1

1

Saturday 19 December 2015

వేత‌న స‌వ‌ర‌ణ‌ను పార్ల‌మెంట్ స‌భ్యుల‌కు అమ‌లు చేస్తే బాగుంటుంది క‌దా..

25 రూపాయ‌ల‌కు కిలో బియ్యం
97 రూపాయ‌ల‌కు కిలో ప‌ప్పు
58 రూపాయ‌ల‌కు కిలో ప‌చ్చి కూర‌గాయ‌లు
38 రూపాయ‌ల‌కు కిలో కూర‌గాయ‌లు
*********
ఈ రేట్ల ఆధారంగా 18 వేల రూపాయ‌ల‌తో చిరుద్యోగి గౌర‌వ ప్రదంగా జీవించొచ్చ‌ని కేంద్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల వేత‌న స‌వ‌ర‌ణ సంఘం పేర్కొంది.. అందుకే 18 వేల క‌నీస వేత‌నాన్ని ప్ర‌తిపాదించామ‌న్నారు.
ఇంత‌కీ కిలో 25 రూపాయ‌ల‌కు ఎక్క‌డ బియ్యం ల‌భిస్తాయో? 97 రూపాల‌య‌కు కిలో కంది పప్పు ఎక్క‌డ ల‌భిస్తుందో కూడా వారు సెల‌వు ఇచ్చి ఉంటే బాగుండేదేమో..
కూరగాయ‌లు కూడా 38 రూపాయ‌ల‌కు కిలో, 58 రూపాయ‌ల‌కు కిలో ఎక్క‌డ ల‌భిస్తున్నాయో కూడా చెబితే బాగుండేది..
*************
పార్ల‌మెంట్ స‌భ్యుల‌కు, రాష్ట్రాల ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు వేత‌నాల‌ను ఎప్పుడు ప‌డితే అప్పుడు పెంచుకుంటారు.. మ‌రి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు అమ‌లు చేసే వేత‌న స‌వ‌ర‌ణ‌ను పార్ల‌మెంట్ స‌భ్యుల‌కు అమ‌లు చేస్తే బాగుంటుంది క‌దా... వాళ్లు కూడా 18 వేల‌తో గౌర‌వ ప్ర‌దంగా బ‌తుకుతారేమో..!!
దీనిపై చ‌ర్చ జ‌రిగితే బాగుంటుంది...

No comments:

Post a Comment