1

1

Saturday 19 December 2015

న్యాయం చ‌చ్చిపోయింది...

న్యాయం చ‌చ్చిపోయింది...
**************
ఏబీఎన్ కేసులో 500 రోజుల్లోనే సుప్రీంకోర్టు స్థాయికి వెళ్లి న్యాయాన్ని గెలిపించుకున్నాం అని సంక‌లు గుద్దుకుంటున్నారు.. ఏడాదిన్న‌ర‌లోనే న్యాయాన్ని గెలిపించుకున్నాం అంటున్నారు.. మ‌రి దాదాపు రెండుమూడేళ్లుగా(ఇంంకా ఎక్కువ రోజులుగానే కావొచ్చు) న్యాయం కోసం కోర్టు మెట్లు, పోలీసు స్టేష‌న్ మెట్లు ఎక్కిన మాజీ ఎంపీ రాజ‌య్య‌ కోడ‌లు సారిక‌కు మాత్రం ఈ న్యాయ వ్య‌వ‌స్థ‌, ఈ పోలీసు వ్య‌వ‌స్థ‌, ఈ మీడియా వ్య‌వ‌స్థ‌లు న్యాయం చేయ‌లేక‌పోయాయి... పాపం ఆమె న్యాయం కోసం కోర్టు మెట్లు ఎక్కితే రేటింగ్ ల కోసం ఫోన్ ఇన్‌లు తీసుకున్న ఛానెళ్లు ఉన్నాయి. లైవ్ షోలు చేసిన ఛానెళ్లు ఉన్నాయి.. అవ‌న్నీ వాటి రేటింగ్‌ల కోసం తాత్కాలికంగా ప‌డిన ఆరాటాలే.. ఆమె అభాగ్యురాలి ప‌క్షాన ఏ ఒక్క‌రూ నిల‌బ‌డ‌లేక‌పోయారు... చుట్టు ప‌క్క‌న ఉన్న జ‌నం కూడా అయ్యో పాపం అన్నారే కానీ ఏ ఒక్క‌రూ ఆమెకు అండ‌గా నిల‌వ‌లేదు.. న్యాయం కోసం సాగించిన ఒంట‌రి పోరులో పిల్ల‌ల‌తో స‌హా బ‌లైన సారిక కేసులో ఒక్క రాజ‌య్య కుటుంబ‌మే కాకుండా స‌మాజం, న్యాయ వ్య‌వ‌స్థ‌, పోలీసు వ్య‌వ‌స్థ మొత్త‌మూ దోషులేనేమో...!!
**********
ఏబీఎన్ కేసులో గెలిచింది నిజ‌మైన న్యాయ‌మో కాదో చెప్ప‌లేను కానీ సారిక విష‌యంలో మాత్రం నిజ‌మైన న్యాయం చ‌చ్చిపోయింది.. కాదు చంపేశారు.!!

No comments:

Post a Comment