1

1

Thursday 26 June 2014

చూడండి ఎంత‌టి అహంకారం?!


అటెండ‌ర్‌గానీ... ఆ మాట‌కొస్తే ఐఏఎస్‌గానీ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేస్తే తూ.చ‌. త‌ప్ప‌కుండా అమ‌లు చేయాలి. 60 ఏళ్ల పాటు పాపం... మ‌న అధికారులు మ‌న‌సొప్ప‌కున్నా స‌మైక్య స‌ర్కారు క‌ర్క‌శంగా తెలంగాణ‌కు వ్య‌తిరేకంగా ఆదేశాలు జారీ చేసినా అమ‌లు చేశారు. మ‌న వారినీ బాధ‌పెట్టారు. కానీ ఇప్పుడు తెలంగాణ వ‌చ్చింది. అయినా సీమాంధ్ర ఐఏఎస్‌ల‌కు మ‌న స‌ర్కారు ఇచ్చిన ఆదేశాలు అంటే చుల‌క‌న‌. స‌రిగ్గా ఆ అహంకారం మీద మ‌న ప్ర‌భుత్వం ఉక్కుపాదం మోపింది. తెలంగాణ స‌ర్కారింటే ఇలా ఉంటుంద‌ని దిమ్మ‌తిరిగే చ‌ర్య తీసుకుంది. కొన్నిరోజులుగా మాదాపూర్‌లోని గురుకుల్ ట్ర‌స్ట్ భూముల్లోని అక్ర‌మ నిర్మాణాలు కూల్చుతున్న సంగ‌తి మ‌నందరికి తెలిసిందే. దీనిపై ప్ర‌భుత్వం ముందుగా కొన్ని ఆదేశాలు జారీ చేసింది. అక్ర‌మ నిర్మాణాల‌కు క‌రెంటు, నీళ్ల స‌ర‌ఫ‌రా బంద్ చేయ‌మంది. క‌రెంటు ఆగింది... కానీ నీళ్లు ఆగ‌లేదు. ఆ నిర్మాణాల పూర్వాప‌రాలు వాట‌ర్ వ‌ర్క్స్ అధికారుల‌కు అన‌వ‌స‌రం. ప్ర‌భుత్వం చెప్పిన‌ట్లు నీటి స‌ర‌ఫ‌రా ఆప‌డం వారి విధి. కానీ వాట‌ర్ వ‌ర్క్్స ఎండీ శ్యామ‌ల‌రావు సీమాంధ్ర అహంకారం ప్ర‌ద‌ర్శించారు. స‌మైక్య ప్ర‌భుత్వం త‌ప్పులు చేయ‌మ‌న్నా క్ష‌ణాల్లో అమ‌లు చేసే వీళ్లు తెలంగాణ ప్ర‌భుత్వం నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా న‌డుచుకోమ‌న్నా... వారి ప్రాంత ప్ర‌జ‌ల కోసం బేఖాత‌రు చేస్తారు. క‌రెంటు ఆగినా నీటి స‌ర‌ఫ‌రా మాత్రం ఆగ‌లేదు. ఎలాగూ సీమాంధ్ర ఆప్ష‌న్ పెట్టుకున్న ఈ ఐఏఎస్ ప్ర‌భుత్వ ఆదేశాలు బేఖాత‌రు చేశారు. అందుకే మ‌న స‌ర్కారు స‌రైన గుణ‌పాఠం చెప్పింది. వెంట‌నే ఆ స్థానంలో మ‌న తెలంగాణ ఐఏఎస్‌కు అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గించింది. హ్యాట్సాఫ్ టు తెలంగాణ స‌ర్కార్‌. ప్ర‌స్తుతం ఐఏఎస్ అధికారుల మ‌ద్య హాట్‌టాపిక్‌గా మారింది ఈ అంశం.

No comments:

Post a Comment