1

1

Wednesday, 1 April 2015

మీరు ఆల‌స్యం చేసిన‌న్ని రోజులు భారం పెరుగుతుంది...

ఈ ప‌న్నుల భారం త‌ప్పించుకోవాలంటే ఒక‌టే మార్గం..
వీలైనంత త్వ‌ర‌గా కొత్త రాజ‌ధాని నుంచి పాల‌న‌ను ప్రారంభిస్తే.. ప్ర‌జ‌లు హైద‌రాబాద్‌కు రావ‌డం త‌గ్గిస్తారు..
వారిపై ర‌వాణా ప‌న్ను భారం ఉండ‌దు.. మీరు ఆల‌స్యం చేసిన‌న్ని రోజులు భారం పెరుగుతుంది...

ఉమ్మ‌డి హైకోర్టు ఉంటే ఇలానే ఉంటుందేమో..!!

ఆంధ్రాలో క‌రెంట్ బిల్లులు పెంచితే ఎవ‌రూ కోర్టుకు వెళ్ల‌లేదు.. ఎవ‌ర‌న్నా కోర్టుకు వెళ్లినా.. హైకోర్టు కూడా జోక్యం చేసుకోదు.. మ‌రి ఈ విష‌యంలో ఎందుకు జోక్యం చేసుకున్న‌ట్లు.. ఉమ్మ‌డి హైకోర్టు ఉంటే ఇలానే ఉంటుందేమో..!!

మొక్కులు చెల్లించడం అన్నీ నిజాం చేసిన ప‌నులే క‌దా...

కేసీఆర్ న‌యా నిజాం...మావోయిస్టులు(వాళ్లు అన్నారో లేదో కానీ రాధాకృష్ణ ప‌త్రిక అంటోంది)
అవున‌వును.. బ‌తుక‌మ్మ‌ను అధికారికంగా జ‌రిపించ‌డం, వివిధ కుల‌స్తుల‌కు భ‌వ‌నాలు క‌ట్టించ‌డం, హిందూ దేవాల‌యాల‌కు మొక్కులు చెల్లించడం అన్నీ నిజాం చేసిన ప‌నులే క‌దా...

ఏ నిర్ణ‌యం తీసుకున్నా మా అనుమ‌తి ఉండాల్సిందే..ఇదీ వారి తీరు..

ఆంధ్రా విద్యార్థులకు ఫీజులు క‌ట్టాలి..
ఆంధ్రా వాహ‌నాల‌కు ప‌న్నులు వేయొద్దు..
కృష్ణా, గోదావ‌రిలో నీటిలో మ‌న వాటా వాడుకోవ‌ద్దు..
శ్రీ‌శైలంలో జ‌ల విద్యుత్ ఉత్ప‌త్తి చేయొద్దు..
స‌మ‌గ్ర స‌ర్వేలు వ‌ద్దే వ‌ద్దు...
వాట‌ర్ గ్రిడ్‌లు చేప‌ట్టొద్దు...
జీహెచ్ఎంసీలో ప‌న్నులు వ‌సూలు చేయొద్దు..
హుస్సేన్ సాగ‌ర్ ప్ర‌క్షాళ‌న చేయొద్దు...
*************
ఇది సీమాంధ్ర మీడియా డిమాండ్‌... దీనికి కొంద‌రు తెలంగాణ నేత‌ల మ‌ద్ద‌తు.. !!

లాభ‌న‌ష్టాలు ఎలా ఉంటాయ‌ని బేరీజు వేసుకుంటుంద‌ట‌..

తెలంగాణ ప్ర‌భుత్వం ప‌న్ను వేస్తే ఆంధ్రా ప్ర‌భుత్వం త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతోంద‌ట‌...
మ‌న‌మూ వేద్దామా?  అని ఆలోచిస్తుంద‌టా...
ఒక‌వేళ మ‌న‌మూ వేస్తే లాభ‌న‌ష్టాలు ఎలా ఉంటాయ‌ని బేరీజు వేసుకుంటుంద‌ట‌..
ఒక‌వేళ ఆంధ్రా కూడా ప‌న్నులు వేస్తే లాభం ఉంటుంద‌ని తేలితే వేసేయ‌డం ఖాయ‌మే..!

పాలెం దుర్ఘ‌ట‌న‌లో చ‌నిపోయిన వారి కేసును హైకోర్టు తిర‌గ‌దోడితే బాగుంటుందేమో...

తెలంగాణ ప్ర‌భుత్వం వేసిన ప‌న్నుపై ప్రైవేటు బ‌స్సుల సంఘం హైకోర్టుకు వెళ్లిందట‌..
మ‌రి గా పాలెం దుర్ఘ‌ట‌న‌లో చ‌నిపోయిన వారి కేసును హైకోర్టు తిర‌గ‌దోడితే బాగుంటుందేమో...
ఆ బ‌స్సు ప్ర‌మాదంలో ఎంత మందిపై కేసు పెట్టారు.. ఎవ‌రిపై చ‌ర్య‌లు తీసుకున్నారో అడిగితే బాగుంటుందేమో..!
నోట్‌:  ఫాస్టు ప‌థ‌కంపైలాగే ఈ వ్య‌వ‌హారంలోనూ హైకోర్టు జోక్యం చేసుకుంటే మ‌న‌కు క‌ష్ట‌మే..

Tuesday, 31 March 2015

ఆంధ్రా వాహ‌నాల‌పై ప‌న్నులు వ‌ద్దు అంటూ కోర‌డం ఏంటి కిష‌న్‌రెడ్డి గారూ...

ఆంధ్రాకు కోడలుగా వెళ్లిన తెలంగాణ ఆడ‌ప‌డుచుల‌కు, తెలంగాణ‌లో పుట్టిన ఆంధ్రా మూలాలున్న వారికి ఆంధ్రా డీఎస్సీలో అవ‌కాశం ఇవ్వ‌న‌ప్పుడు కిష‌న్ రెడ్డి గారు ఎక్క‌డున్నారు...?
వారికి అవ‌కాశం ఇవ్వండి.. పాపం ఆంధ్రాకు కోడలుగా వెళ్ల‌డ‌మే త‌ప్పా... నాన్ లోకల్ కేట‌గిరీలో 15 శాతం పోస్టుల‌కు వారికి అవ‌కాశం ఇవ్వండి అని విజ్ఞ‌ప్తి చేశారా?   చేయ‌నే చేయ‌లేదు...
మ‌రి ఇప్పుడేమో.. ఆంధ్రా వాహ‌నాల‌పై ప‌న్నులు వ‌ద్దు అంటూ కోర‌డం ఏంటి కిష‌న్‌రెడ్డి గారూ...