1

1

Tuesday 12 January 2016

నిజ‌మైన మ‌హిళా నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు సీట్లు ఇవ్వండి ప్లీజ్‌...

నిజ‌మైన మ‌హిళా నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు సీట్లు ఇవ్వండి ప్లీజ్‌...
సీట్ల రిజ‌ర్వేష‌న్ల త‌ర్వాత వెలుగులోకి వ‌చ్చే నాయ‌కుడి భార్య‌కో, చెల్లికో, అక్క‌కో, కోడ‌లికో, వ‌దిన కో ఇవ్వ‌డం స‌రైన ప‌ద్ధ‌తి కాదు
***********
జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో మ‌హిళ‌ల‌కు 50 శాతం రిజ‌ర్వేష‌న్ ఇచ్చారు. అంటే స‌గం స్థానాల్లో మ‌హిళా అభ్య‌ర్థుల‌కే కేటాయిస్తారు. అయితే అన్ని పార్టీల్లోనూ పురుష నాయ‌కులు, మ‌హిళా నాయ‌కులు ఉన్నారు. పాపం పురుష నాయ‌కులు ఒక స్థానంపై ఆశ పెట్టుకుని ఉన్నారు. ఆ స్థానం మ‌హిళ‌ల‌కు రిజ‌ర్వు కావ‌డం తో ఏం చేయాలో తెలియ‌క వాళ్లంతా వాళ్ల స‌తీమ‌ణుల‌ను రంగంలోకి దింపుతున్నారు. వాళ్ల స‌తీమ‌ణులు అప్ప‌టి వ‌ర‌కు జ‌నంలో తిరిగిన వాళ్లు కాదు. క‌నీసం రాజ‌కీయ ప‌రిజ్ఞానం, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై అవ‌గాహ‌న లేదు. ఇలాంటి వారికి ఆయా పార్టీలు ఒక‌వేళ సీట్లు కేటాయిస్తే చివ‌ర‌కు భ‌ర్త‌లే పెత్త‌నం చెలాయిస్తారు. అందుకే పార్టీ కోసం ఎక్కువ‌గా శ్ర‌మించిన నిజ‌మైన మ‌హిళా నాయ‌కులకే అన్ని పార్టీలు సీట్లు ఇవ్వాలి. అంతే కానీ ఓ నాయ‌కుడి భార్య‌కో, చెల్లికో, అక్క‌కో, కోడ‌లికో, వ‌దిన కో ఇవ్వ‌డం మంచి ప‌ద్ధ‌తి కాదు. అయితే ఒక‌వేళ భార్యా భ‌ర్త‌లిద్ద‌రూ రాజ‌కీయాల్లో ఉంటే ఇవ్వ‌డం లో త‌ప్పు లేదు.. అంతే కానీ జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో మ‌హిళ‌కు సీటు రిజ‌ర్వు అయింది అన్న ఒక్క కార‌ణంతో ఇంట్లోని వ‌నిత‌ల‌ను పోటీల‌కు దించే వారికి ప్రాధాన్యం ఇవ్వొద్ద‌ని నా మ‌న‌వి. ఇంట్లో భ‌ర్త‌, పిల్ల‌లు, కుటుంబ స‌భ్యుల క‌న్నా ఎక్కువ‌గా పార్టీకి స‌మ‌యం కేటాయించిన నిజ‌మైన మ‌హిళా కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌కు అన్యాయం జ‌రుగుతుంది. ఈ విష‌యంపై అన్ని పార్టీలు దృష్టి సారిస్తే బాగుంటుంది.

No comments:

Post a Comment