1

1

Saturday 8 November 2014

రాజ‌కీయాలు నేర్పే యూనివ‌ర్సిటీ కావాలి...

జైరాం ర‌మేశ్‌, మ‌నోహ‌ర్ పారిక‌ర్ ఇద్ద‌రూ ఐఐటీయ‌న్లేన‌ట‌.. అర‌వింద్ కేజ్రీవాల్ కూడా ఐఐటియ‌నే.... అంద‌రూ క‌ళంక‌ర‌హితులే...

అయితే వీళ్లు చ‌దివిన చ‌దువులేంది.. చేస్తున్న ప‌నులేంది.... వీరి విజ్ఞానంతో ప‌రిశ్ర‌మ‌లు స్థాపించొచ్చు క‌దా.. నూత‌న ఆవిష్క‌ర‌ణ‌లు చేయొచ్చు క‌దా...

కొంప‌దీసి బొమ్మ‌రిల్లు సినిమా త‌ర‌హాలో త‌ల్లిదండ్రుల కోసం ఉన్న‌త చ‌దువులు చ‌దివి చిర‌కు వారి మ‌న‌సుకు న‌చ్చిన రంగాల్లోకి వ‌చ్చారా?

ఇలా ఐఐటియ‌న్లంతా రాజ‌కీయాల్లోకి వ‌స్తే  దేశంలో నూత‌న ఆవిష్క‌ర‌ణ‌లు చేసే వాళ్లు క‌ర‌వ‌వుతారు క‌దా...!!

అందుకే రాజ‌కీయాల్లో చేరే వారి కోసం ప్ర‌త్యేక యూనివ‌ర్సిటీ ఉండాలి.. అందులో రాజ‌కీయాల‌కు ప‌నికి వ‌చ్చే చ‌దువే ఉండాలి... ఇంకే కోర్సూ ఉండొద్దు...

వారికి దేశంలోని నాయ‌కులంతా క్లాస్‌లు తీసుకోవాలి... ఉత్తమ పార్ల‌మెంటేరియ‌న్ల జీవిత పాఠాల‌ను బోధించాలి....!!

ప్ర‌తీ రాష్ట్రంలోనూ అలాంటి యూనివ‌ర్సిటీలు ఉండాలి.. పార్టీల‌న్నీ కూడా ఆ యూనివ‌ర్సిటీల నుంచే నాయకుల రిక్రూట్‌మెంట్ చేప‌ట్టాలి...111

No comments:

Post a Comment