1

1

Wednesday 25 June 2014

ఓహో మేధావి... ఎక్క‌డ దాక్కున్నావ్‌?!.

జ‌య‌ప్ర‌కాశ్‌నారాయ‌ణ‌... మ‌న రాష్ట్రంలో ఈయ‌న ఒక్క‌డే మేధావి అని సోకాల్డ్ ప‌త్రిక‌లు ఘోషించాయి... ఇక ముందు కూడా ఘోషిస్తాయి. మ‌రి జ‌నం కోసం స‌ర్కారు స‌ర్వీసును వ‌దిలిన ఈ అప‌ర మేధావి ఎక్క‌డ ఉన్నాడు?. మోడీని బ‌ల‌ప‌రిచిన ఈయ‌న ఇప్పుడు అదే మోడీ సామాన్య జ‌నంపై న‌డ్డివిరిచేలా రైల్వే ఛార్జీల‌తో భారం మోపాడు. సామాన్య జ‌నంపై భారం మోపాడు. కానీ స‌ద‌రు జేపీ గంట‌లు గ‌డిచినా ఇప్ప‌టికీ నోరు మెద‌ప‌లేదు. కానీ ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర్ కొన్ని గంట‌లు పలు చానెళ్ల‌లో గొంతు పోయేలా ఈ నిర్ణ‌యాన్ని ఖండిస్తున్నారు. చూశారా... మేధావులు అంటే జ‌నం బాగు కోరాలి. కానీ ఈ ఇద్ద‌రి మేధావుల మ‌ధ్య ఎంత తేడా?.. పోనీ మొన్న ఓడిపోయిందుకు నైరాశ్యంలో జేపీ బ‌య‌టికి రాలేద‌నుకుందాం. మ‌రి నాగేశ్వ‌ర్ కూడా అదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపో్యారు క‌దా. సూత్రం ప్ర‌కారం ఈయ‌న కూడా నైరాశ్యంలోకి పోవాలి. అందుకే ఎవ‌రు జ‌న‌ప‌క్షం, ఎవ‌రు పెట్టుబ‌డిదారుల కాప‌లాకుక్క‌నో జ‌నానికి అర్థం అయింది. కాక‌పోతే సోకాల్డ్ మీడియా సిగ్గు తెచ్చుకొని జేపీకి బాజా ఊద‌డం మానేయాలి. ఆయ‌నో అప‌ర మేధావి, ఆయ‌న వ‌స్తే జ‌నానికి స్వ‌ర్గం చూపుతార‌ని పేజీల‌కు పేజీలు ప్ర‌చారం క‌ల్పించిన ఈనాడు ఇప్పుడు త‌న త‌ల‌కాయ ఎక్క‌డ పెట్టుకుంటుంది?. రేపోమాపో నిస్సిగ్గుగా జేపీ నామ‌మాత్రంగా ఒక ప్రెస్‌మీట్ పెట్టి ఎవ‌రికీ అర్థంకాని రీతిలో ఒక‌విధంగా ఆయ‌న‌కూ స్ప‌ష్టంలేని రీతిలో ప్ర‌క‌ట‌న చేస్తాడు. ఇలా చేస్తే అంద‌రూ ఖండించాలి. జేపీ వెంట‌నే లోక్‌స‌త్తా త‌ర‌పున రైల్వే ఛార్జీల‌కు వ్య‌తిరేకంగా కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టించాలి. ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేసిన విధంగా ఈనాడు కూడా ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మాల‌ను పేజీల‌కు పేజీలు వేయాలి. లేక‌పోతే బ‌ట్టెబాజ్ గాండ్ల‌ను రాళ్ల‌తో కొట్టాలి.

ప్ర‌త్యేకంగా దీనిపై టీడీపీ నాయ‌కుడు, ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడు అసెంబ్లీ వేదిక‌గా త‌న వైఖ‌రి ప్ర‌క‌టించాలి. మోడీని ఆకాశానికి ఎత్తిన ఆయ‌న ఈ ఛార్జీల పెంపును వ్య‌తిరేకిస్తున్నారా?. లేదా?. అని స్ప‌ష్టం చేయాలి. లేక‌పోతే న‌క్క‌జిత్తులోడు మ‌ళ్లోసారి సీఎం అయ్యిండ‌ని జ‌నం రోధించ‌క త‌ప్ప‌దు.

No comments:

Post a Comment