1

1

Friday 24 April 2015

ఎంఐఎం... ముస్లిం-ద‌ళిత ఐక్య‌త సిద్ధాంతం

ఔరంగాబాద్ స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఎంఐఎం 25 స్థానాల‌తో రెండో అతిపెద్ద పార్టీగా అవ‌త‌రించింది...
ఇక్క‌డ మ‌రో విచిత్రం ఏంటంటే ఎంఐఎం రెబ‌ల్స్ మ‌రో 5 స్థానాల్లో గెలుపొందారు...
12 మంది ద‌ళితులు, ముస్లిమేత‌రుల‌ను ఎంఐఎం పోటీలో నిల‌ప‌గా.. వారిలో ఐదుగురు గెలిచారు..
ఈ ప‌రిణామంపై శివ‌సేన త‌న అధికారిక ప‌త్రిక సామ్నాలో తీవ్రంగా మండిప‌డింది..
ముస్లింల ప్ర‌యోజ‌నాలను కాపాడ‌టానికే పుట్టిన‌ ఎంఐఎం లాంటి పార్టీకి కొంద‌రు ద‌ళితులు, హిందువులు ఎలా మ‌ద్ద‌తు ఇచ్చార‌ని ఆక్రోశాన్ని వెళ్ల‌గ‌క్కింది...
మ‌రి ముస్లింల‌కు ఓటు హ‌క్కు తొల‌గించాలంటూ మేం చేసిన వ్యాఖ్య‌లు కూడా మా కొంప ముచ్చాయ‌న్న ఆత్మ‌విమ‌ర్శ‌ను మాత్రం చేసుకోలేదు..
*****************
మాయావ‌తి ద‌ళిత‌-బ్రాహ్మ‌ణ సిద్ధాంతాన్ని వాడుకుని రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని చూస్తుంటే.. ఎంఐఎం ముస్లిం-ద‌ళిత ఐక్య‌త దిశ‌గా పావులు క‌దుపుతోంది... ఔరంగాబాద్ మాదిరిగా ఇత‌ర ప్రాంతాల్లోనూ ద‌ళితులు ఎంఐఎంలో ప్ర‌త్యామ్నాయాన్ని వెతుకుంటే అది ప్ర‌ధాన పార్టీల‌కు పెద్ద‌త‌ల‌నొప్పే అవ‌డం ఖాయం...

No comments:

Post a Comment