1

1

Monday 3 November 2014

ఏమిరా బాల‌రాజు... ఏమిటీ దౌర్బాగ్యం!

మ‌న తిండి తిని ఈనాడు ఆంధ్ర పాట‌ను గొంతెత్తి పాడుతుంది. శ్రీ‌శైలం విద్యుత్ ఉత్ప‌త్తికి సంబంధించి కృష్ణా రివ‌ర్ బోర్డు ఆదేశాల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం బేఖాత‌రు చేసి 5.3 టీఎంసీల నీళ్లు వాడుకుంద‌ని ఈనాడు ఈరోజు గ‌గ్గోలు పెట్టింది. ఇది తెలంగాణ‌కు వ్య‌తిరేక వార్త కాబట్టి మొద‌టి పేజీలో కాస్త కింద పెట్టింది. ఆంధ్ర‌కు అనుకూలం కావ‌డంతో ఏపీ ఎడిష‌న్‌లో బ్యాన‌ర్ క‌ట్టింది. అంటే 5.3 టీఎంసీల నీళ్లు వాడుకోవ‌డం వ‌ల్ల ఆంధ్ర అన్యాయం జ‌రిగింద‌నేది ఈనాడు పెద్ద‌ల బాధ‌. స‌రే బాగానే ఉంద‌నుకుందాం. ఈ వార్త‌ను ఏపీ ఎడిష‌న్‌లో వేస్తే ఒకే.
మ‌రి........... ఇదే వార్త‌లో తెలంగాణ స‌ర్కారు కృష్ణా రివ‌ర్ బోర్డుకు ఫిర్యాదు చేసినా ఏపీ ప్ర‌భుత్వం నిస్సిగ్గుగా ఎలాంటి కేటాయింపులు లేని హంద్రీనీవాకు 1350 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడుకు మ‌రో 800 క్యూసెక్కుల వ‌ర‌కు నీళ్లు తీసుకుపోతున్న‌ట్లు రాశారు. (ఇది పైకి మాత్ర‌మే... కానీ నిజంగా ఎంత త‌ర‌లించుకుపోతున్నారో చంద్ర‌బాబు, రామోజీల‌కే తెలుసు) అలాంట‌ప్పుడు క‌నీసం తెలంగాణ ఎడిష‌న్‌లో !!! తెలంగాణ ప్ర‌భుత్వం ఫిర్యాదు చేసినా హంద్రీనీవాకు ఏపీ స‌ర్కారు జ‌ల దోపిడీతో నీళ్లు త‌ర‌లించుకుపోతుంద‌ని హెడ్డింగులో రాయొచ్చు క‌దా. అక్క‌డి ప్ర‌జ‌ల‌కు అది న్యాయ‌మైన‌పుడు, ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు ఇది న్యాయం క‌దా. తెలంగాణ వాళ్లు జేబులో నుంచి డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టుకొని, స‌మ‌యాన్ని కేటాయించి, వాళ్ల‌కు వ్య‌తిరేక‌మైన వార్త‌లు చ‌ద‌వాల్నా?
పైగా ఈ వార్త‌లో తెలంగాణ స‌ర్కారేమో కృష్ణా రివ‌ర్ బోర్డు ఆదేశాలు బేఖాత‌రు అనే ప‌దాల‌ను వాడారు. కానీ హంద్రీనీవాకు మాత్రం ఏపీ ప్ర‌భుత్వం నీటిని తీసుకెళ్లింది... అనే సాఫ్ట్ ప‌దాల‌ను వాడారు. ఇదేం దిక్కుమాలిన జ‌ర్న‌లిజం? మ‌రోవైపు మూడు ద‌శాబ్దాల లెక్క‌లివీ... అంటూ ఈనాడు యాజ‌మాన్యం త‌న ఆవేద‌న‌ను వెల్ల‌గ‌క్కింది. అయినా అవి ఉమ్మ‌డి రాష్ట్రంలోని లెక్క‌లు. అప్పుడు అన్ని ప్రాంతాలు క‌లిసున్నందున సీమాంధ్ర నుంచి వ‌చ్చే క‌రెంటు ఉన్నందున శ్రీ‌శైలం ఎడ‌మ గ‌ట్టు వద్ద విద్యుత్ ఉత్ప‌త్తి చేయ‌కోవ‌డ‌మో్, త‌క్కువ చేయ‌డ‌మో ఉంట‌ది. మ‌రి ఇప్పుడు రెండు రాష్టాలు, దిక్కుమ‌లిన ఏపీ ప్ర‌భుత్వం ఇచ్చిన క‌రెంటు కొర‌త వార‌స‌త్వం, చంద్ర‌బాబు ఫ్యూజులు పీకేసీ న్యాయంగా రావాల్సిన క‌రెంటును అడ్డుకుంటున్న స‌మ‌యం... ఇప్పుడు కూడా గ‌తంలో లెక్క శ్రీ‌శైలం ఎడ‌మ గ‌ట్టు ద‌గ్గ‌ర విద్యుత్తు ఉత్ప‌త్తి చేయాలంటె ఎట్ల కుదుర్త‌ది?. ఇదంతా ఈనాడుకు తెల్వ‌దా.... బ‌ట్టెబాజి త‌నం. తామేం రాసినా చెల్లుతుంద‌నే దిక్కుమాలిన అమాయ‌క‌త్వం. ఛీ ఛీ... ఇదేం జ‌ర్న‌లిజం?

No comments:

Post a Comment