1

1

Thursday 31 December 2015

క్రిమిలేయ‌ర్ పై అపోహ‌లు...

బీసీల‌కు క్రిమీలేయ‌ర్ ను ఒక్క త‌మిళ‌నాడు మిన‌హా దేశంలోని అన్నిరాష్ట్రాలు అమ‌లు చేస్తున్నాయి..
ఈ విష‌యాన్ని జాతీయ బీసీ క‌మిష‌న్ ఛైర్మ‌న్ జ‌స్టిస్ ఈశ్వ‌ర‌య్య గారు ఇటీవ‌ల చెప్పారు...
తెలంగాణ ప్ర‌భుత్వం ఇచ్చిన జీవోతో అటెండ‌ర్ల పిల్ల‌లు కూడా క్రిమీలేయ‌ర్ ప‌రిధిలోకి వ‌స్తార‌ని కొంద‌రు గ‌గ్గోలు పెడుతున్నారు..
వాస్త‌వానికి ఎవ‌రైనా బీసీ వ్య‌క్తి కేంద్ర ప్ర‌భుత్వ గ్రూప్ - ఏ ఉద్యోగాల‌కు(సివిల్స్‌) లేదా రాష్ట్ర ప్ర‌భుత్వంలో గ్రూప్ - 1 ఉద్యోగాల‌కు నేరుగా ఎంపికైనా లేదా ఎంపీలు, ఎమ్మెల్యేలు అయినా రాజ్యాంగ బ‌ద్ధ‌మైన ప‌ద‌వులు చేప‌ట్టితే మాత్రం వారి పిల్ల‌లు క్రిమీలేయ‌ర్ ప‌రిధిలోకి వ‌స్తారు...
40 ఏళ్ల లోపు ప్ర‌మోష‌న్ మీద గ్రూప్ - ఏ కు వెళితే మాత్ర‌మే వారికి క్రిమీలేయ‌ర్ వ‌ర్తిస్తుంది...
ఒక‌వేళ భార్యా భ‌ర్త‌లు ఇద్ద‌రూ కేంద్ర ప్ర‌భుత్వంలో గ్రూప్ - బీ ఉద్యోగులైతే వారి పిల్ల‌ల‌కు క్రిమీలేయ‌ర్ వ‌ర్తిస్తుంది...
ఇలా అనేకం ఉన్నాయి.. వాస్త‌వానికి క్రిమీలేయ‌ర్ అంశంపై త‌హ‌సీల్దార్ల‌కు కూడా స‌రైన అవ‌గాహ‌న లేదు..
ఇటీవ‌ల కొంద‌రు మేధావులు కూడా అటెండ‌ర్ల పిల్ల‌లు కూడా క్రిమీలేయ‌ర్ ప‌రిధి లోకి వ‌స్తారంటూ మాట్లాడుతుండ‌టం ఇంకా ఆశ్య‌ర్యాన్ని క‌లిగిస్తోంది..
నోట్ - ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లైన ఎన్టీపీసీ, సింగ‌రేణిలో ఉన్న‌త స్థానంలో ప‌నిచేస్తున్న బీసీల పిల్ల‌ల‌కు కూడా క్రిమీలేయ‌ర్ వ‌ర్తించ‌దు.. ఎందుకంటే వారి జీతం ఎక్కువ‌గా ఉన్నా కూడా వారిని గ్రూప్ - ఏ కింద ప‌రిగ‌ణించ‌రు..

No comments:

Post a Comment