1

1

Sunday 15 March 2015

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల వ‌ర‌కు ఈ హామీ ఉంటుందా?



ఎమ్మెల్సీ ఎన్నిక‌ల వ‌ర‌కు ఈ హామీ ఉంటుందా?
ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత ప‌త్తాలేకుండా పోతారేమో?
హైకోర్టు కోసం స్థ‌లం చూపించాల‌ని స‌దానంద గౌడ గారు తెలంగాణ సీఎంను కోరారు.. ఓ లేఖ ఇవ్వాల‌ని అంటున్నారు..
అప్ప‌ట్లో కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్‌ను క‌ల‌వ‌డం, అప్ప‌ట్లో న్యాయ శాఖ మంత్రిగా ఉన్న వేరే అత‌డిని(బ‌హుషా ర‌విశంక‌ర్ ప్ర‌సాద్ అయి ఉండొచ్చు) క‌ల‌వ‌డం జ‌రిగింది..
ఆ త‌ర్వాత కింగ్‌కోఠి లోని నిజాం ప్యాలెస్‌ను ప‌రిశీలించ‌డం జ‌రిగింది.. అంటే న్యాయ మంత్రి మారిన ప్ర‌తీసారి ఢిల్లీకి వెళ్లి కొత్త విజ్ఞ‌ప్తులు ఇవ్వాలేం.. స‌దానంద గౌడ గారి భాష చూస్తే అలాగే అనిపిస్తోంది...
హైకోర్టు కోసం ఉద్య‌మిస్తున్న న్యాయ‌వాదులు కేంద్రంపై ఆగ్ర‌హంగా ఉండ‌టంతో వారిని శాంతింప‌జేయ‌డానికి బీజేపీ వాళ్లు ఈ మాట‌లు మాట్లాడించిన‌ట్లు తెలుస్తోంది..
లేక‌పోతే ర‌విశంక‌ర్ ప్ర‌సాద్‌ను క‌లిసి ఆరు నెల‌లు గ‌డిచింది క‌దా.. ఇప్ప‌టికీ హైకోర్టు విష‌యంలో చిన్న ముంద‌డుగు కూడా ప‌డ‌లేదు ఎందుకో?

No comments:

Post a Comment