1

1

Friday 5 February 2016

విద్యార్థుల విష‌యంలో మాన‌వ‌తా దృక్ప‌థాలు ఈ మంత్రుల‌కు క‌నిపించ‌వు..

ల‌లిత్ మోడీ కేసులో సుష్మా స్వరాజ్‌
ఇప్పుడు రోహిత్ కేసులో ద‌త్తాత్రేయ‌, స్మృతి ఇరానీ...
లేఖ‌లు రాయ‌డం, సిఫార్సులు చేయ‌డం వీళ్ల‌కు ఫ్యాష‌న్ కావొచ్చు..
ల‌లిత్ మోడీ కేసులో మాన‌వ‌తా దృక్ప‌థంతో స్పందించామ‌ని బుకాయింపు..
రోహిత్ కేసులో విశ్వ‌విద్యాల‌యాల‌ను ప‌రిర‌క్షించాల‌నే ల‌క్ష్యంతో స్పందించామ‌ని ఢాంబికాలు..
వీళ్లు ఏం చేసినా అది క‌రెక్టు అనుకోవాలంతే...
ఏముంది ఓ నెల‌, రెండు నెల‌లు మీడియాలో సీన్ న‌డుస్తుంది. త‌ర్వాత లలిత్ మోడీ కేసును మ‌రిచిన‌ట్లే ఈ కేసును జ‌నం మ‌రిచిపోతార‌న్న ధీమానేమో...!!
ఏది ఏమైనా జ‌నానికి ఉన్న‌ మ‌తి మ‌రుపు గుణం వీళ్ల‌కు వ‌రం అయింది..
******
నోట్ : ఆర్థిక ఉగ్ర‌వాది అయిన ల‌లిత్ మోడీ గారి విషయంలో మాన‌వ‌తా దృక్ప‌థాలు క‌నిపిస్తాయి... విశ్వ‌విద్యాల‌యంలో చ‌దువుకునే విద్యార్థుల విష‌యంలో మాన‌వ‌తా దృక్ప‌థాలు ఈ మంత్రుల‌కు క‌నిపించ‌వు.. ఏంటో ఈ విచిత్రం..

No comments:

Post a Comment