1

1

Friday 9 January 2015

ప్ర‌తీ ఒక్క‌రూ ఆమెను ఆద‌ర్శంగా తీసుకోవాలి... !!

త‌ను ప‌ద్మ‌భూష‌ణ్‌కు అర్హురాలినైన‌ప్ప‌టికీ త‌న పేరును ప్ర‌తిపాదించ‌క‌పోవ‌డాన్ని సైనా నెహ్వాల్ ప్ర‌స్తావించ‌డంతో క్రీడా మంత్రిత్వ శాఖ స్పందించింది. మొత్తానికి సైనా పేరును కూడా సిఫార్సు చేసింది... గ‌తంలోనూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం త‌న‌కు రూ.50 ల‌క్ష‌ల న‌జ‌రానా ప్ర‌క‌టించి ఇవ్వ‌ని విష‌యాన్ని కూడా నిర్మోహ‌మాటంగా ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించి తెలంగాణ ప్ర‌భుత్వం నుంచి ఆ న‌జ‌రానా అందుకుంది... ఇక్క‌డ సైనా నోరు మెద‌ప‌క‌పోతే ఆమె పేరును విస్మ‌రించే వాళ్లు.. గ‌తంలోనూ గొంతు విప్ప‌క‌పోతే రూ.50 ల‌క్ష‌ల న‌జ‌రానా రాక‌పోయేది... నిజంగా అర్హ‌త ఉన్న వాళ్ల‌కు గొంతు లేక‌పోతే అవార్డులకు నామినేట్ కావ‌డ‌మూ కష్ట‌మే అన్న‌ది అర్థం అవుతోంది.. ప్ర‌శ్నించి సైనా మంచి ప‌ని చేసింది... ప్ర‌తీ ఒక్క‌రూ ఆమెను ఆద‌ర్శంగా తీసుకోవాలి... !!

No comments:

Post a Comment