1

1

Monday 20 October 2014

కాంగ్రెస్ ముక్త్ భార‌త్‌లో బీజేపీకి స‌హ‌క‌రిస్తున్న ఎంఐఎం...!!

ఈ వ్యాఖ్య చాలా మందికి కోపం తెప్పించొచ్చు.. కానీ ఒక‌టి మాత్రం నిజం... ఎంఐఎం ఎక్క‌డ పోటీ చేస్తుందో అక్క‌డ కాంగ్రెస్‌కు న‌ష్టం త‌ప్ప లాభం లేద‌న్న‌ది సుస్ప‌ష్టం... మైనారిటీల్లో చాలామంది కాంగ్రెస్ వైపున‌కు మొగ్గుచూపుతారు.. అయితే ఎంఐఎం స్వ‌యంగా పోటీ చేస్తే ఆ ఓట్లు ఆ పార్టీ వైపున‌కు మ‌ళ్లుతున్నాయి.. ఈ ఫ‌లితాల‌ను ఇటీవ‌ల మ‌నం తెలంగాణ‌లోనూ చూశాం... నిజామాబాద్ అర్బ‌న్‌, జూబ్లీహిల్స్‌, సికింద్రాబాద్ తదిత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకును కొల్ల‌గొట్ట‌డంలో ఎంఐఎం స‌ఫ‌లీకృత‌మైంది.... ఫ‌లితంగా కాంగ్రెస్‌కు కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఘోర ప‌రాభ‌వం త‌ప్ప‌డం లేదు...
అలాగ‌ని ఎంఐఎం-బీజేపీ మ‌ధ్య ఒప్పందం ఉంద‌ని నా ఉద్దేశం కాదు.. కానీ ఎంఐఎం ఎంత పుంజుకుంటే కాంగ్రెస్‌కు అంత‌క‌న్నా ఎక్కువ న‌ష్టం.. బీజేపీ నినాదాన్ని చేరుకోవ‌డం అంతే సులువు...
---------------------------------
ఏది ఏమైనా ముంబ‌యిలో పాగా వేసిన ఎంఐఎంకు అభినంద‌న‌లు... మీరు కేవ‌లం మ‌తం ఆధారంగా రాజ‌కీయాలు చేస్తే సుదీర్ఘ‌కాలం ఉండ‌లేరు.. ద‌ళిత‌, మైనారిటీ, బీసీల‌తోపాటు అగ్ర‌వ‌ర్ణాల‌ను క‌లుపుకుపోండి... ఊహించ‌ని రీతిలో ఫ‌లితాలు ఉంటాయి.. మ‌త రాజ‌కీయాలు, మందిరాల‌పై రాజ‌కీయాలకు కాలం చెల్లింది... ఈ విజ్ఞ‌ప్తిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోండి...

No comments:

Post a Comment