1

1

Saturday 19 December 2015

శైలేష్ రెడ్డి ప్యానెల్‌కు జై కొట్టిన జ‌ర్న‌లిస్టులు..

జ‌ర్న‌లిస్టు హౌసింగ్ సొసైటీ ఎన్నిక‌ల్లో ప్ర‌స్తుత అధికారిక ప్యానెల్ మ‌రోమారు జ‌య‌భేరి మోగించింది.. ఈ ప్యానెల్‌కు చెందిన ఏడుగురు విజ‌యం సాధించ‌గా... రెహానా బేగ‌మ్ గారు, మంజ‌రి గారు కూడా జ‌య‌కేత‌నం ఎగ‌ర‌వేశారు.. గ‌త ఎన్నిక‌ల్లో మ‌హిళ‌ల‌కు త‌గిన ప్రాధాన్యం ద‌క్క‌లేదు.. కానీ ఈ సారి జ‌ర్న‌లిస్టులు మ‌హిళ‌ల‌కు 33 శాతం పోస్టులు క‌ట్ట‌బెట్టారు.. గెలిచిన 9 మందిలో ముగ్గురు మ‌హిళా జ‌ర్న‌లిస్టులు కూడా ఉండ‌టం విశేషం. 2010-14 మ‌ధ్య స‌మ‌యంలో తెలంగాణ ఉద్య‌మం, ఇత‌ర అంశాల మూలంగా పూర్తిస్థాయిలో ప‌నిచేసేందుకు ఆస్కారం ఈ ప్యానెల్‌కు ద‌క్క‌లేద‌ని స‌భ్యులు భావించారు. ఇప్పుడు సంక్షోభాలు లేక‌పోవ‌డంతో వీళ్లంతా జ‌ర్న‌లిస్టుల కోసం ఏదైనా చేస్తార‌న్న భావ‌న అంద‌రిలో ఉంది.. వీరిపై ఆశ‌లు పెట్టుకున్న జ‌ర్న‌లిస్టులంద‌రి క‌ల‌ల‌ను నెర‌వేర్చాల‌ని ఆశిస్తున్నా..
************
గెలిచిన వారు వీరే..
*****
డి.వెంకటాచారి ( ప్రస్తుత అధ్యక్షుడు),
ఆర్. శైలెష్ రెడ్డి (ప్రస్తుత కార్యదర్శి),
కొండవీటి జయప్రసాద్ (ప్రస్తుత సంయుక్త కార్యదర్శి అండ్ చీఫ్ ఎడిటర్ మెట్రో టీవీ ),
ఎం.ఎస్.హాష్మి.( ప్రస్తుత మేనేజింగ్ కమిటీ సభ్యులు, సియాసత్),
జి.సుబ్బారావు ( ఈనాడు),
కే.అరుణ జ్యోతి ( ఎన్ టీవీ),
కే.హరిందర్,( ఫ్రీలాన్సర్)
రెహానా బేగ‌మ్‌(మీడియా 24)
మంజ‌రి (సాక్షి)

No comments:

Post a Comment