1

1

Saturday 29 November 2014

చ‌రిత్ర‌లో మంచీ చెడూ రెండూ ఉంటాయి..

కాక‌తీయులు గొప్ప‌వాళ్లు.. కాక‌తీయులు చెరువులు త‌వ్వించారు అని చెబుతారు..
మ‌రి కాక‌తీయ పాల‌కుడు ప్ర‌తాప‌రుద్రుడు స‌మ్మ‌క్క‌, సార‌ల‌మ్మ‌, జంప‌న్న‌ల‌ను చంపేసింది వాస్త‌వం కాదా?
క‌ర‌వు కోర‌ల్లో ఉన్నాం.. ఈసారికి ప‌న్ను మిన‌హాయింపు ఇవ్వ‌మ‌న్నా అంగీక‌రించ‌నిది వాస్త‌వం కాదా?
గిరిజ‌నుల‌పైకి సైన్యాన్ని పంపి వారిని హ‌త‌మార్చింది చ‌రిత్ర కాదా?
మ‌ళ్లా అదే ప్ర‌తాప‌రుద్రుడు ఢిల్లీ సుల్తాన్‌ల‌తో వీరోచితంగా పోరాడిన గాథ‌ల‌ను మ‌నం చెప్పుకుంట‌లేమా?
చ‌రిత్ర‌లో మంచీ చెడు రెండూ ఉంటాయి.. ఒక త‌ప్పు జ‌రిగింద‌ని చ‌రిత్ర‌లో అత‌డికి స్థాన‌మే ఉండ‌వ‌ద్దంటే ఈ భార‌త దేశ చ‌రిత్ర‌లో అన్నీ ఖాళీ పేజీలే క‌నిపిస్తాయి...!!!

No comments:

Post a Comment