1

1

Friday 5 December 2014

తెలంగాణ‌లో మొద‌ల‌వుతున్న అభివృద్ధి వార్త‌లు ఆంధ్రా ఎడిష‌న్ల‌కు వేయాలి క‌దా?


ఈనాడు ప‌త్రిక మొద‌టి పేజీలో ఈ రోజు వ‌చ్చిన ఆంధ్రాకు సాగ‌ర‌మాల‌? వార్త‌ను చూసి తొలుత ఆశ్చ‌ర్యం వేసింది..
త‌ర్వాత న‌వ్వొచ్చింది... ఎందుకంటే నిన్న కేసీఆర్ రాచ‌కొండ గుట్ట‌ల్లో విహంగ వీక్ష‌ణం చేసి ఔష‌ధ న‌గ‌రికి, చిత్ర న‌గ‌రి కోసం ఆ ప్రాంతాన్ని ఎంపిక చేశాడు..
దీని వ‌ల్ల దాదాపు 30 వేల కోట్ల పెట్టుబ‌డులు వ‌స్తాయి.. 70 వేల మందికి ఉపాధి వ‌స్తుంద‌ని చెప్పారు..
ఆ వార్త తెలంగాణ‌లో ప్ర‌ధానాంశ‌మైంది.. అంద‌రూ దానిపై చ‌ర్చిస్తున్నారు..
ఈ నేప‌థ్యంలోనే ఆంధ్రాలో ఏదో జ‌రుగుతుంద‌న్న‌ట్లు ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చే ఉద్దేశంలో భాగంగా పుట్టుకొచ్చిందే ఈ సాగ‌ర‌మాల‌?
లేక‌పోతే కేంద్రం ఓ ప్రాజెక్టు చేప‌ట్టాల‌ని భావిస్తుంద‌ట‌.... ఇంకా నిర్ణ‌యం తీసుకుందో లేదో తెలియ‌దు..
ఆ ప్రాజెక్టును ద‌క్కించుకోవాల‌ని ఆంధ్రా ప్ర‌భుత్వం కేంద్రానికి వారం త‌ర్వాత నివేదిక ఇవ్వాల‌ని చూస్తోంద‌ట‌..
డిసెంబ‌రు 17న కేంద్ర మంత్రివ‌ర్గంలో ప్రాజెక్టుపై చ‌ర్చించే అవ‌కాశం ఉండొచ్చ‌ట‌... ఇది కూడా ఖ‌రారు కాలేదు..
కానీ 5 వేల కోట్లు పెట్టుబ‌డులు, వేల మంది ఉపాధి అంటూ ఈనాడులో క‌థ‌నం వ‌చ్చేసింది...
రేపు మ‌ళ్లా కేసీఆర్ ఇంకా ఏదైనా ప‌ర్య‌ట‌న చేసి... ఫ‌లానా స్థాపించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించిన వెంట‌నే మ‌రో క‌థ‌నం ఇలాంటిదే వ‌స్తుంది..
------------------
ఇలాంటి క‌థ‌నాలు ఎన్నైనా ఈనాడు ప‌త్రిక రాసుకోవ‌డానికి స్వేచ్ఛ ఉంది... కానీ వాటిని ఆంధ్రా ఎడిషన్‌కు వేసుకుంటే బాగుంటుంది.. ఎందుకంటే రాచ‌కొండ లో ఔష‌ధ ప‌రిశ్ర‌మ‌, సినీ ప‌రిశ్ర‌మ‌కు సంబంధించిన నిన్న‌టి వార్త ఆంధ్రా ఎడిష‌న్ల‌కు ఎందుకు మొద‌టి పేజీలో వేసుకోలేదు... అది కూడా 70 వేల మందికి ఉపాధి క‌ల్పించే వార్త క‌దా... 30 వేల కోట్ల పెట్టుబ‌డుల వార్త క‌దా... మ‌రి ఆంధ్రాలో ప్రాజెక్టు రాక‌ముందే ఆ వార్త‌లు తెలంగాణ‌కు వేస్తున్న‌ప్పుడు తెలంగాణ‌లో మొద‌ల‌వుతున్న అభివృద్ధి వార్త‌లు ఆంధ్రా ఎడిష‌న్ల‌కు వేయాలి క‌దా?

No comments:

Post a Comment