1

1

Wednesday 25 March 2015

తప్పు చేసిన కాలేజీల త‌ర‌ఫున‌ వ‌కాల్తా పుచ్చుకోవ‌డం ఎందుకు?

వ‌స‌తుల కొర‌త సాకుతో 163 ఇంజినీరింగ్ కాలేజీల‌ను మూసివేయ‌డం త‌గ‌ద‌ని బీజేపీ ఎమ్మెల్యే చింత‌ల రాంచంద‌ర్‌రెడ్డి అన్నారు.. ఆ కాలేజీల‌కు  ఒక్క అవ‌కాశం ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు.. లేక‌పోతే వాటిపై ఆధార‌ప‌డ్డ 2 ల‌క్ష‌ల మంది నిరుద్యోగులుగా మారుతార‌ట‌...
మ‌రి ఆ కాలేజీల‌ను కొన‌సాగిస్తే ఏటా దాదాపు 4 ల‌క్ష‌ల మంది నిరుద్యోగులు త‌యారు కారా?;
*************

అయినా తప్పు చేసిన కాలేజీల త‌ర‌ఫున‌ వ‌కాల్తా పుచ్చుకోవ‌డం ఎందుకు?
ఇన్నేళ్లు ప్ర‌భుత్వం అందించిన బోధ‌న రుసుంల‌ను అప్ప‌నంగా తిన్న ఆ కాలేజీల నుంచి సొమ్ము వ‌సూలు చేయ‌మ‌ని డిమాండ్ చేయొచ్చు క‌దా..
ల‌క్ష‌ల మంది విద్యార్థుల‌ను నిరుద్యోగులుగా మార్చిన కాలేజీలు న‌ష్ట‌ప‌రిహారం ఇవ్వాల‌ని కోరాలి క‌దా...
అలా చేయ‌డం లేదు ఎందుకు?

No comments:

Post a Comment