1

1

Monday 16 March 2015

ఒక్క మోడీ త‌ప్ప‌.. అంద‌రూ వ‌స్తారేమో..!!

తెలంగాన‌లో జ‌రుగుతున్న రెండు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ప్ర‌చారానికి కేంద్ర మంత్రులు  ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్‌, నిర్మ‌లా సీతారామ‌న్‌, వెంక‌య్య‌నాయుడు, సదానంద గౌడ‌లు వ‌చ్చారు.. ఇంకెంత మంది వ‌స్తారో తెలియ‌దు... ఇన్ని రోజులు విశాఖ విద్యుత్‌లో తెలంగాణ‌కు వాటా ఉందా అంటే నోరు మెద‌ప‌ని వారు ఇప్పుడు తెలంగాణ‌కు వాటా ఉందంటున్నారు.. విద్యుత్ క‌ష్టాలు తీరుస్తామంటున్నారు... హైకోర్టును రెండు నెల‌ల్లో ఏర్పాటు చేస్తామంటున్నారు... దామ‌ర‌చ‌ర్ల విద్యుత్ ప్రాజెక్టుకు రెండు రోజుల్లో ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తులు ఇస్తామంటున్నారు... నిజంగా ఒక్క హైద‌రాబాద్ ఎమ్మెల్సీ సీటు కోసం బీజేపీ వాళ్లు ఇన్ని హామీలు ఇస్తున్నారు... మ‌రి ఇన్ని రోజులు ఈ హామీలు ఎందుకు ఇవ్వ‌లేదు...?
వీళ్ల‌ను క‌ల‌వ‌డానికి కేసీఆరే ఢిల్లీ వెళ్లే ప‌రిస్థితి ఉండేది.. ఎమ్మెల్సీ ఎన్నిక పుణ్య‌మా అని వచ్చి మ‌రీ హామీలు ఇస్తున్నారు..!!
వీళ్ల‌ను న‌మ్మొచ్చా?

No comments:

Post a Comment