1

1

Saturday 19 December 2015

మా క‌రీంన‌గ‌ర్ కు బ‌దులు ఇంకో సిటీని స్మార్ట్ సిటీ చేయండి ప్లీజ్‌...

ఇది నా భావ‌న‌...
*************
కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల స్మార్ట్ న‌గ‌రాల జాబితాలోకి వ‌రంగ‌ల్‌, హైద‌రాబాద్ ను ఎంపిక చేసింది. అయితే హైద‌రాబాద్ విశ్వ‌న‌గ‌రం కాబ‌ట్టి దానికి బ‌దులు క‌రీంన‌గ‌ర్ ను స్మార్ట్ సిటీగా ప్ర‌క‌టించ‌మ‌ని మ‌న ముఖ్య‌మంత్రి కేసీఆర్ గారు కేంద్రానికి విజ్ఞ‌ప్తి చేశారు. నేను క‌రీంన‌గ‌ర్ వాసిని అయిన‌ప్ప‌టికీ మా జిల్లాకు బ‌దులుగా ఏ న‌ల్ల‌గొండ‌నో లేదా మ‌హ‌బూబ్ న‌గ‌ర్ నో లేదా నిజామాబాద్ నో స్మార్ట్ సిటీగా ప్ర‌క‌టించ‌మ‌ని విజ్ఞ‌ప్తి చేస్తే బాగుంటుంద‌ని భావిస్తున్నాను. ఎందుకంటే ఇప్ప‌టికే కొంద‌రు టీటీడీపీ నేత‌లు ఉత్త‌ర తెలంగాణ , ద‌క్షిణ తెలంగాణ అంటూ తెలంగాణ ప్ర‌జ‌ల‌ను చీల్చాల‌ని చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వ‌రంగ‌ల్‌, క‌రీంన‌గ‌ర్ రెండింటినీ స్మార్ట్ సిటీలుగా ప్ర‌క‌టించుకుంటే దాన్చి భూత‌ద్దంలో చూసే అవ‌కాశం లేక‌పోలేదు. అందుకే వెన‌క‌బ‌డిన న‌ల్ల‌గొండ‌, పాల‌మూరుల‌ను స్మార్ట్ సిటీలుగా మ‌ల‌చ‌డ‌మో చేయాలి. ఒక‌వేళ అవి న‌గ‌ర పాల‌క సంస్థ‌లు కాక‌పోతే జోన్ 6 లో నిజామాబాద్ ను స్మార్ట్ సిటీల జాబితాలో చేర్చ‌డ‌మో చేస్తే బాగుంటుంది... స్మార్ట్ సిటీ తో నా జిల్లా అభివృద్ధి చెంద‌డం క‌న్నా తెలంగాణ ప్ర‌జ‌లంతా ఎప్ప‌టికీ ఐక్యంగా ఉండట‌మే అతి ప్ర‌ధానం. తెలంగాణ యావ‌త్తు అభివృద్ధి ప‌థంలో ముందుకు సాగాలి. జై తెలంగాణ‌.. జై జై తెలంగాణ‌..

No comments:

Post a Comment