1

1

Thursday 29 January 2015

కృష్ణా నీటిలో మ‌న వాటాను మ‌నం సాధించుకోవాలి..

కృష్ణా నీటిలో మ‌న వాటాను మ‌నం సాధించుకోవాలి.. లేక‌పోతే మ‌నం కోరుకున్న తెలంగాణ స‌స్య‌శ్యామ‌లం కావ‌డం చాలా క‌ష్టం. ఇన్నేళ్లు జ‌ల దోపిడీ జ‌రిగినా ఏమీ చేయ‌లేక‌పోయాం.. ఇప్పుడు కొంత‌వ‌ర‌కు అడ్డుకోగ‌లిగాం. అయితే కృష్ణా నీటిలో మ‌న వాటా 27 శాత‌మే అని ఏపీ వాదిస్తోంది. అంటే 73 శాతం నీటిని త‌ర‌లించుకుపోవాల‌న్న‌దే ల‌క్ష్యంగా కుట్ర‌లు చేస్తోంది.. దానికి ఓ ప్ర‌ధాన ప‌చ్చ ప‌త్రిక అండ‌దండ‌లు ఉన్నాయి.. ఈ విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం ఇంకా దూకుడుగా ఉండాల్సిందే. కేంద్రానికి వాస్త‌వాల‌ను వివ‌రించాలి. కేంద్ర మంత్రి ఉమాభార‌తి, ఆమె వ‌ద్ద ప‌నిచేస్తున్న వెదిరె శ్రీ‌రాం గారి స‌హ‌కారంతో కృష్ణా నీటిలో మ‌న‌కు న్యాయంగా రావాల్సిన వాటాను సంపాదించుకోవాలి. పాల‌మూరు, న‌ల్ల‌గొండ త‌దిత‌ర జిల్లాల‌ను స‌స్య‌శ్యామ‌లంగా మార్చుకోవాలి.
నోట్‌: తెలంగాణ‌, ఆంధ్ర రాష్ట్రాల మ‌ధ్య జ‌ల వివాదాలు వ‌స్తే మ‌న ప‌త్రిక‌లు ఎటు వైపు ఉంటాయి... ముమ్మాటికీ మ‌నవైపే ఉంటాయి... కానీ ఓ ప‌చ్చ ప‌త్రిక మాత్రం ఆంధ్రాకు ల‌బ్ధి చేకూర్చ‌డానికి గ‌త కొద్ది నెల‌లుగా అదే ప‌నిగా మొద‌టి పేజీలో కృష్ణా నీళ్ల‌పై జ‌గ‌డం అంటూ రాస్తుంది.. ఈ విష‌యంపై ఏమ‌రుపాటుగా, అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిందే..

No comments:

Post a Comment