్డ అన్న‌ది న‌గ‌రంలో ప్ర‌ధాన ర‌ద్దీ ప్రాంతంగా మారింది..
ఈ ప‌త్రిక వాళ్లు నిజాం కాలంలోనూ ఉంటే అడ‌విలో ఆసుప‌త్రి ఏంటని గ‌గ్గోలు పెట్టేవారేమో.. ఇంకా ఆ కాలంలో అయితే ప్ర‌జా ర‌వాణా వ్య‌వ‌స్థే లేదు..!!
NOTE: ఛాతీ ఆసుప‌త్రిని మ‌రో ప్రాంతానికి త‌ర‌లించ‌డం ప్ర‌భుత్వ ఇష్టం.. అయితే చ‌రిత్రాత్మ‌క క‌ట్ట‌డాల‌ను ప‌రిర‌క్షించాల‌న్న‌ది నా అభిమ‌తం...

No comments:

Post a Comment