1

1

Friday 9 January 2015

ఎవ‌రి ప‌రీక్ష‌లు వారే నిర్వ‌హించుకుంటే ఈ ఉమ్మ‌డి తిప్ప‌లు త‌ప్పుతాయి..

ఎవ‌రి ప‌రీక్ష‌లు వారే నిర్వ‌హించుకుంటే ఈ ఉమ్మ‌డి తిప్ప‌లు త‌ప్పుతాయి..
--------------
తెలంగాణలో ఇంజినీరింగ్ చేయాల‌నుకునే వాళ్లు ఇక్క‌డ ఎంసెట్ రాస్తారు... లేదు ఆంధ్రాలోనే చేస్తాం అనుకునే వారు అక్క‌డ ఎంసెట్ రాస్తారు... లేక‌పోతే త‌మిళ‌నాడు, కర్ణాట‌క కాలేజీలే బెట‌ర్ అనుకుంటే అక్క‌డి సెట్‌లు రాయ‌డ‌మో... లేక యాజ‌మాన్య కోటాలో చేర‌డ‌మో చేస్తారు.. 
--------------------
ఒక‌వేళ‌ ఇప్పుడు ఉమ్మ‌డి ఎంసెట్ ప‌రీక్ష జ‌రిగితే... మ‌ళ్లా కౌన్సిలింగ్‌లో ఏదో ఒక ప్రాంతానికి అన్యాయం జ‌రిగింద‌ని లొల్లి వ‌స్తుంది... ఆంధ్రా అబ్బాయిల‌కు తెలంగాణ‌లో బోధ‌న రుసుంలు చెల్లించ‌రు.. తెలంగాణ విద్యార్థుల‌కు ఆంధ్రాలో బోధ‌న ఫీజులు క‌ట్ట‌రు.. దీనిపై రోజుకో ధ‌ర్నా, ఆందోళ‌న‌.. ప్ర‌ధానికి ఫిర్యాదులు... హైకోర్టులో కేసులు... ఇవ‌న్నీ అవ‌స‌ర‌మా? ఏ ప్రాంతం వారికి ఆ ప్రాంతం బోర్డులే ఎంసెట్ నిర్వ‌హిస్తేనే మేలు... ఈ ర్యాంకుల గోల కూడా కొంత త‌గ్గుతుంది.. !!
----------------
ఎటొచ్చి కొంచెం నారాయ‌ణ‌, చైత‌న్య కాలేజీల‌కు ఇబ్బంది ఉండొచ్చు కానీ రెండు ప్రాంతాల విద్యార్థుల‌కు మంచే జ‌రుగుతుంది...!

No comments:

Post a Comment