1

1

Thursday 27 November 2014

ఈ దేశంలో మాన‌వ హ‌క్కుల సంఘం ఇంకా ఉందండోయ్‌..!


ఈ దేశంలో మాన‌వ హ‌క్కుల సంఘం ఇంకా ఉందండోయ్‌..!
తెలంగాణ‌లో రైతుల ఆత్మ‌హ‌త్య‌ల‌పై స్పందించింది... 69 మంది రైతులు చ‌నిపోయారా? అని ఆవేద‌న వ్య‌క్తం చేసింది..
మ‌రి తెలంగాణ కోసం వంద‌ల మంది యువ‌త చ‌నిపోయిన‌ప్పుడు ఈ సంఘం ఎలా స్పందించింది?
కేంద్రానికి, రాష్ట్రానికి నోటీసులు ఇచ్చిందా?
ఏది ఏమైనా మానవ హ‌క్కుల సంఘం దేశంలోని రైతుల ఆత్మ‌హ‌త్య‌ల‌పైనా స్పందించి ఉంటే ఇంకా బాగుంటుంది..
రైతుల కోసం జాతీయ విధానాన్ని తీసుకొచ్చేలా అన్ని ప్ర‌భుత్వాల‌ను సూచ‌న‌లు చేస్తే ఎంతో సంతోషిస్తాను..
గిట్టుబాటు ధ‌ర‌ను రైతులే నిర్ణ‌యించుకునేలా ప్ర‌భుత్వాల‌కు సూచ‌న‌లు ఇవ్వాలి...
ఇవ‌న్నింటినీ మానవ హ‌క్కుల సంఘం చేస్తుందా?
నోట్‌:: మ‌హారాష్ట్ర‌లో 200 మంది రైతులు ఆత్మ‌హ‌త్య చేసుకున్నార‌ట‌... ఈ విష‌యాన్ని కేంద్ర‌మే ప్ర‌క‌టించింది.. మ‌రి ఆ రాష్ట్రానికి కూడా నోటీసులు జారీ చేయాలి.. దేశంలో ఏ ఒక్క రైతు ఆత్మ‌హ‌త్య జ‌ర‌గ‌కుండా అంద‌రు రైతుల హ‌క్కుల‌ను కాపాడేలా హ‌క్కుల సంఘం కృషి చేయాలి..!!

No comments:

Post a Comment